గత ఏడాది మేలో జరిగిన ఆపరేషన్ సిందూర్లో ఆరుగురు సైనికులు వీరమరణం చెందినట్టు కేంద్రం తాజాగా వెల్లడించింది. దాదాపు 13 మాసాల తర్వాత ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. వీరిలో ఐదుగురు సైనిక శాశ్వత అధికారులు ఉన్నారు. మరొకరు అగ్నివీర్ ఉన్నారు. వీరి పేర్లను జాతీయ యుద్ధ స్మారకం వద్ద పొందుపరచనున్నారు.
అమరులైంది వీరే..
1) సుబేదార్ మేజర్ పవన్ కుమార్ (10 ఇన్ఫాంట్రీ బ్రిగేడ్ హెడ్క్వార్టర్స్)
2) రైఫిల్మ్యాన్ సునీల్ కుమార్( జమ్మూకశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్)
3) లాన్స్ నాయక్ దినేశ్ కుమార్ (5 ఫీల్డ్ రెజిమెంట్)
4) హవల్దార్ సునీల్ కుమార్ సింగ్(237 ఫీల్డ్ వర్క్షాప్)
5) సార్జెంట్ సురేంద్ర కుమార్(ఎయిర్ఫోర్స్ -39)
6) అగ్నివీర్ మురళీ నాయక్(851 లైట్ రెజిమెంట్)
ఆపరేషన్ సిందూర్ ఇదీ..
జమ్ము కశ్మీర్లోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం పహల్గామ్లో గత ఏడాది ఏప్రిల్ 16న ఉగ్రవాదులు దాడులు చేశారు. పర్యాటకుల పేర్లు, ఊర్లు, కులాలు, మతాలు అడిగి మరీ కాల్పులు జరపడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. నాటి దారుణ ఘటనలో మొత్తం 26 మంది పౌరులు మృతి చెందారు. వీరిలో నేపాల్కు చెందిన ఒక పౌరుడు కూడా ఉన్నారు. ఇక, ఏపీ నుంచి ఇద్దరు, తెలంగాణకు చెందిన ఒకరు కూడా నాటి దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు.
దీనికి ప్రతీకారంగా పాకిస్థాన్లోని ఉగ్రవాదులు, ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత త్రివిధ దళా లు ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు చేపట్టాయి. ఆ దాడుల్లో ఉగ్రవాదులకు చెందిన శిక్షణ శిబిరాల ను నేలమట్టం చేయడంతోపాటు పలువురు ఉగ్రవాదులను కూడా మన సైన్యం హతమార్చింది. అయితే.. పాక్ జరిపిన ఎదురు దాడుల్లో భారత సైన్యానికి చెందిన ఆరుగురు అమరులయ్యారని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates