తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజే తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. నల్ల దుస్తులతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు తన చీర లాగేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు.
తన చీర లాగడం బాధ కలిగించిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మహిళా సభ్యులకే రక్షణ లేకపోతే రాష్ట్రంలోని మహిళలకు ఏం రక్షణ ఉంటుందని ఆమె ప్రశ్నించారు. పోలీసులు ఇష్టం వచ్చినట్లు చేతులు పట్టుకొని లాగారని, కింద పడేసి తొక్కారని ఆరోపించారు. తన కాలికి గాయమైందని, తన చీర లాగిన ఘటనపై ఫిర్యాదు చేస్తానని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
మరోవైపు, ఈ తోపుటాల సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జుట్టు పట్టుకొని పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీకి రమ్మని సవాల్ విసరుతారని, కానీ, తాము అసెంబ్లీకి వస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్న భయంతోనే అడ్డుకుంటున్నారని సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే పోలీసులపై కేటీఆర్, మాజీ మంత్రి తలసాని నిప్పులు చెరిగారు. ఈ రకంగా మహిళలను అవమానిస్తారా అంటూ పోలీసులపై కేటీఆర్ మండిపడ్డారు. అధికారం ఎల్లకాలం కాంగ్రెస్ దగ్గర ఉండదని, హద్దు మీరిన పోలీసులపై భవిష్యత్తులో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
This post was last modified on September 7, 2026 12:26 pm
ఒకప్పుడు తన సినిమాలకు బ్లాక్ టికెట్లు నడిచేంత మార్కెట్ ఎంజాయ్ చేసిన హీరో అల్లరి నరేష్. కామెడీ స్టార్ ట్యాగ్…
దర్శకుడు వశిష్ఠ మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. నిన్న అనౌన్స్ చేసిన నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ సినిమాకి దర్శకుడిగా లాక్ చేయడంతో…
పెద్ది వచ్చి నాలుగు నెలలవుతోంది. దానికన్నా ముందు రామ్ చరణ్ కున్న గ్యాప్ సంవత్సరంన్నర. అందుకే ఆర్సి 17 కోసం…
తెలంగాణలో టీడీపీ బలోపేతం చేయాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణలోనూ టీడీపీ కేడర్, లీడర్లు…
ఎందుకో స్టార్ హీరోలకు ఈ మధ్య 'గేమ్' టైటిల్ అచ్చి రావడం లేదు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చేసిన…
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం…