Political News

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు వ‌చ్చింద‌ని నేను అనుకుంటున్నా. ఆ పార్టీని ప్ర‌జ‌లు ఎప్పుడో ప‌క్క‌న పెట్టేశారు. ఇప్పుడు ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసే పార్టీలు, రాష్ట్రం కోసం ప‌నిచేసే నాయ‌కులు ఉన్నారు. వ్య‌క్తిగ‌త స్వార్థం కోసం.. ప‌నిచేసేవారు ఎవ‌రూ లేరు. రాజ‌కీయాలు మ‌రీ అంత చెడిపోలేదు. చెడ్డ‌వి కూడా కావు. రండి. రాజ‌కీయ పార్టీల్లో చేరండి. అని మంత్రి నారా లోకేష్ యువ‌త‌కు పిలుపునిచ్చారు.

ముఖ్యంగా ఇంట‌ర్‌, డిగ్రీ త‌ర్వాత యువ‌త ఐఏఎస్‌, ఐపీఎస్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. ఇది మంచిదేన‌ని, అదేస‌మ‌యంలో యువ‌త రాజ‌కీయాల‌పైనా దృష్టి పెట్టాల‌ని లోకేష్ సూచించారు. రాజ‌కీయాల్లో ఉంటే మ‌రింత‌గా ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు అవ‌కాశం ఉంటుంద‌న్నారు. అంతేకాదు ప్ర‌భుత్వంలో ఉంటే.. స‌ద‌రు నాయ‌కులు ప్ర‌జ‌ల‌కు ఆమోద‌యోగ్య‌మైన‌, అభివృద్ధిక‌రమైన నిర్ణ‌యాలు తీసుకుంటే అది యావ‌త్ రాష్ట్రానికి, త‌ర్వాత దేశానికి కూడా మేలు జ‌రుగుతుంద‌ని సూచించారు. రాజ‌కీయాల్లో యువ‌త‌కు ప్ర‌త్యేక స్థానం ఉంద‌ని చెప్పారు.

తాజాగా ఇంట‌ర్‌, ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల్లో ఉత్త‌మ మార్కులు సంపాయించుకున్న ప్ర‌భుత్వ కాలేజీలు, స్కూళ్ల విద్యార్థుల‌ను తాడే ప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో నారా లోకేష్ ఘ‌నంగా స‌త్కరించారు. వీరిని షైనింగ్ స్టార్స్‌ పేరుతో స‌త్క‌రించారు. అనంతరం.. విద్యార్థుల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాజ‌కీయాల్లో యువ‌త‌కు ప్ర‌స్తుతం కీల‌క పాత్ర ఉంద‌ని తెలిపారు. వ‌చ్చే 10 సంవ‌త్స‌రాల్లో రాష్ట్ర రాజ‌కీయ ముఖచిత్ర‌మే కాకుండా.. దేశ‌రాజ‌కీయాలు కూడా చాలా వ‌ర‌కు మార్పు చెందుతాయ‌న్నారు. అప్పుడు యువ‌తకు మంచి భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని చెప్పారు.

ఇక‌, రాష్ట్రంలో కూట‌మి స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత‌.. పాఠ‌శాల‌లు, కాలేజీల్లో జ‌రిగిన మార్పుల‌ను వివ‌రించారు. నాణ్య‌మైన విద్యను అందించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామ‌న్నారు. త‌ద్వారా ప్ర‌తి విష‌యంలోనూ విద్యార్థులు విజ్ఞానాన్ని పెంచుకునేందుకు అవ‌కాశం ఏర్ప‌డింద‌ని తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రికీ విద్య‌ను చేరువ చేయ‌డ‌మే ల‌క్ష్యంతోపాటు.. విలువ‌ల‌తో కూడిన విద్య‌ను అందించాల‌న్న‌దే త‌మ ధ్యేయ‌మ‌న్నారు. ఇక‌, ఫ‌లితాల‌ను చూసి విద్యార్థులు నిరాశ చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని, తొలినాళ్ల‌లో ఓట‌ములు ఎదురైనా.. గెలుపు కోసం ప్ర‌య‌త్నించాల‌ని దిశానిర్దేశం చేశారు. మంగ‌ళ‌గిరిలో 2019లో తాను ఓడినా.. ప‌ట్టుద‌ల‌తో శ్ర‌మించి 2024లో విజ‌యం ద‌క్కించుకున్న విష‌యాన్ని ఆయ‌న వివ‌రించారు.

This post was last modified on June 29, 2026 9:26 pm

Share

Recent Posts

భీమవరం బ్యాగ్రౌండ్ ఉన్నా వాడుకోలేదా రవితేజ…

ఏ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి చాలా కష్టపడి పెద్ద స్టార్లలో ఒకడిగా ఎదిగాడు మాస్…

1 hour ago

అనుపమకు నరకం చూపించిన అపరిచితుడు

తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న మ‌ల‌యాళ భామ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప‌దేళ్ల కెరీర్లో పెద్ద‌గా ఎఫైర్ వార్త‌లేమీ వ‌చ్చింది లేదు.…

2 hours ago

షూట్ లేకున్నా ప్రభాస్ ఫౌజి సెట్లోనే

ప్ర‌భాస్ సినిమా అంటే చాలు.. హైప్‌కు ఏమీ లోటు ఉండ‌దు. రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డేకొద్దీ అభిమానుల‌తో పాటు సామాన్య ప్రేక్ష‌కుల్లోనూ…

2 hours ago

జెన్ జీ ఎఫెక్ట్… కేటీఆర్ ను సీఎం చెయ్యాలంటున్న కేసీఆర్?

ఇదేమీ ఊహాజ‌నిత వార్త‌కాదు. కొంద‌రు పుట్టించిన గ్యాసిప్ కూడా కాదు!. అక్షరాలా.. తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ పార్టీలో గ‌త…

3 hours ago

అయ్య‌న్న‌ అలా.. జ‌గ‌న్ ఇలా… ఇద్ద‌రి ఆశ‌లూ తీరేనా?

ఏపీ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు.. ఎప్ప‌టి నుంచో ఒక మాట చెబుతున్నారు. చెప్ప‌డ‌మే కాదు.. అంత‌ర్జాతీయ వేదికల‌పైనా ఆయ‌న త‌న వాణిని…

5 hours ago

‘ఇరుముడి’ సరుకులు… అన్నీ సరిపోయాయి

మాస్ మహారాజా రవితేజ ఇరుముడి ఆగస్ట్ 21 విడుదల కానుంది. వరస ఫ్లాపుల నుంచి బయటపడేసే సినిమాగా అభిమానులు దీని…

6 hours ago