Political News

తుగ్ల‌క్ నిర్ణ‌యాలు ఆపండి జ‌గ‌న్‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై జ‌న‌సేన కీల‌క నాయ‌కుడు, మంత్రి కందుల దుర్గేష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తుగ్ల‌క్ నిర్ణ‌యాలు ఆపండి అంటూ జ‌గ‌న్‌పై ఫైర‌య్యారు. తాజాగా జ‌గ‌న్ చేసిన మావిగ‌న్ రాజ‌ధాని ప్ర‌క‌ట‌న‌పై మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. జ‌గ‌న్ త‌న మాట‌ల‌కు తానే నిల‌క‌డ లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. గ‌తంలో రాజ‌ధానికి జై కొట్టార‌ని.. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మూడు రాజ‌ధానుల పేరుతో మూడు ముక్క‌లాట ఆడార‌ని, రాజ‌ధాని రైతుల‌ను దుర్భాష‌లాడి వారిపై కేసులు కూడా పెట్టించార‌ని అన్నారు. 2024లో రాజ‌ధాని అమ‌రావ‌తికి ప్ర‌జ‌లు స్ప‌ష్ట‌మైన తీర్పు ఇచ్చార‌ని అన్నారు.

అయితే.. ఇప్పుడు మ‌ళ్లీ.. మావిగ‌న్ పేరుతో మ‌రో నాట‌కానికి తెర‌దీశార‌ని కందుల వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్య‌లు చూసి ప్ర‌జ‌లు న‌వ్వుకుంటున్నార‌ని, తుగ్ల‌క్ చ‌ర్య‌ల‌తో ఇప్ప‌టికే రాష్ట్రాన్ని దివాలా తీయించార‌ని దుయ్య‌బ‌ట్టారు. పెట్టుబ‌డులు కూడా వెన‌క్కి పోయాయ‌ని అన్నారు. వాటిని కూట‌మి ప్ర‌బుత్వం తిరిగి సాధిస్తోంద‌ని తెలిపారు. అదేస‌మ‌యంలో రాజ‌ధాని అనేది.. ఏ రాష్ట్రానికైనా గుండె వంటిద‌ని.. దానిని ప్ర‌తి ఐదేళ్ల‌కు ఒక‌సారి మారుస్తామంటే ప్ర‌జ‌లు స‌హించ‌ర‌ని వ్యాఖ్యానించారు. జ‌గ‌న్ ఈ విష‌యంలో ఏం ఆలోచ‌న చేస్తున్నారో కూడా అర్ధం కావ‌డం లేద‌ని అన్నారు.

ప్ర‌స్తుతం ప్ర‌జ‌లు 11 స్థానాల‌కు ప‌రిమితం చేసినా.. జ‌గ‌న్‌లో మార్పు రావ‌డం లేద‌ని కందుల దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పును కూడా అప‌హాస్యం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. ప్ర‌జ‌లు రాజ‌ధానిగా అమ‌రావ‌తిని కోరుకుంటున్నార‌ని చెప్పారు. అందుకే కూట‌మి పార్టీల‌కు భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించార‌ని వ్యాఖ్యానించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను విజ‌యం ద‌క్కించుకుంటే మావిగ‌న్‌ను రాజ‌ధాని చేస్తాన‌ని చెబుతున్న జ‌గ‌న్‌.. ఇప్పుడే ఎన్నిక‌ల యావ‌లో ఉన్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. అధికారం పోయినా.. జ‌గ‌న్‌లో ఇంకా అహంకారం పోలేద‌ని అన్నారు.

రాష్ట్రంలో పాల‌న స‌వ్యంగా జ‌రుగుతోంద‌ని, ప్ర‌జ‌లు సంతోషంగా ఉన్నామ‌ని చెబుతున్నార‌ని కందుల వ్యాఖ్యానించారు. కానీ, జ‌గ‌న్ మాత్రం దుర‌దృష్ట‌క‌ర రాజ‌కీయాల‌కు తెర‌దీసి.. ఇంకా అజ్ఞానంలోనే జీవిస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఐదేళ్లు ప్ర‌తిప‌క్షంలో కూర్చోమ‌ని వైసీపీకి ప్ర‌జ‌లు తీర్పు ఇస్తే.. దానిని వ‌దిలేసి, రాజ‌కీయాల‌కే ప‌రిమితం అవుతున్నార‌ని విమ‌ర్శించారు. జ‌గ‌న్ లాంటి విప‌క్ష నేత ఉండ‌డం రాష్ట్రానికి దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని అన్నారు.

This post was last modified on July 2, 2026 10:36 am

Share

Recent Posts

చెన్నై వేడుకలో ‘చిరంజీవి’ చమక్కులు

ఏదైనా వేడుకకు మెగాస్టార్ వస్తే ఆ అందమే వేరు. తన హాజరుతో పాటు మాటల మంత్రాలు వేసి ఆహుతులను మంత్రముగ్దులను…

6 hours ago

దర్శకుడు హీరో అయితే ఏమవుతుంది

దర్శకులు హీరోలు కావడం ఇండస్ట్రీకి కొత్త కాదు. కాకపోతే సక్సెస్ అయినవాళ్లు తక్కువ. ఉదాహరణకు ఎస్వి కృష్ణారెడ్డి మంచి పీక్స్…

7 hours ago

రా ఎన్టీఆర్… మూత ప‌డిపోయింది

గ‌త కొన్ని రోజులుగా మీడియాలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన రా ఎన్టీఆర్ సంస్థ వ్య‌వ‌హారంలో ఊహించ‌ని మ‌లుపు చోటు చేసుకుంది.…

7 hours ago

అస‌లైన ఐమాక్స్‌లో ఒడిస్సీ చూడాలంటే..?

ఐమాక్స్‌ లందు.. రియ‌ల్ ఐమాక్స్ వేరు అంటారు. ఈ ఫార్మాట్ మూడు ర‌కాల రేషియాల్లో ఉంటుంది. అందులో 70 ఎంఎం…

7 hours ago

అనిల్ ఇచ్చిన బూస్ట్ సరిపోతుందా

తెలుగులో బజ్ కోసం పోరాడుతున్న జన నాయకుడుకి అనిల్ రావిపూడిని రంగంలోకి దించడం ద్వారా టీమ్ తెలివైన ఎత్తుగడ వేసింది.…

8 hours ago

ఇంటా బ‌య‌టా… నీట్‌ నిప్పులు!

కేంద్ర ప్ర‌భుత్వానికి ఇంటా బ‌య‌టా కూడా.. నీట్ ప‌రీక్ష‌కు సంబంధించిన సెగ భారీగా త‌గులుతోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఈ…

9 hours ago