ఏపీ సీఎం చంద్రబాబు సాధారణ ప్రజలతో ఇటీవల కాలంలో మమేకమవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేసిన ఓ వీడియో అందరినీ కడుపుబ్బ నవ్విస్తోంది. ఈ వీడియోకు స్వయంగా చంద్రబాబే.. ‘నవ్వకుండా ఉండలేరు’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్గా మారింది.
ఏంటా వీడియో..
కలెక్టర్ కుర్చీలో ఓ చిన్నారి కూర్చున్నాడు. తనముందున్న నేమ్ ప్లేట్పై ‘ఆర్నా ఐఏఎస్’ అని రాసుంది. ఈ సమయంలో ఆ చిన్నారి ముందు ఓ ల్యాప్ట్యాప్, ఓ పుస్తకం కూడా ఉన్నాయి. పుస్తకంపై ఏదో రాసుకుంటూ.. ల్యాప్ట్యాప్లో చూస్తూ.. సీఎం చంద్రబాబుతోనే వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నట్టుగా ఆ వీడియో స్పష్టం అవుతుంది. అయితే.. ఈ దృశ్యాన్నంతా ఆ చిన్నారి తండ్రి కిటికీలోంచి చూస్తున్నాడు.
దీనిని గమనించిన చిన్నారి.. ఆ వెంటనే వీడియో కాన్ఫరెన్సు ముగిసిందంటూ ల్యాప్ట్యాప్ను క్లోజ్ చేస్తాడు. అంతేకాదు.. ‘బై సీబీఎన్ అంకుల్. ఇప్పుడు మీతో నేను మాట్లాడలేను.’ అని వ్యాఖ్యానిస్తాడు. అనంతరం తండ్రి తన వద్దకు రాగానే పాదాలకు నమస్కరిస్తాడు. అయితే.. ఈ మొత్తం వీడియోను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తోనే రూపొందించారు.
ఈ వీడియోను తన ఎక్స్లో పోస్టు చేసిన చంద్రబాబు.. దీనిని చూసిన వారు నవ్వకుండా ఉండలేరు.. అని వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా.. ఇటీవల కాలంలో సాధారణ ప్రజలకు కూడా ముఖ్యమంత్రి బాగా కనెక్ట్ అవుతున్నారు. వాస్తవానికి పాలనా పరమైన, రాజకీయ పరమైన కార్యక్రమాలతో ఒత్తిడిగా ఉండే చంద్రబాబు.. ఇలా.. సరదా పోస్టులను కూడా చూస్తారని.. వీటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తారని ఎవరూ ఊహించరు. కానీ, మారుతున్న కాలంలో అందరికీ చేరువ అయ్యేలా చంద్రబాబు మారుతున్నారనడానికి ఇలాంటి ఘటనలు ఉదాహరణగా నిలుస్తున్నాయి.
This post was last modified on June 26, 2026 5:38 pm
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు, ఒక్క ఉపాధ్యాయ నియామకాన్ని…
ఇంకా ప్రారంభం కాలేదు కానీ క్యాస్టింగ్ ముందే ఫైనల్ చేసుకోవాలి కాబట్టి ఆర్సి 17కి సంబంధించిన పనుల్లో సుకుమార్ టీమ్…
అక్కినేని నాగార్జున వందో సినిమా హడవిడి లేకుండా షూటింగ్ జరుపుకుంటోంది. మాములుగా ఏదో ఒక అప్డేట్ లీకుల రూపంలో కానీ…
దేశంలో ఎక్కడ చూసినా విద్యార్థి ఉద్యమాలు జరుగున్నాయి. ఢిల్లీ నుంచి మొదలుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్…
హైదరాబాద్కు చెందిన 33 ఏళ్ల ఛార్టర్డ్ అకౌంటెంట్ సిద్దిపేటలోని ఒక హోటల్ గదిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది.…
భారతదేశపు అత్యంత ఖరీదైన సినిమాగా చెప్పుకుంటున్న రామాయణ నవంబర్ 6 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇంగ్లీష్ ట్రైలర్ తో…