పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన సోమవారం.. రాజమండ్రిలోని ధవళేశ్వరం ప్రాజెక్టుకు కొత్త గేట్లను ఏర్పాటు చేసే పనులకు శ్రీకారం చుట్టారు. దాదాపు 50 ఏళ్ల కిందట ఒకసారి ఈ గేట్లు మార్చగా.. వాటిలో సుమారు 64 గేట్లు తుప్పుపట్టాయి. మరికొన్నింటికి వైరింగ్ దెబ్బతింది. దీంతో వాటిని మార్చే కార్యక్రమానికి కూటమి సర్కారు నడుం బిగించింది.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వంలో 32 గేట్లను మార్చామని.. తర్వాత వచ్చిన ప్రభుత్వం మిగిలిన వాటిని మార్చకుండా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఇప్పుడు తాము కొత్తవాటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒక్క గోదావరే కాకుండా.. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్ కొట్టుకుపోయినా.. వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినా.. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిందని దుయ్యబట్టారు.
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తాము తీసుకున్నామని.. ఆరు నూరైనా ఈ ప్రాజక్టు తొలిదశను వచ్చే జూన్ నాటికి పూర్తి చేస్తామన్నారు. గోదావరి పుష్కరాల నాటికి.. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తామన్నారు. పుష్కరాలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తామని తెలిపారు. ప్రాజెక్టులే రాష్ట్రానికి ఆర్థిక వనరులని వ్యాఖ్యానించిన చంద్రబాబు.. వాటిని పూర్తి చేసి.. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు.
పవన్ కల్యాణ్ మంచి మిత్రుడు
కూటమి ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ ఒక మంచి మిత్రుడని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆ యన కుడిభుజానికి ఆపరేషన్ అయిందని.. తాను ముంబై వెళ్లి పరామర్శించి వచ్చానని తెలిపారు. ఇప్పు డే ఆయన విధుల్లోకి వస్తానని చెప్పగా.. పూర్తిగా కోలుకున్నాకే రావాలని కోరినట్టు వెల్లడించారు. పవన్ కల్యాణ్ వంటి మిత్రులు కూటమికి ఎంతో అవసరమని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం దక్కించుకుంటుందని.. మొత్తం అన్ని స్థానాల్లోనూ గెలిచినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానించారు.
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…
బాక్సాఫీస్ వద్ద లెనిన్ తప్ప జనాలకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఇతర కొత్త సినిమాలు విడుదలైనా వాటి గురించి…
తెలంగాణలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని, ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ.. ప్రధాన ప్రతిపక్షం…
షాబాద్ లో ఆరుగురిని పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్ దారుణంగా హత్య చేసిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన…