సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ ఉంటాము. ఇందుకు భిన్నంగా అభిమాన రాజకీయ నేతను కలుసుకునేందుకు ఏకంగా రైలు ఎక్కి వచ్చేశాడు ఈ బాలుడు. సీఎంతో ఫోటో దిగాలని సాహసం చేశాడు. రైలెక్కి ఏకంగా తాడేపల్లికి చేరుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం వేల్పూరి 13 ఏళ్ల సాయి చందు అనే బాలుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ అంటే ఎనలేని అభిమానం. తన మాటలలో తరచుగా తన అభిమానాన్ని వెలిబుచ్చేవాడు.
సాయి చందుకు చంద్రబాబు, లోకేష్ ను కలుసుకోవాలని కోరిక కలిగింది. దీంతో ఇంట్లో చెప్పకుండా తణుకు నుంచి రైలు ఎక్కి విజయవాడకు చేరుకుని, అక్కడి నుంచి మంగళగిరి కి వచ్చాడు. ఒంటరిగా అనుమానాస్పదంగా ఉన్న ఆ బాలుడి గురించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆ బాలుడిని తమ ఆధీనంలోకి తీసుకొని వివరాలు తెలుసుకున్నారు. బాలుడు తల్లిదండ్రులకు ఫోన్లో సమాచారం అందజేశారు. వారి సంబంధికులు రాగానే బాలుడిని అప్పజెప్తామని పోలీసులు తెలిపారు.
This post was last modified on July 13, 2026 11:17 pm
స్థానిక ఎన్నికలపై జనసేన త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…