పోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్ చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇంజనీరింగ్ పరీక్షలు రాసేందుకు భగీరథ్ కు జూన్ 20 నుంచి 24 వరకు తెలంగాణ హైకోర్టు అనుమతినిచ్చింది. అయితే, తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలంటూ భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్ పై మాత్రం విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా బాధితురాలి వాదనలు విన్న తర్వాతే రెగ్యులర్ బెయిల్ పై నిర్ణయం తీసుకుంటామని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.
బండి భగీరథ్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని అతడి తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. భగీరథ్ ఏ తప్పూ చేయలేదని, పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తున్నాడని వాదించారు. కాబట్టి భగీరథ్ క రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
అయితే, ఆ బెయిల్ పిటిషన్పై నిర్ణయం తీసుకునే ముందు బాధితురాలి వాదన కూడా వినాల్సి ఉందని హైకోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ ప్రకారం కౌంటర్ దాఖలు చేయాలని బాధితురాలికి నోటీసులు జారీ చేశారు. ఈ కేసు తదుపరి విచారణను జూలై 3వ తేదీకి వాయిదా వేశారు. దీంతో, బాధితురాలి తరఫున ఆమె లాయర్లు ఏ విధంగా వాదనలు వినిపించబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఎల్లుండి కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆసక్తి ఏర్పడింది.
పెద్ది థియేటర్ రన్ దాదాపుగా ముగిసింది. నెలల రోజులు పూర్తి కావడంతో చాలా సెంటర్లలో నామ మాత్రపు వసూళ్లు వస్తున్నాయి.…
"ప్లేస్ నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే..టైమ్ నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే.. ఎప్పుడైనా సరే..…
దేశంలోని ఏ ఒక్క రాష్ట్రంలో లేని రీతిలో ఏపీలో మాత్రమే రసవత్తర రాజకీయం నడుస్తోంది. ఎన్నికలు ముగిసి రెండేళ్లు అవుతున్నా……
ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్ కంపెనీలు ఉద్యోగుల కోతల బాటలోనే కొనసాగుతున్నాయి. ఇటీవల మెటా వేలాది మంది ఉద్యోగులను తొలగించగా.. ఇప్పుడు…
టీడీపీ నేతృత్వంలో జనసేన, బీజేపీలు ఎన్డీఏ కూటమిగా ఏర్పడి 2024 ఎన్నికలలో పోటీ చేసి అఖండ విజయం సాధించిన సంగతి…
రాష్ట్రంలోని కూటమి సర్కారుపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రశ్నించిన వారి గళం నొక్కుతున్నారని.. వారి రౌడీషీటర్ అనే…