రాష్ట్రం ఏదైనా కానీ.. ముఖ్యమంత్రికి.. సెక్రటేరియట్ కు మధ్యనుండే అనుబంధం అంతా ఇంతా కాదు. వారి పాలన మొత్తం సచివాలయంలోనే సాగుతుంది. అయితే.. ఇందుకు మినహాయింపుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను చెప్పొచ్చు. ముఖ్యమంత్రిగా ఆరేళ్లు దాటిపోయి.. ఏడేళ్లలోకి అడుగు పెట్టబోతున్న వేళలో.. మొత్తంగా ఏడు సార్లు కూడా సచివాలయానికి వెళ్లని సీఎం ఎవరైనా ఉన్నారంటే.. అది కేసీఆరే అని చెప్పాల్సిన ఉంటుంది.
కారణం ఏమైనా.. కేసీఆర్ కు నచ్చలేదు.. సచివాలయానికి వెళ్లలేదన్నది నిజం. తాను అనుకున్నట్లే సచివాలయాన్ని కూల్చేసి.. కొత్తది కట్టే పనులను షురూ చేసిన ఆయనకు.. జనవరి 26న సెక్రటేరియట్ నిర్మాణాన్ని ఒకసారి చూడాలనిపించింది. అంతే.. ఆర్ అండ్ బి అధికారులకు సమాచారం ఇచ్చి టైం డిసైడ్ చేశారు. చెప్పినట్లే.. టైంకు సెక్రటేరియట్ కు వెళ్లిన ఆయన.. ప్లాన్ కాపీ పట్టుకొని.. ఎక్కడేం పనులు జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్నారు. నిర్మాణ ప్లాన్ లో ఎక్కడేం వస్తున్నాయో తెలుసుకున్నారు.
సాధారణంగా కేసీఆర్ రివ్యూ అంటే.. ఆరేడు గంటలకు తగ్గదు. కానీ.. సెక్రటేరియట్ నిర్మాణ విషయంలో మాత్రం అరంగటకే పరిమితం చేశారు. ఆ మాత్రం దానికే ఆయనకు విషయం అర్థం కావటం.. అధికారులకు.. నిర్మాణదారులకు వార్నింగ్ ఇచ్చేశారు కేసీఆర్. పనులు అనుకున్నంత వేగంగా సాగటం లేదని.. ఒక్కరోజు కూడా అదనంగా సమయం ఇచ్చే ప్రసక్తి లేదని.. తేడా వస్తే ఫైన్ కట్టాల్సి ఉంటుందని తేల్చేశారు. ప్రతిపాదనల్లో ఏమేం చెప్పారో.. నిర్మాణంలో ఏ ఒక్కటి మారకూడదన్న విషయాన్ని మరోసారి తేల్చేసిన ఆయన.. పనుల వేగానని పెంచాలన్న విషయాన్ని కచ్ఛితంగా చెప్పారు.
కేసీఆర్ రివ్యూ అంటే చాలు.. ఆయన ఎంత లోతుల్లోకి వెళతారో తెలిసిందే కదా. దానికి తగ్గట్లే తాజా ఉదంతంలోనూ అధికారులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. కేసీఆర్ ఉన్న అరగంట.. అధికారులకు వణుకు తెప్పించిందని చెబుతున్నారు. పునాదులు తీసే సమయంలో పెద్ద పెద్ద బండరాళ్లు రావటంతో ఇబ్బందులు ఏర్పడ్డాయని..పనులు నెమ్మదిగా సాగుతున్నట్లు చెప్పిన సాకు.. సీఎం కేసీఆర్ కు అస్సలు నచ్చలేదు. ఏమైనా.. అరగంట రివ్యూకే విషయం అర్థం కావటం.. తీవ్రమైన వార్నింగ్ ఇవ్వటం జరిగిపోయాయి. ఇప్పుడు సాగుతున్న లెక్కలో చూస్తే.. రెండేళ్లకు సచివాలయం పూర్తి అయినా ఆశ్చర్యమేనని చెప్పక తప్పదు.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…