కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన తాజా నోటిఫికేషన్ తో వైసీపీ ఫుల్లు హ్యాపీగా ఉంది. ఎందుకంటే శాసనమండలిలో ఖాళీగా ఉన్న, ఖాళీ అవబోతున్న స్ధానాలను భర్తీ చేయటమే ఇందుకు కారణం. మార్చి 29వ తేదీకి టీడీపీకి చెందిన ముగ్గురు సభ్యులు తిప్పేస్వామి, గుమ్మడి సంధ్యారాణి, వీవీవీ చౌదరి రిటైర్ అవబోతున్నారు. ఇక వైసీపీకి చెందిన మహమ్మద్ ఇక్బాల్ పదవీకాలం ముగుస్తోంది.
అలాగే మండలి సభ్యునిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభ ఎంపిగా వెళ్ళిపోయారు. దాంతో ఆ స్ధానం కూడా ఖాళీ అయ్యింది. ఇక వైసీపీ సభ్యుడు చల్లా రామకృష్ణారెడ్డి ఈమధ్యే మరణించిన విషయం తెలిసిందే. సో మొత్తం మీద 6 స్ధానాలు కూడా వైసీపీ ఖాతాలోనే పడతాయనటంలో సందేహం లేదు. అందుకనే అధికారపార్టీ నేతలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎంఎల్ఏ కోటాలో భర్తీ చేయబోయే స్ధానాలు కాబట్టే ఈ మేరకు శాసనమండలిలో వైసీపీ బలం పెరగటం ఖాయం.
ఆమధ్య మండలిలో ముఖ్యమైన రెండు బిల్లులు సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లు, మూడు రాజధానుల ఏర్పాటు బిల్లులను మండలిలో టీడీపీ అడ్డుకున్న విషయం అందరికీ తెలిసిందే. అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదంపొందిన బిల్లులు మండలిలో మాత్రం వీగిపోతున్నాయి. కేవలం మండలిలో మెజారిటి ఉన్నదన్న ఏకైక కారణంతోనే టీడీపీ నానా గోల చేస్తోంది. పోనీ నిబంధనలకు అనుగుణంగానే అడ్డుకుంటోందా అంటే అదీలేదు. ప్రభుత్వం కీలకమని భావించిన బిల్లులను టీడీపీ ఉద్దేశ్యపూర్వకంగానే సెలక్ట్ కమిటికి రిఫర్ చేయాలని రబస సృష్టిస్తోంది.
ఇదే పద్దతిలో మండలిలో ఇంకా కొంత కాలం కంటిన్యు అయ్య అవకాశాలున్న కారణంగానే విసిగిపోయిన జగన్మోహన్ రెడ్డి ఏకంగా శాసనమండలి రద్దుకే నిర్ణయం తీసుకున్నారు. మండలి రద్దును అసెంబ్లీలో ఏకంగా ప్రతిపాదన చేసి కేంద్రప్రభుత్వానికి పంపిన విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ తదితర కారణాలుగా ఆ ప్రతిపాదన ఏ దశలో ఉందో కూడా తెలీదు. అయితే మండలిలో మెల్లిగా వైసీపీ బలం పెరుగుతున్న నేపధ్యంలో జగన్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారేమో చూడాలి.
This post was last modified on February 19, 2021 10:55 am
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…