Political News

బండికి బెంగ పోయిన‌ట్టేనా?

తెలంగాణ‌కు చెందిన సీనియ‌ర్ బీజేపీ నాయ‌కుడు, ప్ర‌స్తుతం కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రిగా ఉన్న బండి సంజ‌య్ కు ప‌ద‌వీ గండం తొల‌గిపోయిన‌ట్టేన‌ని జాతీయ మీడియా స‌హా.. బీజేపీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. కేంద్ర మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌కు స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని బీజేపీ సీనియ‌ర్లు చెబుతున్నారు. ఈ నెల‌లోనే అంటే.. కొద్ది రోజుల్లోనే ప్ర‌క్షాళ‌న చేయ‌నున్నార‌ని అంటున్నారు. అయితే ప్ర‌స్తుతం .. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఆయ‌న సోమ‌వారం నాటికి వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఆయ‌న రాగానే అదే రోజు లేదా ఈ నెల 30 నాటికి మంత్రి వ‌ర్గ మార్పు ఉంటుంద‌ని జాతీయ మీడియా వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోం ది.

ఇటీవ‌లే ప్ర‌ధాని మోడీ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్మును క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌పైనే ఆమెతో చ‌ర్చించిన‌ట్టు కూడా వార్త‌లు రాగా.. తాజాగా మ‌రో విష‌యం వెలుగు చూసింది. మంత్రుల కూర్పుపై ప‌లు పేర్ల‌తో కూడిన జాబితాను కూడా రాష్ట్ర‌ప‌తికి ప్ర‌ధాని అందించార‌ని జాతీయ మీడియా తెలిపింది. ఈ నేప‌థ్యంలో బండి సంజ‌య్ చోటు ఏమాత్రం చెదిరిపోద‌న్న వార్త‌లు జోరుగా వినిపిస్తున్నాయి. వాస్త‌వానికి ఇటీవ‌ల బండి భ‌గీర‌థ్ వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చిన త‌ర్వాత‌.. కేంద్ర మంత్రిగా సంజ‌య్‌ను త‌ప్పిస్తార‌న్న చ‌ర్చ సాగింది.

కానీ, ఈ విష‌యంలో బండి ప్ర‌మేయం లేద‌ని.. ఆయ‌న పార్టీకి చేసిన సేవ‌ల నేప‌థ్యంలోనే ప‌ద‌వి ల‌భించింద‌న్న వాద‌న ఉంది. పైగా.. పార్టీకి కుటుంబ వ్య‌వ‌హారాల‌కు కూడా సంబంధం లేద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో బండి సంజ‌య్ సీటు విష‌యంలో ఎలాంటి మార్పులు ఉండ‌వ‌ని తెలుస్తోంది. ఇక‌, రెండు తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించి మొత్తం ఐదుగురు మంత్రులు ఉండ‌గా.. బండి సంజ‌య్‌ను అలానే కొన‌సాగించినా.. మిగిలిన న‌లుగురి విష‌యంలో మార్పులు ఉండే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం పౌర విమాన‌యాన శాఖ మంత్రిగా ఉన్న కింజ‌రాపు రామ్మోహ‌న్‌నాయుడును ప‌ర్యాట‌క శాఖ మంత్రిగా(ఇండిపెండెంట్ )గా పంపించే అవ‌కాశం ఉంద‌ని గ‌ట్టిగా చెబుతున్నారు.

ఇక‌, తెలంగాణ‌కు చెందిన కిష‌న్‌రెడ్డిని ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రిగా పంపించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం కిష‌న్ రెడ్డి గ‌నుల శాఖ మంత్రిగా ఉన్నారు. అలానే.. గుంటూరు ఎంపీ, కేంద్ర స‌హాయ మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ విష‌యంలోనూ మార్పు ఉండే అవ‌కాశం ఉంద‌ని.. ఆయ‌న‌ను కూడాహోం శాఖ ప‌రిధిలోకి తీసుకుంటార‌ని అంటున్నారు. ఇక‌, బీజేపీ నాయ‌కుడు, న‌ర‌సాపురం ఎంపీ శ్రీనివాస వ‌ర్మ‌.. ప్ర‌స్తుతం కేంద్ర ఉక్కు శాఖ స‌హాయ మంత్రిగా ఉన్నారు. ఆయ‌న‌ను కూడా మార్పు చేసి.. కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ‌, అట‌వీశాఖ స‌హాయ మంత్రిగా పంపించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. మొత్తంగా ఈ మార్పులు చేర్పులు ఉండ‌డం మిన‌హా మంత్రుల‌ను త‌ప్పించే అవ‌కాశం లేద‌ని స‌మాచారం.

This post was last modified on June 28, 2026 10:59 am

Share

Recent Posts

జగన్ ఎలా అంటే కేటీఆర్ కూడా అలానే

జగన్ ఇటీవ‌ల కాలంలో స‌హ‌నం కోల్పోతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో త‌న పార్టీ వారిపై కేసులు పెట్టినా.. త‌మ…

6 hours ago

అంజికి ఒడిస్సికి కనెక్షన్ ఏంటి

అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…

6 hours ago

బుట్టబొమ్మకు ఏ ప్రయోజనం లేదు

బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…

7 hours ago

ఏడున్న‌ర గంట‌ల‌పాటు నిల‌బ‌డిన లోకేష్‌

ఒక గంట నిల‌బ‌డేందుకే ఇబ్బంది ప‌డ‌తాం. అలాంటిది ఏకంగా ఏడున్న‌ర‌గంట‌ల పాటు ఏక‌బిగిన నిల‌బ‌డ‌డం అంటే మాట‌లా? ఊహించేందుకే క‌ష్ట‌మైన…

7 hours ago

కనకవర్షం కురవాల్సిందే కనకరాజూ

కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…

8 hours ago

అంబటి నోటి దురుసు తగ్గేలా లేదు

వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…

9 hours ago