Political News

ఇదేం లాజిక్ ఎంపీ గారూ?

విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. సాయికృష్ణది లాకప్ డెత్ అని కోర్టుకు సిట్ నివేదిక ఇచ్చింది. సాయికృష్ణను లాకప్ డెత్ చేసిన సీఐ నాగరాజు ఆ తర్వాత శవాన్ని మాయం చేశారని పేర్కొంది. విజయవాడ నగర కమిషనర్ కు సాయికృష్ణ తల్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు.

టీడీపీ నేతలు చెప్పినట్లు పోలీసులు చేస్తున్నారని, లా అండ్ ఆర్డర్ నిర్వీర్యం అయిందని విమర్శిస్తున్నారు. ఇలా, పోలీసు వ్యవస్థపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న సమయంలో టీడీపీ నేతలు ఎంతో ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది. కానీ, టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ మాత్రం ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పడేసేలా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ఏలూరులో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల వల్ల తమ పార్టీ వాళ్లు ఇబ్బందులు పడుతున్నారని పుట్టా మహేష్ వాపోయారు. తనకు రోజుకు కనీసం 30 ఫోన్లు డ్రంక్ అండ్ డ్రైవ్, చలాన్లకు సంబంధించినవే వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కేసుల విషయంలో తమ మండల పార్టీ అధ్యక్షులు అడిగితే కొంచెం వారికి సపోర్ట్ చేయాలని కూడా సెలవిచ్చారు. అయితే, పోలీసులు కూడా రూల్స్ ప్రకారమే నడుచుకోవాలని, రూల్స్ కు విరుద్ధంగా వెళ్లమని తాను చెప్పడం లేదని అన్నారు.

కానీ, అలా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, చలాన్ల వల్ల ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తోందని చెప్పారు. స్థానిక నాయకులు డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో ఏవైనా చిన్నా చితకా విషయాలకు సంబంధించి స్టేషన్ కు వెళితే అక్కడి ఎస్ హెచ్ వో వారికి సపోర్ట్ చేసేలా చూడాలని ఎస్పీకి రిక్వెస్ట్ చేశారు.

దీంతో, ఇదేం లాజిక్ అంటూ పుట్టా మహేష్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఒకవేళ ఇటువంటి విన్నపాలు ఏవైనా ఉంటే వ్యక్తిగతంగా చేసుకోవాలని, అలా కాకుండా మీడియా ముందు ఇలా మాట్లాడితే పార్టీకి డ్యామేజీ జరుగుతుంది అన్న విషయం మహేష్ మరిచారని విమర్శిస్తున్నారు.

This post was last modified on June 25, 2026 3:29 pm

Share

Recent Posts

చెన్నై లవ్ స్టోరీ… ‘సమ్’తృప్తేనా?

డివైడ్ టాక్ తెచ్చుకున్న చిన్న సినిమాలు థియేటర్లలో బలంగా నిలబడ్డం అంటే చిన్న విషయం కాదు. చెన్నై లవ్ స్టోరీ…

4 hours ago

భయపెడుతున్న అమెరికా బాక్సాఫీస్

ఒకప్పుడు యుఎస్‌లో తెలుగు సినిమాలు విడుదల కావడాన్నే గొప్పగా భావించేవాళ్లం. అలాంటిది అది తెలుగు సినిమాలకు పెద్ద మార్కెట్‌గా తయారైంది. మన…

5 hours ago

క్రైమ్ సినిమాలు ఇంకెన్ని తీస్తారయ్యా

మనమేదో ఆహా ఓహో అంటూ ఛాన్స్ దొరికినప్పుడంతా మలయాళం సినిమాలను తెగ పొగిడేస్తూ ఉంటాం కాని అక్కడి దర్శకులు కూడా…

7 hours ago

పీవీఆర్‌లో 175 రూపాయల సినిమా

టికెట్ రేటు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ.. మల్టీప్లెక్సుల్లోనే సినిమాలు చూద్దాం అనుకునే ప్రేక్షకులు పెరిగిపోయారు గత కొన్నేళ్లలో. దాని…

7 hours ago

పోలీసు దెబ్బ: వైసీపీలో `ర‌ప్పా-ర‌ప్పా` పోయిందే

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌ల్లో భాగంగా ఇటీవల కాలంలో `ర‌ప్పా-ర‌ప్పా` డైలాగులు త‌ర‌చుగా వినిపించేవి. రప్పా-ర‌ప్పా అని రాసున్న బ్యాన‌ర్లు,…

7 hours ago

కనకరాజు కొట్టులో బోణీ బాగుంది

వరుణ్ తేజ్ ప్రస్తుతం మనసులో అనుకుంటున్న మాట ఇదే. కొరియన్ కనకరాజుకి ఒక రోజు ముందే ప్రీమియర్లు వేయడం రిస్కని…

8 hours ago