విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. సాయికృష్ణది లాకప్ డెత్ అని కోర్టుకు సిట్ నివేదిక ఇచ్చింది. సాయికృష్ణను లాకప్ డెత్ చేసిన సీఐ నాగరాజు ఆ తర్వాత శవాన్ని మాయం చేశారని పేర్కొంది. విజయవాడ నగర కమిషనర్ కు సాయికృష్ణ తల్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు.
టీడీపీ నేతలు చెప్పినట్లు పోలీసులు చేస్తున్నారని, లా అండ్ ఆర్డర్ నిర్వీర్యం అయిందని విమర్శిస్తున్నారు. ఇలా, పోలీసు వ్యవస్థపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న సమయంలో టీడీపీ నేతలు ఎంతో ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది. కానీ, టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ మాత్రం ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పడేసేలా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఏలూరులో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల వల్ల తమ పార్టీ వాళ్లు ఇబ్బందులు పడుతున్నారని పుట్టా మహేష్ వాపోయారు. తనకు రోజుకు కనీసం 30 ఫోన్లు డ్రంక్ అండ్ డ్రైవ్, చలాన్లకు సంబంధించినవే వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కేసుల విషయంలో తమ మండల పార్టీ అధ్యక్షులు అడిగితే కొంచెం వారికి సపోర్ట్ చేయాలని కూడా సెలవిచ్చారు. అయితే, పోలీసులు కూడా రూల్స్ ప్రకారమే నడుచుకోవాలని, రూల్స్ కు విరుద్ధంగా వెళ్లమని తాను చెప్పడం లేదని అన్నారు.
కానీ, అలా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, చలాన్ల వల్ల ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తోందని చెప్పారు. స్థానిక నాయకులు డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో ఏవైనా చిన్నా చితకా విషయాలకు సంబంధించి స్టేషన్ కు వెళితే అక్కడి ఎస్ హెచ్ వో వారికి సపోర్ట్ చేసేలా చూడాలని ఎస్పీకి రిక్వెస్ట్ చేశారు.
దీంతో, ఇదేం లాజిక్ అంటూ పుట్టా మహేష్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఒకవేళ ఇటువంటి విన్నపాలు ఏవైనా ఉంటే వ్యక్తిగతంగా చేసుకోవాలని, అలా కాకుండా మీడియా ముందు ఇలా మాట్లాడితే పార్టీకి డ్యామేజీ జరుగుతుంది అన్న విషయం మహేష్ మరిచారని విమర్శిస్తున్నారు.
దక్షిణ భారత దేశంలో గురువారం ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి కనిపించారు. అంతేకాదండోయ్…తాము…
ఎన్నడూ లేనిది పవన్ కళ్యాణ్ ఓజి 2 విషయంలో దూకుడు చూపిస్తున్నారు. సురేందర్ రెడ్డికి కమిటైన ప్రాజెక్టు పక్కనపెట్టి మరీ…
గొప్ప గొప్ప దర్శకులు కూడా తమ సినిమాలు ఆశించినంత ఆడకపోతే.. వాటి ఫలితాల విషయంలో చిత్రమైన కారణాలు చెబుతుంటారు. స్క్రిప్టు…
సుప్రీంకోర్టు హెచ్చరికలు, దేశవ్యాప్తంగా ప్రజల నుంచి అందుతున్న వేలాది ఫిర్యాదులతో కేంద్ర ప్రభుత్వం కదిలింది. దేశంలో ఏదో ఒక రూపంలో…
వెనిజులాను వరుస భూకంపాలు వణికించాయి. దేశ రాజధాని కరాకస్తో పాటు ఉత్తర-మధ్య ప్రాంతాల్లో బుధవారం శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. తొలుత…
విదేశాలకు వెళ్లాలన్నా, మన జాతీయతను నిరూపించుకోవాలన్నా పాస్పోర్ట్ అత్యంత కీలకమైన పత్రం. అయితే ఇటీవల విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇచ్చిన…