సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ ఉంటాము. ఇందుకు భిన్నంగా అభిమాన రాజకీయ నేతను కలుసుకునేందుకు ఏకంగా రైలు ఎక్కి వచ్చేశాడు ఈ బాలుడు. సీఎంతో ఫోటో దిగాలని సాహసం చేశాడు. రైలెక్కి ఏకంగా తాడేపల్లికి చేరుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం వేల్పూరి 13 ఏళ్ల సాయి చందు అనే బాలుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ అంటే ఎనలేని అభిమానం. తన మాటలలో తరచుగా తన అభిమానాన్ని వెలిబుచ్చేవాడు.
సాయి చందుకు చంద్రబాబు, లోకేష్ ను కలుసుకోవాలని కోరిక కలిగింది. దీంతో ఇంట్లో చెప్పకుండా తణుకు నుంచి రైలు ఎక్కి విజయవాడకు చేరుకుని, అక్కడి నుంచి మంగళగిరి కి వచ్చాడు. ఒంటరిగా అనుమానాస్పదంగా ఉన్న ఆ బాలుడి గురించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆ బాలుడిని తమ ఆధీనంలోకి తీసుకొని వివరాలు తెలుసుకున్నారు. బాలుడు తల్లిదండ్రులకు ఫోన్లో సమాచారం అందజేశారు. వారి సంబంధికులు రాగానే బాలుడిని అప్పజెప్తామని పోలీసులు తెలిపారు.
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…
బాక్సాఫీస్ వద్ద లెనిన్ తప్ప జనాలకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఇతర కొత్త సినిమాలు విడుదలైనా వాటి గురించి…