మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వం తరఫున నిర్ణయించారు. నాలుగుసార్లు శాసన సభ్యుడిగా, ఒకసారి లోక్ సభ సభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా పద్మనాభం అందించిన సేవలకు గుర్తింపుగా ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే, అనూహ్యంగా ఆ నిర్ణయాన్ని ఆయన కుటుంబం తిరస్కరించింది.
అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని ముద్రగడ కుటుంబ సభ్యులు చెప్పిన విషయాన్ని వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వెల్లడించారు. జూలై 15వ తేదీ సాయంత్రం కిర్లంపూడిలో పద్మనాభం అంత్యక్రియలు జరుపేందుకు ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించారని తెలిపారు. ముద్రగడ బ్రతికి ఉన్న సమయంలో ఆయనను అనేక అవమానాలు, వేధింపులకు గురి చేశారని, అందుకే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను వారి కుటుంబ సభ్యులు తిరస్కరించారని వెల్లడించారు.
ముద్రగడ ఏనాడూ పదవుల కోసం ఆరాటపడిన వ్యక్తి కాదని, ప్రజా సమస్యలపై పోరాడిన మనిషి అని చెప్పారు. అటువంటి ప్రజా నాయకుడిని బ్రతికి ఉన్నప్పుడు వేధించిన ప్రభుత్వం ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తూ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
This post was last modified on July 15, 2026 2:30 pm
జూన్ నెలలో పెద్ది విడుదల ముందు వరకు దర్శకుడు బుచ్చిబాబు మీద మెగా ఫ్యాన్స్ ఒకటే కాదు ఇండస్ట్రీ జనాలు…
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…