Political News

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వెళ్లిందా?

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన ఓ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. లడఖ్‌లోని టుర్‌టుక్‌ నుంచి న్యుబ్రా వెళ్తున్న యూట్యూబర్‌ సుధీర్‌ కుమార్‌కు ఎదరుపై ఆసక్తికర అనుభవం ఇది. మొహర్రం సందర్భంగా మార్గంలో ప్రయాణికులకు కొందరు ఉచితంగా షర్బత్‌ అందిస్తున్నారు. అక్కడ ఓ చిన్నారి సుధీర్‌కు షర్బత్‌ అందిస్తూ డబ్బులు తీసుకునేందుకు నిరాకరించాడు.

మీరు ఎక్కడి నుంచి వస్తున్నారని ఓ చిన్నారి యూట్యూబర్ను అడిగినట్లు ఆ వీడియోలో ఉంది. ఈ సందర్భంగా సుధీర్‌ తనది ఆంధ్రప్రదేశ్‌ అని చెప్పడంతో.. పక్కనే ఉన్న చిన్నారి ఒక్కసారిగా ‘అమరావతినా?’ అని అడగడం ఆయనను ఆశ్చర్యానికి గురిచేసింది. లడఖ్‌ వంటి సుదూర ప్రాంతంలో ఓ చిన్నారి ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పేరు ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది.

సామాజిక మాధ్యమాల విస్తరణతో దేశంలోని వివిధ ప్రాంతాల మధ్య సమాచార మార్పిడి ఎంతగా పెరిగిందో ఈ ఘటన చాటి చెబుతోందని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. భాషలు, ప్రాంతాలు వేరైనా ఆత్మీయత, అతిథి మర్యాదలు మనుషులను దగ్గర చేస్తాయని పేర్కొంటున్నారు. సుధీర్‌ కుమార్‌ ఎదుర్కొన్న ఈ అనుభవానికి సంబంధించిన వివరాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఇదే సమయంలో వైసీపీ మావిగన్ అంటూ కొత్త ప్రతిపాదనను తీసుకురావడం కూడా ఈ సందర్భంగా చర్చకు వస్తోంది. దేశానికి ఒక చివర గడ్డకట్టే చలితో ఉండే లడఖ్‌.. మరో చివర వేడి, తేమతో కూడిన ఆంధ్రప్రదేశ్‌. భౌగోళికంగానే కాకుండా సంస్కృతీ సంప్రదాయాల్లోనూ ఈ రెండు ప్రాంతాల మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. అయితే మనుషులను, మనసులను కలిపేది ప్రాంతాలు, భాషలు కాదని.. ఆత్మీయత, అమాయకత్వమేనని లడఖ్‌లో చోటుచేసుకున్న ఓ చిన్న సంఘటన చాటిచెప్పింది. అయితే ఈ విషయం వైసీపీకి ఎందుకు అర్ధం కావడం లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.  

This post was last modified on September 11, 2026 7:39 am

Share

Recent Posts

ఢిల్లీ అష్ట‌దిగ్భంధం… ఏంటీ `బ్రిక్స్ స‌ద‌స్సు`?

దేశ రాజ‌ధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వ‌ర‌కు పోలీసుల ప‌హారాలో ఉండ‌నుంది. దాదాపు న‌గ‌రం…

6 hours ago

చిన్న శ్రీను శాంపిల్ మాత్ర‌మే.. మ‌రింత మంది సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్త‌రాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్య‌వ‌హారంతో పాటు.. పార్టీలో మ‌రింత మంది…

10 hours ago

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…

10 hours ago

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

14 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

14 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

15 hours ago