Movie News

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి ఈ పోస్టర్ సోషల్ మీడియాలో కార్చిచ్చులా అల్లుకుని ఉండాల్సింది. కానీ అంత ఊపు కనిపించడం లేదు. అభిమానులు, టాలీవుడ్ లవర్స్ నుంచి స్పందన భారీగా ఉంది కానీ న్యూట్రల్ హ్యాండిల్స్, ఇతర భాషల ఫ్యాన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ అయితే లేదు. కారణం సింపుల్. థీమ్ ని చెప్పే ఉద్దేశంలో టీమ్ ఏఐ టెక్నాలజీ మీద ఆధారపడటమే.

మేకర్స్ ఎవరైనా ఏ సినిమా అయినా గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటుంది. ఏఐ వాడకం చాలా సులువైపోయింది. ఎలా వాడాలో అర్థం కాకపోతే అదే ఏఐని టిప్స్ అడిగితే చిన్న పిల్లాడికి పాఠం చెప్పినట్టు అప్పజెబుతోంది. దాన్ని ఫాలో అవుతూ అద్భుతాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంజినీరింగ్, సాఫ్ట్ వేర్ నైపుణ్యం అవసరం లేకుండానే తమ టాలెంట్ చూపిస్తున్నారు. అలాంటప్పుడు వందల కోట్లు ఖర్చు పెడుతున్న ప్యాన్ ఇండియా మూవీస్ విఎఫ్ఎక్స్ క్వాలిటీ విషయంలో ఏ మాత్రం అలసత్వం చూపించకూడదు.

దీనికే కాదు డ్రాగన్ టీజర్ వీడియోలో సగం ఏఐతోనే డిజైన్ చేయించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆర్టిస్టులను రివీల్ చేసే దాకా వచ్చే విజువల్స్ అన్నీ అలా సృష్టించినవే, అంచనాలు విపరీతంగా ఉన్నప్పుడు కంటెంట్ వీలైనంత సహజంగా, గ్రాఫిక్స్ అంతర్జాతీయ స్థాయిలో ఉండేలా దర్శక నిర్మాతలు జాగ్రత్త పడాలి. అది చిన్న పోస్టర్ అయినా విపరీతమైన శ్రద్ధ అవసరం. లేదంటే లేనిపోని ట్రోలింగ్ తో పాటు ప్రాజెక్టు మీద అంచనాలు తగ్గిపోయే ప్రమాదం ఉంది.

అయినా ఇంత అత్యవసరంగా ఇలా ఏఐతో చేయించిన ప్రమోషన్లు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని కొందరు ఫాన్సే కామెంట్ చేస్తున్నారు. డ్రాగన్ విడుదల ఇంకా ఏడాది ఉంది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ 2029 కంటే ముందే వస్తే గొప్పే. అలాంటప్పుడు ఇంకాస్త టైం ఎక్కువగా తీసుకుని నాణ్యత మీద ఫోకస్ పెడితే బాలీవుడ్ జనాలను కూడా కుదిపేయొచ్చు. రాజమౌళి ఎందుకు పెర్ఫెక్షన్ కోసం తాపత్రయపడతారో ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అందుకే ఆయన్ని జక్కన్న అనేది.

This post was last modified on June 29, 2026 9:16 pm

Share

Recent Posts

సినిమా షూటింగ్… ఐదుసార్లు చావుకు దగ్గరగా

సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…

2 hours ago

తెలంగాణా కాంగ్రెస్లో టిక్.. టిక్.. టిక్

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…

5 hours ago

రంభ ఊర్వశి సరే… మరి అప్పట్లో ఎలా

సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…

5 hours ago

అభిమానుల విన్నపం నాగ్ పట్టించుకోలేదా

వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…

5 hours ago

భారత్ లోనే వివాహం చేసుకోండి

భారతదేశంలోనే వివాహం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1…

8 hours ago

జగన్ కేసుల లోగుట్టు సాయిరెడ్డి విప్పనున్నారా?

వేణుంబాక విజయసాయిరెడ్డి… వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ అధినేత జగన్ కు నమ్మినబంటు. పార్టీలో జగన్ తర్వాత నంబర్…

9 hours ago