పోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్ చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇంజనీరింగ్ పరీక్షలు రాసేందుకు భగీరథ్ కు జూన్ 20 నుంచి 24 వరకు తెలంగాణ హైకోర్టు అనుమతినిచ్చింది. అయితే, తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలంటూ భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్ పై మాత్రం విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా బాధితురాలి వాదనలు విన్న తర్వాతే రెగ్యులర్ బెయిల్ పై నిర్ణయం తీసుకుంటామని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.
బండి భగీరథ్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని అతడి తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. భగీరథ్ ఏ తప్పూ చేయలేదని, పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తున్నాడని వాదించారు. కాబట్టి భగీరథ్ క రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
అయితే, ఆ బెయిల్ పిటిషన్పై నిర్ణయం తీసుకునే ముందు బాధితురాలి వాదన కూడా వినాల్సి ఉందని హైకోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ ప్రకారం కౌంటర్ దాఖలు చేయాలని బాధితురాలికి నోటీసులు జారీ చేశారు. ఈ కేసు తదుపరి విచారణను జూలై 3వ తేదీకి వాయిదా వేశారు. దీంతో, బాధితురాలి తరఫున ఆమె లాయర్లు ఏ విధంగా వాదనలు వినిపించబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఎల్లుండి కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఆసక్తి ఏర్పడింది.
This post was last modified on July 1, 2026 6:30 pm
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…
సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…
వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…