ఏపీ రాజధాని అమరావతిపై చర్చ జరుగుతున్న సమయంలో కీలక అధికారి, మాజీ ఐఏఎస్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. అసలు ఎందుకిలా జరిగిందని ఆయన ప్రశ్నించారు. దీంతో ప్రస్తుతం సదరు అధికారి రాజీనామా వ్యవహారం కూడా చర్చకు దారి తీసింది.
ఎవరాయన?
మాజీ ఐఏఎస్ అధికారి ఎస్వీఆర్ శ్రీనివాస్. ఆయనను కూటమి ప్రభుత్వం ఏరికోరి తెచ్చుకుని అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ను చేసింది. మౌలిక సదుపాయాల కల్పన రంగంలో విశేషమైన అనుభవం ఉన్న నేపథ్యంలో రాజధానిలో మౌలిక సదుపాయాల విషయంలో శ్రీనివాస్ అనుభవాన్ని వినియోగించుకోవాలన్నది చంద్రబాబు ఆలోచన. ఆయన ఆధ్వర్యంలోనే అంతర్జాతీయ విమానాశ్రయం సహా.. ఎన్టీఆర్ నిలువెత్తు విగ్రహాలకు సంబంధించి డిజైన్లను కూడా రూపొందిం చారు.
అయితే.. శ్రీనివాస్ తనపదవికి రాజీనామా సమర్పించి.. వేరే రాష్ట్రానికి వెళ్లిపోయారు. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేయడంతోపాటు.. అసలు ఏం జరిగిందని కీలక అధికారులను ఆరా తీశారు. వాస్తవానికి గత పది రోజుల కిందటే శ్రీనివాస్ తన రాజీనామాను సమర్పించారు. కొద్దికాలంగా రాజధాని వ్యవహారంలో తన అధికారాలకు సంబంధించి శ్రీనివాస్ అసంతృప్తితో ఉన్నారన్న వాదన ఉంది. ఈ నేపథ్యంలోనే రాజీనామా సమర్పించారని తెలుస్తోంది.
సిఆర్డిఏ ఏర్పాటైన తరువాత ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తి రాజీనామా సమర్పించడం ఇదే తొలిసారి అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక, తన రాజీనామాలో శ్రీనవాస్.. తన తల్లి ఆరోగ్యం బాగోలేదని అందువల్లే తాను రాజీనామా సమర్పిస్తున్నానని పేర్కొన్నట్టు తెలిసింది. ఇదిలావుంటే.. ఓ మంత్రికి, శ్రీనివాస్కు మధ్య అంతర్గత వివాదాలు కొనసాగుతున్నాయని, తనకు కార్యాలయ నిర్వహణ, సిబ్బంది లేకుండా చేశారని శ్రీనివాస్ ఆరోపిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఇదే కాదు.. గతంలోనూ ఇద్దరు ఐఏఎస్ అధికారులు తమ పదవులను వదిలేసి వేరే విభాగాలకు వెళ్లిపో యారు. సీఆర్ డీఏ కమిషనర్లుగా పనిచేసిన కన్నబాబు సహా మరో అధికారి కూడా మంత్రితో విభేదించారన్న చర్చ అప్పట్లోనూ సాగింది. ప్రస్తుతం శ్రీనివాస్ రాజీనామాతో మౌలిక సదుపాయాల కార్యక్రమాలు కొంత మందగమనంలో సాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
జూన్ నెలలో పెద్ది, మా ఇంటి బంగారం తమ మీద పెట్టుకున్న ఆశలు నెరవేర్చాయి. తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే…
రిషికొండ పాలెస్ లను వినియోగంలోకి తీసుకువచ్చే దిశగా ఎట్టకేలకు ఓ కీలక అడుగు అయితే.పడింది. సాగర నగరం విశాఖ పర్యాటక…
బాలీవుడ్ మూవీ అల్ఫా ఇవాళ విడుదలైన సంగతి తెలిసిందే. అలియా భట్ టైటిల్ రోల్ పోషించగా శార్వరి వాఘ్ మరో…
మొజ్తబా ఖమేనీ. ప్రస్తుత ఇరాన్ సుప్రీం లీడర్. కానీ.. పేరుకే ఇది పరిమితం అయింది. ఆయన బయటకు వచ్చేందుకు.. ప్రజలకు…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు, ప్రస్తుత మంత్రి కొండా సురేఖ మళ్లీ అలిగారా? కీలకమైన మంత్రి వర్గ సమావేశానికి…
ఒకవైపు రాష్ట్రంలో సొమ్ములు లేవని.. ఎవరూ డబ్బులు డిమాండ్ చేయద్దని సాక్షత్తూ సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అంతేకాదు.. బీఆర్…