రవితేజ, నాని, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లాంటి చాలామంది టాలీవుడ్ హీరోలు ముందు దర్శకత్వ విభాగంలో పని చేసిన వాళ్లే. సీరియస్గా దర్శకులు కావాలన్న లక్ష్యంతోనే వాళ్లా విభాగాల్లో పని చేశారు. కానీ అనుకోకుండా నటనలోకి వచ్చారు. టాలీవుడ్లోనే కాదు..కోలీవుడ్లో కూడా ఇలాంటి హీరోలు లేకపోలేదు. వారిలో తెలుగువాడైన విశాల్ ఒకడు.
విశాల్ అన్న విక్రమ్ హీరో కావాలనుకుంటే.. విశాలేమో దర్శకుడు కావాలన్న లక్ష్యంతో పరిశ్రమలోకి వచ్చాడు. కొంత కాలం అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసి అనుకోకుండా ఇతను హీరో అయిపోయాడు. విక్రమ్ నిర్మాణంలోకి వెళ్లిపోయాడు. తాను ఏదో ఒక రోజు దర్శకత్వం చేపడతానని చాలా ఏళ్ల నుంచి విశాల్ చెబుతూనే ఉన్నాడు. గత ఏడాది అనుకోకుండా అతను మెగా ఫోన్ పట్టేశాడు.
తన హిట్ మూవీ తుప్పరివాలన్ (తెలుగులో డిటెక్టివ్) సీక్వెల్ నుంచి ఉన్నట్లుండి దర్శకుడు మిస్కిన్ తప్పుకోవడంతో విశాల్ మిగతా సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తయ్యాక మరో చిత్రంతో తాను పూర్తి స్థాయి దర్శకుడిగా మారనున్నట్లు విశాల్ తాజాగా వెల్లడించాడు. విశాల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ఇరుంబు తిరై (తెలుగులో అభిమన్యుడు) చిత్రానికి సీక్వెల్ రానుందని, దాన్ని తనే డైరెక్ట్ చేస్తానని విశాల్ వెల్లడించాడు. తన కొత్త చిత్రం చక్ర.. అభిమన్యుడుకు సీక్వెల్ అని చాలామంది అనుకుంటున్నారని, కానీ అది నిజం కాదని, ఇది పూర్తిగా వేరే కథతో తెరకెక్కిన చిత్రమని విశాల్ తెలిపాడు.
తన మిత్రుడు ఆర్యతో కలిసి చేస్తున్న ఎనిమీ చాలా బాగా వస్తోందన్న విశాల్.. త్వరలోనే శరవణన్ అనే లఘు చిత్ర దర్శకుడితోనూ ఓ సినిమా మొదలుపెట్టనున్నట్లు వెల్లడించాడు. చక్ర శుక్రవారమే తమిళ, తెలుగు భాషల్లో విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…