Political News

తుగ్ల‌క్ నిర్ణ‌యాలు ఆపండి జ‌గ‌న్‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై జ‌న‌సేన కీల‌క నాయ‌కుడు, మంత్రి కందుల దుర్గేష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తుగ్ల‌క్ నిర్ణ‌యాలు ఆపండి అంటూ జ‌గ‌న్‌పై ఫైర‌య్యారు. తాజాగా జ‌గ‌న్ చేసిన మావిగ‌న్ రాజ‌ధాని ప్ర‌క‌ట‌న‌పై మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. జ‌గ‌న్ త‌న మాట‌ల‌కు తానే నిల‌క‌డ లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. గ‌తంలో రాజ‌ధానికి జై కొట్టార‌ని.. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మూడు రాజ‌ధానుల పేరుతో మూడు ముక్క‌లాట ఆడార‌ని, రాజ‌ధాని రైతుల‌ను దుర్భాష‌లాడి వారిపై కేసులు కూడా పెట్టించార‌ని అన్నారు. 2024లో రాజ‌ధాని అమ‌రావ‌తికి ప్ర‌జ‌లు స్ప‌ష్ట‌మైన తీర్పు ఇచ్చార‌ని అన్నారు.

అయితే.. ఇప్పుడు మ‌ళ్లీ.. మావిగ‌న్ పేరుతో మ‌రో నాట‌కానికి తెర‌దీశార‌ని కందుల వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్య‌లు చూసి ప్ర‌జ‌లు న‌వ్వుకుంటున్నార‌ని, తుగ్ల‌క్ చ‌ర్య‌ల‌తో ఇప్ప‌టికే రాష్ట్రాన్ని దివాలా తీయించార‌ని దుయ్య‌బ‌ట్టారు. పెట్టుబ‌డులు కూడా వెన‌క్కి పోయాయ‌ని అన్నారు. వాటిని కూట‌మి ప్ర‌బుత్వం తిరిగి సాధిస్తోంద‌ని తెలిపారు. అదేస‌మ‌యంలో రాజ‌ధాని అనేది.. ఏ రాష్ట్రానికైనా గుండె వంటిద‌ని.. దానిని ప్ర‌తి ఐదేళ్ల‌కు ఒక‌సారి మారుస్తామంటే ప్ర‌జ‌లు స‌హించ‌ర‌ని వ్యాఖ్యానించారు. జ‌గ‌న్ ఈ విష‌యంలో ఏం ఆలోచ‌న చేస్తున్నారో కూడా అర్ధం కావ‌డం లేద‌ని అన్నారు.

ప్ర‌స్తుతం ప్ర‌జ‌లు 11 స్థానాల‌కు ప‌రిమితం చేసినా.. జ‌గ‌న్‌లో మార్పు రావ‌డం లేద‌ని కందుల దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పును కూడా అప‌హాస్యం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ప్ర‌జ‌లు రాజ‌ధానిగా అమ‌రావ‌తిని కోరుకుంటున్నార‌ని చెప్పారు. అందుకే కూట‌మి పార్టీల‌కు భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించార‌ని వ్యాఖ్యానించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను విజ‌యం ద‌క్కించుకుంటే మావిగ‌న్‌ను రాజ‌ధాని చేస్తాన‌ని చెబుతున్న జ‌గ‌న్‌.. ఇప్పుడే ఎన్నిక‌ల యావ‌లో ఉన్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. అధికారం పోయినా.. జ‌గ‌న్‌లో ఇంకా అహంకారం పోలేద‌ని అన్నారు.

రాష్ట్రంలో పాల‌న స‌వ్యంగా జ‌రుగుతోంద‌ని, ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నామ‌ని చెబుతున్నార‌ని కందుల వ్యాఖ్యానించారు. కానీ, జ‌గ‌న్ మాత్రం దుర‌దృష్ట‌క‌ర రాజ‌కీయాల‌కు తెర‌దీసి.. ఇంకా అజ్ఞానంలోనే జీవిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఐదేళ్లు ప్ర‌తిప‌క్షంలో కూర్చోమ‌ని వైసీపీకి ప్ర‌జ‌లు తీర్పు ఇస్తే.. దానిని వ‌దిలేసి, రాజ‌కీయాల‌కే ప‌రిమితం అవుతున్నార‌ని విమ‌ర్శించారు. జ‌గ‌న్ లాంటి విప‌క్ష నేత ఉండ‌డం రాష్ట్రానికి దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని అన్నారు.

Kumar

Recent Posts

జూలై మాసం… 8 హీరోలకు హిట్టివ్వాలి

2026 ఆరు నెలలు గడిచిపోయాయి. టాలీవుడ్ వరకు చూసుంటే కనీసం సూపర్ హిట్లని చెప్పుకునేవి పది సినిమాలు లేకపోవడం కొంత…

39 minutes ago

కుంభ‌మేళాలోనే అయోధ్య దోపిడీకి బీజం…?

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత అయోధ్య బాల రామ‌య్య‌కు భ‌క్తులు స‌మ‌ర్పించిన కానుక‌ల దోపిడీ వ్య‌వ‌హారంలో కీల‌క విష‌యం వెలుగు చూసింది.…

4 hours ago

ఆరుగురు పతివ్రతలకు అంత సీన్ ఉందా

రీ రిలీజుల ట్రెండ్ జనాలకు మొహం మొత్తిపోయేలా విసిగిస్తోంది. వారానికి ఒకటి రెండు క్రమం తప్పకుండా వీటిని వదులుతూ డిస్ట్రిబ్యూటర్…

9 hours ago

యూత్, మాస్ చాలు… ఇంకెవ‌రూ వ‌ద్దు

మాది ప‌క్కా ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌.. పిల్ల‌ల నుంచి వృద్ధుల వ‌ర‌కు అంద‌రూ చూడొచ్చు.. మాది కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ సినిమా…

11 hours ago

ట్రోల్ అవ్వడం జగన్ స్పెషాలిటీ

సీఎం జగన్ ప్రెస్ మీట్ లు అంటేనే ట్రోలింగ్ కు స్టఫ్ దొరికినట్లు అని సోషల్ మీడియాలో టీడీపీ, జనసేనకు…

11 hours ago

మణిరత్నం మార్కుతో మీడియం సినిమా

పరిచయమే అక్కర్లేని పేరు మణిరత్నం. దక్షిణాదిలో ఎందరో దర్శకులకు స్ఫూర్తిగా నిలిచిన ఈ సీనియర్ లెజెండ్ చాలా కాలంగా ఆయన…

12 hours ago