Political News

మౌనం వీడిన మోడీ.. కానీ ఇది సరిపోదు!?

నీట్‌ పరీక్షల అంశంపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మరొకటి లేదని పేర్కొంటూ, ప్రశ్నాపత్రాల లీకేజీ కేసుల్లో నిందితులకు వేగంగా, కఠిన శిక్షలు పడేలా ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. సంబంధిత అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

అయితే, ప్రధాని స్పందనతోనే ఉద్యమం ఆగే పరిస్థితి కనిపించడం లేదు. నీట్‌ ఆందోళన చేస్తున్న విద్యార్థుల్లో చాలామంది సమస్యకు మూల కారణాలపై చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బాధ్యత వహింపజేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వ చర్యలు సరిపోవని, వ్యవస్థలో జవాబుదారీతనం కనిపించే వరకు పోరాటం కొనసాగుతుందని ఆందోళనకారులు చెబుతున్నారు.

ప్రధాని ప్రకటన తర్వాత ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ స్పందిస్తూ, యువత భవిష్యత్తును అత్యంతగా దెబ్బతీసింది మోదీ ప్రభుత్వమేనని ఆరోపించారు. దేశ విద్యా వ్యవస్థను బలహీనపరచడంతో పాటు, అందుకు బాధ్యులైన వారిని ప్రభుత్వం కాపాడిందని విమర్శించారు. విద్యార్థుల డిమాండ్లు స్పష్టంగా ఉన్నాయని పేర్కొంటూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే తొలగించాలని, విద్యార్థులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని, ఆందోళన చేస్తున్న విద్యార్థులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

This post was last modified on July 23, 2026 12:32 pm

Share

Recent Posts

తెలంగాణా కాంగ్రెస్లో టిక్.. టిక్.. టిక్

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…

2 hours ago

రంభ ఊర్వశి సరే… మరి అప్పట్లో ఎలా

సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…

2 hours ago

అభిమానుల విన్నపం నాగ్ పట్టించుకోలేదా

వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…

2 hours ago

భారత్ లోనే వివాహం చేసుకోండి

భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…

4 hours ago

జగన్ కేసుల లోగుట్టు సాయిరెడ్డి విప్పనున్నారా?

వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…

5 hours ago

ఆర్ఆర్ఆర్ కూడా ఇరుముడి వెనకే

ఇరుముడి సినిమాలో లీడ్ రోల్ చేసింది టాలీవుడ్ మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడైన రవితేజ. ఆయన నుంచి వచ్చిన చివరి…

6 hours ago