`RAW NTR` పేరుతో `ఊరూవాడా` సామాజిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారని.. ఈ నెల 18న జూనియర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారానికి… అసలు `RAW NTR` సంస్థకు తనకు కూడా ఎలాంటి సంబంధం లేదని జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం ఓ సంచలన ప్రకటన జారీ చేసింది. ఇలాంటి ప్రకటనలను నమ్మరాదని విశ్వసించరాదని కూడా పేర్కొనడం గమనార్హం.
ఎవరో జారీ చేసిన ప్రకటనలకు.. ఎవరో చెప్పిన మాటలకు ఎన్టీఆర్కు సంబంధం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఏకార్యక్రమమైనా.. తలపెట్టాలని అనుకుంటే.. ప్రజల కోణంలో సామాజిక కార్యక్రమాలు చేయాలని అనుకుంటే.. అవి నేరుగా ఎన్టీఆర్ కార్యాలయం నుంచే జరుగుతాయని.. ఎలాంటి ప్రకటన అయిన.. తారక్ ఆఫీసు నుంచి అధికారికంగానే బయటకు వస్తుందని.. వేరే సంస్థలతో మధ్యవర్తిత్త్వం అవసరం లేదని పేర్కొనడం గమనార్హం.
ఈ మేరకు తాజాగా మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఎన్టీఆర్ కార్యాలయం తెలిపింది. ఇటీవల సోషల్ మీడియా సహా.. ప్రధాన మీడియాలోనూ ఈ నెల 18న `RAW NTR` పేరుతో జూనియర్ ఎన్టీఆర్ ప్రజల మద్యకు వస్తున్నారని, ఊరూ-వాడా కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని ప్రకటన వచ్చింది. అంతే కాదు.. ఆ మర్నాడే.. ఈ వేదికగా జూనియర్ ఎన్టీఆర్.. ఓ పార్టీ స్థాపన విషయంపైనా ప్రకటన చేస్తారని వార్త లు వచ్చాయి. దీనిపై ముందుగానే స్పందించిన ఎన్టీఆర్ అభిమాన సంఘం రాజకీయ పార్టీ వ్యవహారానికి సంబంధం లేదని పేర్కొంది.
ముందుగానే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 18న ఊరూవాడా కార్యక్రమం మాత్రమే జరుగు తుందని తెలిపింది. అయితే.. తాజాగా అసలు ఈ కార్యక్రమానికి-ఎన్టీఆర్కు కూడా ఎలాంటి సంబంధం లేదని పేర్కొంటూ ప్రకటన జారీ చేయడం గమనార్హం. ప్రధాన మీడియా సహా సోషల్ మీడియా సంస్థలుకూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని.. తప్పుదోవ పట్టించే వారి ప్రకటనలు విశ్వసించరాదని కూడా పేర్కొనడం గమనార్హం.
This post was last modified on July 14, 2026 11:49 pm
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా నటిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మహానటి తర్వాత…
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…