వైసీపీ అధినేత జగన్ పేదల పక్షపాతి అని.. ప్రజలకు ఎంతో మేలు చేశారని.. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అయితే.. కొందరు.. ఇప్పుడు ఆయనను టార్గెట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అందుకే వ్యక్తిత్వ హనానికి పాల్పడుతున్నారని తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన.. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ మాజీ నాయకుడు వి. విజయసాయిరెడ్డి శనివారం సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలపై సజ్జల పరోక్షంగా స్పందించారు.
వైసీపీలో నెంబర్ 1 జగనేనని సజ్జల చెప్పారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారి గురించి మాట్లాడకూడదన్న నియమాన్ని తాము పాటిస్తున్నామని.. జగన్ తమకు నిర్దేశించిన సూత్రం ఇదేనని చెప్పారు. జగన్ కూడా పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిపై ఎప్పుడూ వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. సొంత కారణాలతోనే సాయిరెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు. అయితే.. బయటకు వెళ్లిపోయిన వారు జగన్ను టార్గెట్ చేయడం కొత్తకాదని తెలిపారు. వైసీపీని విమర్శించే తీరు మారడం లేదన్న సజ్జల కేవలం పాత్రలు మాత్రమే మారుతు న్నాయని వ్యాఖ్యానించారు.
ప్రజల సమస్యలను జగన్ ప్రస్తావిస్తున్నారని.. అయితే… వాటిని ఏదో ఒక విధంగా దారిమళ్లించేందుకు ఇలా విమర్శలు చేయిస్తున్నారని.. సజ్జల తెలిపారు. సుదీర్ఘకాలం పార్టీకి నేతృత్వం వహించే శక్తి జగన్కు ఉందని చెప్పారు. పార్టీలో అన్ని నెంబర్లు జగనేనని వ్యాఖ్యానించారు. పార్టీలో నెంబర్ 1, 2 అనేవి ఏవీ లేవన్నారు. జగన్తో 40 ఏళ్లుగా సాయిరెడ్డి కలిసి నడిచారని.. అలాంటి వ్యక్తి.. ఇప్పుడు జగన్పై విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇలా వ్యాఖ్యలు చేయడం ఆయనకు(సాయిరెడ్డికి) సరికాదని సజ్జల తెలిపారు.
ఇది దారుణం కాదా..
జగన్ హయాంలో మత మార్పిడులను ప్రోత్సహించారని సాయిరెడ్డి చెప్పడం దారుణం కాదా? అని సజ్జల ప్రశ్నించారు. జగన్ ఒకవేళ మత మార్పిడులను ప్రోత్సహించి ఉంటే.. సాయిరెడ్డిని కూడా మార్చేవారు కదా? అని అన్నారు. సాయిరెడ్డికి కొందరు ఉద్దేశ పూర్వకంగా పబ్లిసిటీ పెంచుతున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీలో కోటరీ ఉంటే అన్ని సంవత్సరాలు.. ఎలా ఉన్నారని ప్రశ్నించారు. వైసీపీలో ఏ పదవి అయినా.. బాధ్యతేనని.. అది అధికారం కాదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చెప్పినట్టు సాయిరెడ్డి విమర్శలు చేస్తున్నారని.. సజ్జల ఆరోపించారు.
This post was last modified on August 30, 2026 4:23 pm
హీరోయిన్లలో సూపర్ స్టార్ ఇమేజ్ చాలా కొద్దిమందే సంపాదించుకుంటారు. నయనతార ఆ కోవకే చెందుతుంది. సౌత్ ఇండియాలో తనకంటే వయసు…
విజయ్ దేవరకొండ ఈ రోజు టాలీవుడ్లో మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడిగా నిలబడ్డాడంటే.. పాన్ ఇండియా స్థాయిలో అతడికి మంచి…
ఒక భారీ పాన్ ఇండియా హిట్ కొట్టాక.. ఆ సక్సెస్ను నిలబెట్టుకోవడం అంత తేలిక కాదు. ‘బాహుబలి’తో దేశవ్యాప్తంగా అసాధారణమైన…
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 ఏళ్ళ క్రితం ఏ ముఖ్యమంత్రి అయితే వెలిగొండ ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేశారో…
ఇరుముడి ఎంత బ్లాక్ బస్టర్ అయినా ఇద్దరికీ మాత్రం దాని వల్ల పూర్తి ప్రయోజనం దక్కలేదని చెప్పాలి. మొదటి పేరు…
బాక్సాఫీస్ వద్ద టాక్సిక్ ఎదురీదుతున్న వైనం ఒకవైపు, కావాలని కొందరు నెగటివ్ పబ్లిసిటీ చేస్తున్నారని కన్నడ మూవీ లవర్స్ కొందరు…