ట్రంప్ కు సుప్రీంకోర్టు షాక్… పౌరసత్వంపై కీలక తీర్పు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన బర్త్ రైట్ సిటిజన్ షిప్ పరిమితుల ప్రయత్నానికి అమెరికా సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. అమెరికాలో పుట్టిన పిల్లలకు రాజ్యాంగం కల్పించిన పౌరసత్వ హక్కును కొనసాగిస్తూ కీలక తీర్పు వెలువరించింది.

అక్రమ వలసదారులు లేదా తాత్కాలిక వీసాలపై ఉన్న వారి పిల్లలకు ఆటోమేటిక్ గా పౌరసత్వం ఇవ్వకూడదని ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉత్తర్వుపై పలు కోర్టుల్లో సవాళ్లు దాఖలయ్యాయి. చివరకు ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు చేరింది.

విచారణ అనంతరం అమెరికా రాజ్యాంగంలోని పద్నాలుగో సవరణ ప్రకారం అమెరికాలో జన్మించిన వారికి పౌరసత్వ హక్కు వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పాత న్యాయ తీర్పులను కూడా కోర్టు ప్రస్తావించింది.

ఈ తీర్పు ట్రంప్ వలస విధానాలకు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే రాజ్యాంగ పరిమితులను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికి అమెరికాలో జన్మించిన వారికి బర్త్ రైట్ సిటిజన్ షిప్ కొనసాగుతుందనే అంశంపై సుప్రీంకోర్టు మరోసారి స్పష్టత ఇచ్చింది. దీంతో ఈ అంశంపై నెలకొన్న అనిశ్చితికి తెరపడినట్టైంది.