`RAW NTR` పేరుతో `ఊరూవాడా` సామాజిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారని.. ఈ నెల 18న జూనియర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారానికి… అసలు `RAW NTR` సంస్థకు తనకు కూడా ఎలాంటి సంబంధం లేదని జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం ఓ సంచలన ప్రకటన జారీ చేసింది. ఇలాంటి ప్రకటనలను నమ్మరాదని విశ్వసించరాదని కూడా పేర్కొనడం గమనార్హం.
ఎవరో జారీ చేసిన ప్రకటనలకు.. ఎవరో చెప్పిన మాటలకు ఎన్టీఆర్కు సంబంధం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఏకార్యక్రమమైనా.. తలపెట్టాలని అనుకుంటే.. ప్రజల కోణంలో సామాజిక కార్యక్రమాలు చేయాలని అనుకుంటే.. అవి నేరుగా ఎన్టీఆర్ కార్యాలయం నుంచే జరుగుతాయని.. ఎలాంటి ప్రకటన అయిన.. తారక్ ఆఫీసు నుంచి అధికారికంగానే బయటకు వస్తుందని.. వేరే సంస్థలతో మధ్యవర్తిత్త్వం అవసరం లేదని పేర్కొనడం గమనార్హం.
ఈ మేరకు తాజాగా మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఎన్టీఆర్ కార్యాలయం తెలిపింది. ఇటీవల సోషల్ మీడియా సహా.. ప్రధాన మీడియాలోనూ ఈ నెల 18న `RAW NTR` పేరుతో జూనియర్ ఎన్టీఆర్ ప్రజల మద్యకు వస్తున్నారని, ఊరూ-వాడా కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని ప్రకటన వచ్చింది. అంతే కాదు.. ఆ మర్నాడే.. ఈ వేదికగా జూనియర్ ఎన్టీఆర్.. ఓ పార్టీ స్థాపన విషయంపైనా ప్రకటన చేస్తారని వార్త లు వచ్చాయి. దీనిపై ముందుగానే స్పందించిన ఎన్టీఆర్ అభిమాన సంఘం రాజకీయ పార్టీ వ్యవహారానికి సంబంధం లేదని పేర్కొంది.
ముందుగానే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 18న ఊరూవాడా కార్యక్రమం మాత్రమే జరుగు తుందని తెలిపింది. అయితే.. తాజాగా అసలు ఈ కార్యక్రమానికి-ఎన్టీఆర్కు కూడా ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటూ ప్రకటన జారీ చేయడం గమనార్హం. ప్రధాన మీడియా సహా సోషల్ మీడియా సంస్థలుకూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని.. తప్పుదోవ పట్టించే వారి ప్రకటనలు విశ్వసించరాదని కూడా పేర్కొనడం గమనార్హం.
ప్రపంచమంతా ఒక సినిమా కోసం ఎదురు చూడటం చాలా అరుదు. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ది ఒడిస్సీ ఈ…
ఊరు వాడ పేరుతో ఎన్టీఆర్ అభిమానులు చేపడుతున్న సేవా కార్యక్రమాల వ్యవహారం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన సంగతి…
న్యాయస్థానంలో సాక్ష్యాధారాలే కీలకం. మూఢనమ్మకాలతో చట్టాన్ని ప్రభావితం చేయలేరు... అయితే అమాయకత్వమో.. మరి ఏమో కానీ తీర్పు తనకు అనుకూలంగా…
సినీ రంగంలో గొప్ప స్థాయికి చేరుకున్న చాలామంది దర్శకులు ఒకప్పుడు అనామకులే. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అవకాశాల కోసం కాళ్లరిగేలా…
ఒకే రోజు ఏపీలో రెండు ఘటనలు.. ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండ. మరొకటి పల్నాడు జిల్లా వినుకొండ. రెండు ప్రాంతాలు…
రాయలసీమను కూటమి ప్రభుత్వం పెట్టుబడుల సీమగా మారుస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నాయి. తాజాగా దాల్మియా సిమెంట్ భారీ…