హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అప్పటిదాకా నవ్వుతూ తమతో పనిచేసిన యువతి భోజనం పార్శిల్ తెచ్చుకునేందుకు వెళ్లి యాక్సిడెంట్ కు గురైందని లైఫ్ స్టైల్ లో పనిచేస్తున్న ఆమె సహోద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే, ఆగస్టు 16వ తేదీన మధ్యాహ్నం 3 గంటల సమయంలో జరిగిన ఈ యాక్సిడెంట్ చేసింది జనసేన నేత, రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ తనయుడు సంజూష్ అని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే సంజూష్పై పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేశారని తెలుస్తోంది. భారతి రోడ్డు దాటుతుండగా సంజూష్ నడుపుతున్న కారు ఆమెను ఢీకొట్టిందని తెలుస్తోంది. ఆ వెంటనే అదే కారులో భారతిని అపోలో ఆస్పత్రికి తరలించారని, తలకు బలమైన గాయం కావడంతో అప్పటికే భారతి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని తెలుస్తోంది. భారతి పనిచేస్తున్న లైప్ స్టైల్ స్టోర్ మేనేజర్ అశ్విని కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం సంజూష్ పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
This post was last modified on August 20, 2026 9:09 pm
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…
పిల్లల విషయంలో తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్యవహరించాలో చెప్పే ఉదంతమిది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని, వారిలో భయం పెంచాలని…
సీఎం రేవంత్ రెడ్డిపై, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన…
నందమూరి అభిమానుల ఎదురు చూపులను రెన్యూవల్ చేయడమే తప్ప ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడో చెప్పకుండా దోబూచులాడుతున్న మోక్షజ్ఞ మరోసారి వార్తల్లోకి…
ఈనెల 17 వ తేదీన ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నాలుగు రోజులపాటు జరిగాయి. బిజినెస్ అడ్వయిజరీ కమిటీలో…