Political News

ఇదేం లాజిక్ ఎంపీ గారూ?

విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. సాయికృష్ణది లాకప్ డెత్ అని కోర్టుకు సిట్ నివేదిక ఇచ్చింది. సాయికృష్ణను లాకప్ డెత్ చేసిన సీఐ నాగరాజు ఆ తర్వాత శవాన్ని మాయం చేశారని పేర్కొంది. విజయవాడ నగర కమిషనర్ కు సాయికృష్ణ తల్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు.

టీడీపీ నేతలు చెప్పినట్లు పోలీసులు చేస్తున్నారని, లా అండ్ ఆర్డర్ నిర్వీర్యం అయిందని విమర్శిస్తున్నారు. ఇలా, పోలీసు వ్యవస్థపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న సమయంలో టీడీపీ నేతలు ఎంతో ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది. కానీ, టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ మాత్రం ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పడేసేలా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ఏలూరులో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల వల్ల తమ పార్టీ వాళ్లు ఇబ్బందులు పడుతున్నారని పుట్టా మహేష్ వాపోయారు. తనకు రోజుకు కనీసం 30 ఫోన్లు డ్రంక్ అండ్ డ్రైవ్, చలాన్లకు సంబంధించినవే వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కేసుల విషయంలో తమ మండల పార్టీ అధ్యక్షులు అడిగితే కొంచెం వారికి సపోర్ట్ చేయాలని కూడా సెలవిచ్చారు. అయితే, పోలీసులు కూడా రూల్స్ ప్రకారమే నడుచుకోవాలని, రూల్స్ కు విరుద్ధంగా వెళ్లమని తాను చెప్పడం లేదని అన్నారు.

కానీ, అలా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, చలాన్ల వల్ల ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తోందని చెప్పారు. స్థానిక నాయకులు డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో ఏవైనా చిన్నా చితకా విషయాలకు సంబంధించి స్టేషన్ కు వెళితే అక్కడి ఎస్ హెచ్ వో వారికి సపోర్ట్ చేసేలా చూడాలని ఎస్పీకి రిక్వెస్ట్ చేశారు.

దీంతో, ఇదేం లాజిక్ అంటూ పుట్టా మహేష్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఒకవేళ ఇటువంటి విన్నపాలు ఏవైనా ఉంటే వ్యక్తిగతంగా చేసుకోవాలని, అలా కాకుండా మీడియా ముందు ఇలా మాట్లాడితే పార్టీకి డ్యామేజీ జరుగుతుంది అన్న విషయం మహేష్ మరిచారని విమర్శిస్తున్నారు.

This post was last modified on June 25, 2026 3:29 pm

Share

Recent Posts

స్పిరిట్ కంటే వారణాసి పెద్ద సినిమా: సందీప్ వంగా

సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్‌లో స్పిరిట్,…

17 minutes ago

బ్రేకింగ్… అమెరికా వీసా అపాయింట్‌మెంట్లు నిలిపివేత

అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్‌మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…

21 minutes ago

హైదరాబాద్ – విజయవాడ ఘోర బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…

2 hours ago

కాంగ్రెస్ లో క్రమశిక్షణ తప్పదా?

మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…

8 hours ago

మీరు టికెట్ ఇవ్వడానికి ఎవరు ఉండరు జగన్

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…

10 hours ago

రోమాంచకం… సరిపోతుందా సమయం

టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…

11 hours ago