విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. సాయికృష్ణది లాకప్ డెత్ అని కోర్టుకు సిట్ నివేదిక ఇచ్చింది. సాయికృష్ణను లాకప్ డెత్ చేసిన సీఐ నాగరాజు ఆ తర్వాత శవాన్ని మాయం చేశారని పేర్కొంది. విజయవాడ నగర కమిషనర్ కు సాయికృష్ణ తల్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు.
టీడీపీ నేతలు చెప్పినట్లు పోలీసులు చేస్తున్నారని, లా అండ్ ఆర్డర్ నిర్వీర్యం అయిందని విమర్శిస్తున్నారు. ఇలా, పోలీసు వ్యవస్థపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న సమయంలో టీడీపీ నేతలు ఎంతో ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది. కానీ, టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ మాత్రం ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పడేసేలా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఏలూరులో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల వల్ల తమ పార్టీ వాళ్లు ఇబ్బందులు పడుతున్నారని పుట్టా మహేష్ వాపోయారు. తనకు రోజుకు కనీసం 30 ఫోన్లు డ్రంక్ అండ్ డ్రైవ్, చలాన్లకు సంబంధించినవే వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కేసుల విషయంలో తమ మండల పార్టీ అధ్యక్షులు అడిగితే కొంచెం వారికి సపోర్ట్ చేయాలని కూడా సెలవిచ్చారు. అయితే, పోలీసులు కూడా రూల్స్ ప్రకారమే నడుచుకోవాలని, రూల్స్ కు విరుద్ధంగా వెళ్లమని తాను చెప్పడం లేదని అన్నారు.
కానీ, అలా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, చలాన్ల వల్ల ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తోందని చెప్పారు. స్థానిక నాయకులు డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో ఏవైనా చిన్నా చితకా విషయాలకు సంబంధించి స్టేషన్ కు వెళితే అక్కడి ఎస్ హెచ్ వో వారికి సపోర్ట్ చేసేలా చూడాలని ఎస్పీకి రిక్వెస్ట్ చేశారు.
దీంతో, ఇదేం లాజిక్ అంటూ పుట్టా మహేష్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఒకవేళ ఇటువంటి విన్నపాలు ఏవైనా ఉంటే వ్యక్తిగతంగా చేసుకోవాలని, అలా కాకుండా మీడియా ముందు ఇలా మాట్లాడితే పార్టీకి డ్యామేజీ జరుగుతుంది అన్న విషయం మహేష్ మరిచారని విమర్శిస్తున్నారు.
This post was last modified on June 25, 2026 3:29 pm
మెగాస్టార్ చిరంజీవికి బయట జనంలోనే కాదు ఇండస్ట్రీలోనూ బోలెడు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారనేది బహిరంగ రహస్యం. అది పలు…
ఏదైనా పెళ్లో.. మరో ఫంక్షనో.. భార్యా భర్తలు ఇరువురు వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు.. సహజంగా దంపతుల్లో ఉత్సాహం ఉంటుంది. భర్త ముందుగానే…
యువతను లక్ష్యంగా పెట్టుకుని సినిమాలు తీయడం మంచిదే. అందులోనూ జెన్ జీ అభిరుచులను అర్థం చేసుకుని, వాళ్లకు అనుగుణంగా తక్కువ…
నవంబర్ దీపావళి పండక్కు బాక్సాఫిస్ పోటీ మంచి రసవత్తరంగా మారబోతోంది. ముందుగా 'రామాయణ పార్ట్ 1' వస్తుంది కాబట్టి దానికి…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…