Political News

భారత ఎన్నికల విధానం అమెరికాలో రావాలి: ట్రంప్

అమెరికా ఎన్నికల వ్యవస్థలో ఓటరు గుర్తింపు నిబంధనలను కఠినతరం చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా భారత్‌లో అమలవుతున్న ఓటరు గుర్తింపు విధానాన్ని ఆయన ప్రస్తావించారు. అమెరికా ఎన్నికల్లో ఓటు వేసేందుకు చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డును తప్పనిసరి చేయాలని పేర్కొన్నారు.

తన ‘ట్రూత్‌ సోషల్‌’ ఖాతాలో ట్రంప్‌ చేసిన పోస్టులో.. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇటీవల అమెరికా ఎన్నికల్లో చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు లేకుండా ఓటింగ్‌ ఎలా జరుగుతుందని తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల్లో అక్రమాలను అడ్డుకునేందుకు ప్రతి ఓటరుకు ఫొటో గుర్తింపు తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

భారత్‌లో జరిగిన తాజా సార్వత్రిక ఎన్నికల్లో 64.6 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారని ట్రంప్‌ పేర్కొన్నారు. వారిలో ఒక శాతానికి కూడా తక్కువ మంది మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేశారని, ప్రతి ఓటరుకూ చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు పత్రం ఉండాల్సిందేనని తెలిపారు.

అమెరికాలో ఓటరు నమోదు సమయంలో పౌరసత్వానికి ఆధారం చూపించడంతో పాటు, దేశవ్యాప్తంగా ఓటరు గుర్తింపు నిబంధనను అమలు చేయడం, పోస్టల్‌ ఓటింగ్‌పై పరిమితులు విధించడం వంటి ప్రతిపాదనలు ‘సేవ్‌ అమెరికా చట్టం’లో ఉన్నాయి. ఈ చట్టాన్ని వెంటనే ఆమోదించాలని ట్రంప్‌ కాంగ్రెస్‌ను కోరారు.

అమెరికా ఎన్నికల్లో ఓటరు అర్హత, గుర్తింపు, పోస్టల్‌ బ్యాలెట్‌ విధానంపై కొంతకాలంగా రాజకీయ చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌ ఎన్నికల విధానాన్ని ఉదాహరణగా చూపుతూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

This post was last modified on August 18, 2026 9:55 am

Share

Recent Posts

తండ్రికే ఎదురు తిరిగిన జోగి రాజీవ్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న టైంలో ఆ పార్టీ నేత‌, మాజీ మంత్రి జోగి ర‌మేష్ ఎంత‌గా రెచ్చిపోయారో…

11 minutes ago

అయ్యగారి ఫ్యాన్.. కరెక్ట్ గా వాడుకున్నారు కానీ..

'అయ్యగారే నెంబర్ వన్' డైలాగ్ తో సోషల్ మీడియాను షేక్ చేసిన అఖిల్ వీరాభిమాని నాగరాజు మళ్లీ వైరల్ అవుతున్నాడు.…

57 minutes ago

అంగన్వాడీ టీచర్ కు ఎమ్మెల్సీ ఛాన్స్?

ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీకి ఒక అంగన్వాడీ టీచర్ ను ఎంపిక చేసి నూతన…

1 hour ago

విద్యార్థుల పోరాటానికి దిగివచ్చిన మరో ప్రభుత్వం

ప్రస్తుతం దేశంలో జెన్ జీ హవా నడుస్తుంది. ఏ నిముషంలో కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం జరిగిందో కానీ దేశంలో…

1 hour ago

గ్యాప్ వచ్చినా గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు

బేబీ లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత ఆనంద్ దేవరకొండ మళ్ళీ స్పీడ్ పెంచలేదు. 2024 మే నెలలో…

5 hours ago

బీఫ్ ఇష్ట‌మా అని హీరోయిన్ని అడిగితే..?

ఫిలిం సెల‌బ్రెటీలు క‌నిపిస్తే చాలు.. కొంద‌రు మీడియా వాళ్ల‌కు ఎక్క‌డ లేని స్వేచ్ఛ వ‌చ్చేస్తుంది. వాళ్ల‌ను ఏమైనా అడిగ‌చేయొచ్చు అనుకుంటారు.…

5 hours ago