నటి జత్వానీ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సీనియర్ ఐపీఎస్ అధికారులు విశాల్ గున్ని, కాంతి రాణా టాటాలపై ఉన్న సస్పెన్షన్ను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. వారిని తక్షణమే విధుల్లోకి పునరుద్ధరిస్తూ గురువారం సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ పేరుతో ఉత్తర్వులు వెలువడ్డాయి.
అఖిల భారత సర్వీసుల క్రమశిక్షణ, అప్పీల్ నిబంధనల ప్రకారం గతంలో వీరిద్దరినీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అనంతరం సస్పెన్షన్ను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పొడిగించింది. తాజాగా వీరి సస్పెన్షన్ సెప్టెంబరు 4 వరకు అమల్లో ఉండగా, దాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సస్పెన్షన్ ఎత్తివేతకు సంబంధించి డీజీపీ (హెచ్ఓపీఎఫ్) సమర్పించిన నివేదికలను ప్రభుత్వం పరిశీలించింది. కాంతి రాణా టాటా ఆగస్టు 24న సమర్పించిన వినతిపత్రాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంది. అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం సస్పెన్షన్ ఎత్తివేయాలని నిర్ణయించింది.
అయితే జత్వానీ కేసుకు సంబంధించి వీరిపై కొనసాగుతున్న శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు, పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసులపై సస్పెన్షన్ ఎత్తివేత ఎలాంటి ప్రభావం చూపదని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్తర్వుల ప్రతులను ఇద్దరు అధికారులకు అందజేసి, వారి నుంచి రసీదు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది.
నటి జత్వానీ అరెస్టు వ్యవహారంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలతో పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నిలపై కేసులు నమోదయ్యాయి. అనంతరం ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసింది. ఇదే కేసులో ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పటికే పదవీ విరమణ చేశారు.
సస్పెన్షన్ ఎత్తివేసి విధుల్లోకి పునరుద్ధరించిన నేపథ్యంలో విశాల్ గున్ని, కాంతి రాణా టాటాలకు త్వరలోనే పోస్టింగ్లు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
This post was last modified on September 3, 2026 8:04 pm
రష్మిక మందన్నాది ప్రస్తుతం ఇండియాలో దాదాపుగా నంబర్ వన్ హీరోయిన్ స్థానం. తాజాగా ఇండియా టుడే కూడా ఆ విషయాన్ని…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన యాభై సినిమాకు చేరువవుతున్నాడు. ప్రస్తుతం పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న మూవీ షూటింగ్…
ఈ ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడిపోయింది. కానీ తర్వాత నాలుగు నెలల పాటు బాక్సాఫీస్లో హాహాకారాలు తప్పలేదు. నిఖార్సయిన…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా రూపొందిన 'ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్' సెప్టెంబర్ 11 విడుదల…
ఈ వారం విడుదలవుతున్న సినిమాల్లో సహ మీద సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో ఫోకస్ పడుతూనే ఉంది. హీరో…
జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ షూటింగ్ ప్రస్తుతం బ్రేక్ లో ఉన్న సంగతి విదితమే. తారక్…