జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా చెబుతుంటారు. పవన్ తన సొంత డబ్బులతో పార్టీని నడిపిస్తూ తన ఆస్తులు అమ్ముకున్న వైనంపై కూడా చర్చ జరిగింది. ప్రజాధనం అంటే పవన్ ఒప్పుకోరు అనేది ఎవరిని అడిగినా చెప్పే మాట.
డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ ప్రజాధనాన్ని తన సొంత దుర్వినియోగం చేయకుండా ఉన్న వైనంపై కూడా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే పవన్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ప్రభుత్వం నుంచి తన వైద్యానికి అయిన ఖర్చును ప్రజాధనం నుండి క్లెయిమ్ చేసే అవకాశమున్నా సరే పవన్ ఆ పని చేయలేదు.
పవన్ భుజానికి జరిగిన శస్త్ర చికిత్సకు అయిన ఖర్చు మొత్తం తన సొంత నిధుల నుంచే వెచ్చిస్తున్నారని జనసేన పార్టీ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆపరేషన్ తోపాటు ప్రయాణానికి అయ్యే ఖర్చులు మొత్తం స్వయంగా పవన్ భరిస్తున్నారు.
ఇప్పుడే కాదు, గతంలో ముక్కుకి జరిగిన శస్త్ర చికిత్స కోసం కూడా సొంత డబ్బులు పవన్ వాడారు. వాస్తవానికి కేబినెట్ మినిస్టర్ హోదాలో పవన్ తన చికిత్సకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం నుంచి పొందే అవకాశం ఉంది. కానీ, ప్రజాధనాన్ని వ్యక్తిగత అవసరాలకు వినియోగించకూడదన్న స్వీయ నిబంధనను పవన్ పాటిస్తూ మరెందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.
మరోవైపు, ఈ రోజు ఉదయం ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి పవన్ డిశ్చార్జ్ అయ్యారు. మరికొన్ని రోజుల పాటు ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. 3 వారాల పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత పవన్ ఫిజియోథెరపీ చేయించుకోవాల్సి ఉంటుంది. మరో 6 నెలల తర్వాత ఎడమ భుజానికి కూడా రొటేటరీ కఫ్ కు సంబంధించిన ఆపరేషన్ చేయించాల్సి ఉంది. ముంబై నుంచి పవన్ నేరుగా హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకుంటారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి..…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను…
లెనిన్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. వీక్ డేస్ లో నెమ్మదించినప్పటికీ చాలా ఏరియాలలో బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాలు…
ఏపీ మాజీ సీఎం జగన్ పై టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.…