సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ ఉంటాము. ఇందుకు భిన్నంగా అభిమాన రాజకీయ నేతను కలుసుకునేందుకు ఏకంగా రైలు ఎక్కి వచ్చేశాడు ఈ బాలుడు. సీఎంతో ఫోటో దిగాలని సాహసం చేశాడు. రైలెక్కి ఏకంగా తాడేపల్లికి చేరుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం వేల్పూరి 13 ఏళ్ల సాయి చందు అనే బాలుడికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ అంటే ఎనలేని అభిమానం. తన మాటలలో తరచుగా తన అభిమానాన్ని వెలిబుచ్చేవాడు.
సాయి చందుకు చంద్రబాబు, లోకేష్ ను కలుసుకోవాలని కోరిక కలిగింది. దీంతో ఇంట్లో చెప్పకుండా తణుకు నుంచి రైలు ఎక్కి విజయవాడకు చేరుకుని, అక్కడి నుంచి మంగళగిరి కి వచ్చాడు. ఒంటరిగా అనుమానాస్పదంగా ఉన్న ఆ బాలుడి గురించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆ బాలుడిని తమ ఆధీనంలోకి తీసుకొని వివరాలు తెలుసుకున్నారు. బాలుడు తల్లిదండ్రులకు ఫోన్లో సమాచారం అందజేశారు. వారి సంబంధికులు రాగానే బాలుడిని అప్పజెప్తామని పోలీసులు తెలిపారు.
This post was last modified on July 13, 2026 11:17 pm
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…
మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…
నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…