Political News

చాలా రోజుల తర్వాత జగన్‌ ను అలా చూసి…

రాజకీయ నాయకులకు కొన్ని ప్రత్యేకమైన మేనరిజాలు, సిగ్నేచర్లు ఉంటాయి. అవే వారికి ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి కూడా అలాంటి ప్రత్యేక శైలి ఉంది. చాలా రోజుల తర్వాత అదే మేనరిజాన్ని మళ్లీ ప్రదర్శించడంతో వైసీపీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు.

2024 ఎన్నికలకు ముందు ప్రతి ఎన్నికల సభలో జగన్ ప్రసంగం ప్రారంభించే ముందు చేతిలోని మైక్‌ను తట్టి సౌండ్ చెక్ చేసేవారు. అనంతరం తాను ప్రసంగిస్తున్న ప్రాంతం పేరును గట్టిగా పలికి ప్రసంగాన్ని ప్రారంభించేవారు. ఇది ఆయనకు ప్రత్యేక గుర్తింపుగా మారింది.

ఎన్నికల తర్వాత దాదాపు రెండేళ్లకు భీమవరంలో నిర్వహించిన ఆక్వా రైతుల బహిరంగ సభలో జగన్ మళ్లీ అదే శైలిని ప్రదర్శించారు. వేదికపైకి వచ్చిన వెంటనే మైక్‌ను తీసుకుని సౌండ్ చెక్ చేసి, “భీమవరం” అని పిలవడంతో సభలో ఉన్న అభిమానులు పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు. “మా పాత జగన్ మళ్లీ కనిపించారు”, “జగన్ ఈజ్ బ్యాక్” అంటూ వైసీపీ కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

అదే సభలో జగన్ తనదైన శైలిలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇష్టానుసారంగా ఫీడ్ ధరలు పెంచి ఆక్వా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ట్రాన్స్‌ఫార్మర్ ధరలు తగ్గిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ హామీని అమలు చేశారా? అంటూ ప్రశ్నించారు. “గట్టిగా… ఇలా… ఇలా… ఇలా… అనండి” అంటూ తన మార్క్ డైలాగ్‌తో సభలో ఉత్సాహాన్ని నింపారు.

మొత్తానికి, చాలా రోజుల తర్వాత జగన్ తన పాత మేనరిజంతో కనిపించడంతో అభిమానులు ఉత్సాహం వ్యక్తం చేస్తూ ఆ దృశ్యాలను విస్తృతంగా పంచుకుంటున్నారు.

This post was last modified on July 15, 2026 2:27 pm

Share

Recent Posts

కాంగ్రెస్ లో క్రమశిక్షణ తప్పదా?

మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…

5 hours ago

మీరు టికెట్ ఇవ్వడానికి ఎవరు ఉండరు జగన్

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…

7 hours ago

రోమాంచకం… సరిపోతుందా సమయం

టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…

8 hours ago

హనుమాన్ దర్శకుడి హవా మొదలైంది

‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…

8 hours ago

అజ్ఞాతవాసి… పుచ్చుకున్నదంతా ఇచ్చేసిన త్రివిక్రమ్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…

9 hours ago

పంజాని మరో ఆరెంజ్ చేసేలా ఉన్నారు

ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…

9 hours ago