Political News

భారత ఎన్నికల విధానం అమెరికాలో రావాలి: ట్రంప్

అమెరికా ఎన్నికల వ్యవస్థలో ఓటరు గుర్తింపు నిబంధనలను కఠినతరం చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా భారత్‌లో అమలవుతున్న ఓటరు గుర్తింపు విధానాన్ని ఆయన ప్రస్తావించారు. అమెరికా ఎన్నికల్లో ఓటు వేసేందుకు చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డును తప్పనిసరి చేయాలని పేర్కొన్నారు.

తన ‘ట్రూత్‌ సోషల్‌’ ఖాతాలో ట్రంప్‌ చేసిన పోస్టులో.. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇటీవల అమెరికా ఎన్నికల్లో చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు లేకుండా ఓటింగ్‌ ఎలా జరుగుతుందని తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల్లో అక్రమాలను అడ్డుకునేందుకు ప్రతి ఓటరుకు ఫొటో గుర్తింపు తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

భారత్‌లో జరిగిన తాజా సార్వత్రిక ఎన్నికల్లో 64.6 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారని ట్రంప్‌ పేర్కొన్నారు. వారిలో ఒక శాతానికి కూడా తక్కువ మంది మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేశారని, ప్రతి ఓటరుకూ చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు పత్రం ఉండాల్సిందేనని తెలిపారు.

అమెరికాలో ఓటరు నమోదు సమయంలో పౌరసత్వానికి ఆధారం చూపించడంతో పాటు, దేశవ్యాప్తంగా ఓటరు గుర్తింపు నిబంధనను అమలు చేయడం, పోస్టల్‌ ఓటింగ్‌పై పరిమితులు విధించడం వంటి ప్రతిపాదనలు ‘సేవ్‌ అమెరికా చట్టం’లో ఉన్నాయి. ఈ చట్టాన్ని వెంటనే ఆమోదించాలని ట్రంప్‌ కాంగ్రెస్‌ను కోరారు.

అమెరికా ఎన్నికల్లో ఓటరు అర్హత, గుర్తింపు, పోస్టల్‌ బ్యాలెట్‌ విధానంపై కొంతకాలంగా రాజకీయ చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌ ఎన్నికల విధానాన్ని ఉదాహరణగా చూపుతూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

This post was last modified on August 18, 2026 9:55 am

Share

Recent Posts

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

4 minutes ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

4 minutes ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

1 hour ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

2 hours ago

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

3 hours ago

వంగ ఏం మాట్లాడినా కాంట్రవర్సీ తప్పదా

సోషల్ మీడియాలో రచ్చ లేపాలంటే సందీప్ రెడ్డి వంగ సినిమా తీయాల్సిన అవసరమే లేదని.. అతను యథాలాపంగా చిన్న కామెంట్…

3 hours ago