పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాకముందే రాజకీయాలు వేడెక్కాయి. సభలో గొడవలు వద్దు, తుఫాన్ సృష్టించొద్దు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. రాబోయే రోజుల్లో ప్రతిపక్షాలు లేవనెత్తబోయే నీట్ పేపర్ లీక్ లాంటి ఇష్యూలు హైలెట్ కానున్నాయి. అయితే సభలో ప్రధాని ఈ ప్రశ్నకు కౌంటర్ ఇస్తారా అనే దానికోసం అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే రెగ్యులర్ చర్చల వైపు మళ్లించేందుకు మోదీ ఇలా మాట్లాడారనే టాక్ విపక్షాల నుంచి వినిపిస్తోంది.
సభలో గొడవలు కాకుండా ఆధారాలతో కూడిన చర్చలు జరగాలనేది ఈ ప్రసంగం ముఖ్య ఉద్దేశ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రసంగంలో అంతరిక్ష రంగం ప్రస్తావన కూడా ఆసక్తికరంగా మారింది. 28 ఏళ్ల యువకులున్న స్కైరూట్ ఏరోస్పేస్ ఘనతను పొగుడుతూనే, వెంటనే 56 ఏళ్ల యువకుడి గురించి నేను మాట్లాడటం లేదు అంటూ రాహుల్ గాంధీపై ప్రధాని పరోక్షంగా పంచ్ వేశారు. దేశ ప్రగతిని యువత నడిపిస్తోందని చెబుతూనే, విపక్ష నాయకుడి వయసును టార్గెట్ చేయడం మోదీ మార్క్ స్టైల్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం ఈసారి తీసుకురాబోతున్న బిల్లుల జాబితా కూడా పెద్ద చర్చకే దారితీస్తోంది. ముఖ్యంగా సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను 33 నుంచి 37 కి పెంచాలనే ప్రతిపాదన న్యాయవ్యవస్థలో పెండింగ్ కేసుల పరిష్కారానికి అని చెప్తున్నా, దీనివల్ల భవిష్యత్తులో కోర్టుల తీర్పుల సరళి మారే అవకాశం ఉందనే అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.
దీనితో పాటు ఆదాయపు పన్ను సవరణ బిల్లు 2026, విదేశీ నిధుల నియంత్రణ వంటి బిల్లుల ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, దేశంలోకి వచ్చే నిధులపై మరింత నిఘా పెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఉన్నత విద్యా సంస్కరణల కోసం తెస్తున్న వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు 2025 ద్వారా ఉన్నత విద్యా రంగానికి సంబంధించిన నిబంధనలలో మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఆగస్టు 13 వరకు సాగే ఈ సమావేశాలలో విపక్షాలు నిరసనలకే పరిమితం కాకుండా, ప్రభుత్వం తెస్తున్న బిల్లుల లోతుపాతులను గట్టిగా ప్రశ్నించే అవకాశం ఉంది. మోదీ వేసిన పొలిటికల్ లైన్ చూస్తుంటే, సభలో ఈసారి బిల్లుల ఆమోదంతో పాటు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కూడా గట్టిగానే నడిచేలా కనిపిస్తోంది.
This post was last modified on July 20, 2026 5:45 pm
సినిమాకు హైప్ తీసుకురావడంలో ఒక్కో దర్శకుడిది ఒక్కో స్టైల్. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకులు తమ…
టీడీపీ ని నిలబెట్టింది కార్యకర్తలు.. వారి అండతోనే పార్టీ విజయం దక్కించుకుంటోంది- అని పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ…
దేశరాజధాని ఢిల్లీలో సోమవారం చోటు చేసుకున్న పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా అనేక వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. అందరి టార్గెట్ ఒక్కటే..…
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు లభించాయి. ఆయన వ్యవహరిస్తున్న తీరును పలువురు కేంద్ర మంత్రులు కొనియాడారు.…
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. 2024లో పార్టీ పగ్గాలు చేపట్టిన షర్మిలపై…
ప్రేమలు సినిమాతో మమిత బైజు అనే అమ్మాయి ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. అప్పటికే మలయాళంలో కొన్ని సినిమాల్లో నటించినా..…