తెలంగాణాలో కొండా సురేఖ నుమంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయడం, తదుపరి పరిణామాల గురించి హాట్ హాట్ గా చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో అత్యధికులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తుండగా కొద్ది మంది మాత్రం కొండా సురేఖ వాదనలను బలపరుస్తున్నారు. అయితే కొందరు మేధావులు, రాజకీయ విశ్లేషకులు మాత్రం తెలంగాణా ఏర్పడిన తర్వాత రాజకీయ, సామాజిక, ఆర్ధిక పరిస్థితులను మననం చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరకు ముగ్గురు మంత్రులను మంత్రివర్గం నుంచి తొలగించినట్లు చర్చ జరుగుతోంది.
ఫస్ట్ వికెట్ రాజయ్య…
కెసిఆర్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా వ్యవహారిస్తున్న వైద్యారోగ్య శాఖ మంత్రి టి. రాజయ్య ను 2015 లో మంత్రివర్గం నుంచి తొలిగించడం పెద్ద సంచలనం సృష్టించింది. అప్పటి వరకు కెసిఆర్ కోటరీలో కీలకపాత్ర పోషించిన రాజయ్య మీద వేటు వేయడం, ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం చరిత్ర సాక్షిగా జరిగింది. స్వైన్ ఫ్లూ నివారణ చర్యల్లో అలసత్వం, వైద్య పరికరాల కొనుగోలులో అవకతవకలను కారణాలుగా పైకి చెప్పినప్పటికి వ్యక్తిగత విభేదాల వల్లనే రాజయ్యను తొలిగించారన్నది సుస్పష్టం.
సెకండ్ వికెట్ ఈటెల…
రాజయ్య మీద వేటు వేసిన తర్వాత సరిగ్గా ఆరేళ్లకు మరో మంత్రి ఈటెల రాజేందర్ పై వేటు వేశారు. రాజేందర్ కూడా వైద్యారోగ్య శాఖ మంత్రి కావడం కాకతాళీయమని చెప్పొచ్చు. ఇక్కడ కూడా అవినీతి కారణాలే చెప్పారు. మెదక్ జిల్లా అచ్చంపేట్, హకిమ్ పేట్ గ్రామాల్లో రైతులకు చెందిన భూములను రాజేందర్ కుటుంబానికి చెందిన జమున హెచరీస్ ఆక్రమించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణకు కూడా ఆదేశించారు. అయితే ఈటెల తొలగింపు పై తీవ్రమైన చర్చ జరిగింది. విపరీతంగా వాదనలు జరిగాయి. ఆ తర్వాత రాజేందర్ టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో తెలంగాణా ఉద్యమకారుల నుంచి వ్యతిరేకత వచ్చింది. తర్వాత సద్దుమణిగింది. ఆ తర్వాత ఎన్నికల్లో ఏకంగా టీఆర్ఎస్ టీం మొత్తం ఓటమి పాలైంది.
మూడో వికెట్ కొండా….
రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వేయి రోజులైంది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎవరో ఒకరు ఇబ్బందులు పెడుతూనే వున్నారు. ఇటీవల ఈ సమస్య ఎక్కువైంది. మంత్రులకు బదులుగా వారి కుటుంబ సభ్యులు కూడా గీత దాటి ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత ఉదంతం దీనికి ఉదాహరణ. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ కలిగిన కొండా సురేఖ ఆ మధ్య సినిమా నటుల వ్యవహారంలో తలదూర్చి చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు ఆమె కూతురు సుస్మిత విమర్శలతో పదవి పోగొట్టుకున్నారు. పార్టీలో ఆమెకు ప్రత్యర్థులు చాలా మందే వున్నారు. వారి వ్యవహారం శైలి కూడా బాగాలేదన్న విమర్శలున్నాయి. కానీ అధిష్టానాన్ని మెప్పించడంలో సురేఖ వెనకబడ్డారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా ఎన్నో ఉదాత్తమైన ఆశయాలతో తెలంగాణాను తెచ్చుకున్న ప్రజల మనోభావాలకు తగినట్లు పాలకులు వ్యవహరిస్తున్నారా లేదా అనేది కాలమే తేల్చాలి.
This post was last modified on September 5, 2026 6:27 am
కొన్ని ప్యాన్ ఇండియా సినిమాల ఫలితాలు చూస్తే పేరు గొప్ప ఊరు దిబ్బ సామెత గుర్తుకొస్తుంది. గత వారం విడుదలైన…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే గ్రేటెస్ట్ డైరెక్టర్లలో మణిరత్నం ఒకరు. భాషా భేదం లేకుండా దేశవ్యాప్తంగా ఆయనకు భారీ అభిమాన గణం…
చిన్న మూవీ, అందులోనూ కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో తీశారు. పైగా డివోషనల్ బ్యాక్ గ్రౌండ్. ఎంత దేవుడి…
టాలీవుడ్ గత పుష్కర కాలంలో పాన్ ఇండియా స్థాయిలో బాహుబలి, పుష్ప లాంటి అసాధారణ విజయాలను చూసింది. కానీ ఇప్పుడు…
`ఇంటింటికీ టీడీపీ` పేరుతో ఏపీ అధికార కూటమి పార్టీ టీడీపీ చేపట్టిన కార్యక్రమం సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. మరో…
ప్యాన్ ఇండియా సినిమాలకు వచ్చే అతి పెద్ద చిక్కు రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ ఒత్తిడి ఎక్కువైపోవడం. ఆ…