వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న టైంలో ఆ పార్టీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ఎంతగా రెచ్చిపోయారో గుర్తుండే ఉంటుంది. ఈ వివాదాస్పద నేత వైసీపీ అధికారం కోల్పోయాక గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసుకు తోడు.. అవినీతి వ్యవహారాలకు సంబంధించిన కేసులతో ఆయన పోరాడుతున్న సంగతి తెలిసిందే. వాటిని మించి కుటుంబ వివాదం జోగి రమేష్ ఇమేజ్కు పెద్ద తలనొప్పిగా మారింది.
గత ఏడాది తన కొడుకు జోగి రాజీవ్కు మేఘన అనే తెలంగాణ అమ్మాయితో పెళ్లి చేయగా.. ఏడాది తిరక్కముందే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. కొన్ని వారాల కిందట మేఘన రాజీవ్తో పాటు జోగి కుటుంబం మొత్తం మీద పలు సంచలన ఆరోపణలు చేస్తూ కేసు పెట్టడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తన భర్త వివాహానికి పనికి రాడని ఆరోపించడంతో పాటు తనపై అతను, తన అత్త మామలు గృహ హింసకు పాల్పడినట్లు, బలవంతపు మత మార్పిడికి ప్రయత్నించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
మీడియాలో, సోషల్ మీడియాలో ఈ వ్యవహారం కొన్ని వారాలుగా చర్చనీయాంశం అవుతుండగా.. ఇప్పుడీ వ్యవహారం మరింత రచ్చకెక్కింది. రాజీవ్, మేఘన కుటుంబాల మధ్య జరిగిన పంచాయితీకి సంబంధించిన వీడియోలు, ఆడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. అందులో ఒక వీడియోలో రాజీవ్.. తన తల్లిదండ్రులను తప్పుబట్టడం గమనార్హం. తాను అయిష్టంగానే మేఘనను పెళ్లి చేసుకున్నట్లు అతను స్పష్టం చేశాడు.
ఆమె ఫొటో చూడగానే తనకు ఏ ఫీలింగ్స్ కలగలేదని.. కానీ తన తల్లిదండ్రులు, మరికొందరు తనను బ్రెయిన్ వాష్ చేసి పెళ్లి చేశారని అతనన్నాడు. తండ్రిని వేలెత్తి చూపిస్తూ అంతా మీరే చేశారు అంటూ అతను నిందించడం గమనార్హం. మరో వీడియోలో రాజీవ్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. మేఘనను ఉద్దేశించి మాట్లాడుతూ.. నీకోసం పెళ్లి చేసుకోలేదు, మా అమ్మానాన్నల కోసం చేసుకున్నా అనగా.. మేఘన వాళ్ల కోసం నా జీవితాన్ని నాశనం చేశావా అంటూ మండిపడింది.
ఆ సమయంలో కొడుకునే కంట్రోల్ చేయడానికి జోగి రమేష్ ప్రయత్నించి విఫలమయ్యారు. తండ్రితో అప్పుడు కూడా రాజీవ్ చాలా దురుసుగా వ్యవహరించాడు. తనకు ఏసు ప్రభువు వీడియోలు చూపిస్తూ మతం మార్పిడి కోసం ప్రయత్నించినట్లు మేఘన ఆరోపించింది. మరోవైపు మేఘన కుటుంబీకులతో రాజీవ్ తల్లి మాట్లాడిన ఫోకల్ కాల్ ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. తామే 50 లక్షలు ఖర్చు చేసి పెళ్లి చేశామని, కనీసం మీరు ఒక చైన్ కూడా వేయలేదంటూ ఆమె అందులో పేర్కొంది.
This post was last modified on August 18, 2026 9:51 am
అమెరికా ఎన్నికల వ్యవస్థలో ఓటరు గుర్తింపు నిబంధనలను కఠినతరం చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా…
'అయ్యగారే నెంబర్ వన్' డైలాగ్ తో సోషల్ మీడియాను షేక్ చేసిన అఖిల్ వీరాభిమాని నాగరాజు మళ్లీ వైరల్ అవుతున్నాడు.…
ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీకి ఒక అంగన్వాడీ టీచర్ ను ఎంపిక చేసి నూతన…
ప్రస్తుతం దేశంలో జెన్ జీ హవా నడుస్తుంది. ఏ నిముషంలో కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం జరిగిందో కానీ దేశంలో…
బేబీ లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత ఆనంద్ దేవరకొండ మళ్ళీ స్పీడ్ పెంచలేదు. 2024 మే నెలలో…
ఫిలిం సెలబ్రెటీలు కనిపిస్తే చాలు.. కొందరు మీడియా వాళ్లకు ఎక్కడ లేని స్వేచ్ఛ వచ్చేస్తుంది. వాళ్లను ఏమైనా అడిగచేయొచ్చు అనుకుంటారు.…