Mamata Banerjee addressing a rally in Kolkata on the occasion of the TMCP foundation day | Salil Bera
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయి ఒక ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏప్రిల్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏకంగా 207 స్థానాలు గెలుచుకోగా, అధికారంలో ఉన్న టీఎంసీ కేవలం 80 సీట్లతో దారుణమైన ఓటమిని చవిచూసింది. ఈ ఫలితాల తర్వాత మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శిబిరానికి వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. గెలిచిన 80 మంది ఎమ్మెల్యేలలో ఏకంగా 62 మంది ఆమెను వదిలేసి వెళ్లిపోయారు.
దీనికి తోడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదాతో పాటు కోల్ కతా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ లాంటి కీలక పదవులను కూడా ఆమె వర్గం కోల్పోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే పార్టీ పేరు, ఆస్తులు, ఎన్నికల గుర్తు ఎవరికి దక్కాలనే దానిపై రెండు వర్గాల మధ్య అధికారిక పోరు మొదలైంది. పార్టీలో తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తున్న రీతబ్రత బెనర్జీ వర్గం ఒక అడుగు ముందుకు వేసి సంచలన నిర్ణయం తీసుకుంది.
మమతా బెనర్జీని పార్టీ చైర్ పర్సన్ పదవి నుంచి తొలగిస్తూ తీర్మానం చేసి, ఆ స్థానంలో ఎమ్మెల్యే అరూప్ రాయ్ కు బాధ్యతలు అప్పగించింది. అసలైన పార్టీ తమదే అని చెబుతూ కొత్త ఆఫీస్ బేరర్ల జాబితాను ఎన్నికల సంఘానికి సమర్పించారు. దీనికి కౌంటర్ గా మమత వర్గం కూడా తానే చైర్ పర్సన్ గా కొనసాగుతున్నట్లు మరో లిస్ట్ ను ఈసీకి పంపించింది. తిరుగుబాటు నేతలది మైనారిటీ జాబితా అని ఆమె వాదిస్తున్నారు. రెండు వర్గాలు పార్టీ అధికారిక గుర్తు అయిన రెండు పువ్వుల సింబల్ తమకే దక్కాలని పట్టుబడుతుండటంతో ఈ వివాదం కేంద్ర ఎన్నికల సంఘం కోర్టుకు చేరింది.
ఒక గుర్తింపు పొందిన పార్టీ చీలిపోయి రెండు వర్గాలు పార్టీ పేరు, గుర్తు కోసం క్లెయిమ్ చేసినప్పుడు అసలైన పార్టీ ఎవరిది అని తేల్చడానికి ఎన్నికల సంఘం టూ వింగ్ టెస్ట్ అనే పద్ధతిని ఉపయోగిస్తుంది. ఎలక్షన్ సింబల్స్ ఆర్డర్ 1968 లోని పారాగ్రాఫ్ 15 ప్రకారం ఈసీకి ఈ పవర్ ఉంటుంది. ఇందులో భాగంగా చట్టసభల్లో ఎంతమంది సభ్యుల మద్దతు ఉంది, పార్టీ సంస్థాగత నిర్మాణంలో ఎవరి బలం ఎక్కువ ఉంది అనే రెండు అంశాలను ఈసీ పరిశీలిస్తుంది. గతంలో మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ పార్టీలు చీలిపోయినప్పుడు కూడా మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ వర్గాలకే ఈసీ అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. దానికి ముందు 1969లో కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చినప్పుడు కూడా సుప్రీం కోర్టు ఇదే విధానాన్ని సమర్థించింది.
ఇక ఈ పరిణామాలను గమనిస్తే, ప్రస్తుతం టీఎంసీలోని 81 శాతం మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు వర్గం వైపే ఉన్నట్లు తెలుస్తోంది. మెజారిటీ టెస్ట్ లో ఇది రీతబ్రత బెనర్జీ వర్గానికి బాగా కలిసొచ్చే అవకాశం ఉంది. ఈ వివాదం ఒక కొలిక్కి వచ్చే వరకు పార్టీ ప్రైమరీ బ్యాంకు ఖాతాల్లో ఉన్న 676 కోట్ల రూపాయల నిధులు ఫ్రీజ్ లోనే ఉంటాయి. త్వరలో జరగబోయే కోల్ కతా మున్సిపల్ ఎన్నికల లోపు రెండు వర్గాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈసీ తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే పార్టీ ఆస్తులపై ఎవరికి హక్కు ఉంటుందనేది లీగల్ గా తేలుతుంది. పార్టీ కంట్రోల్ ఎవరి చేతిలో ఉంటుందనేది ఇప్పుడు కోల్ కతాలో కాకుండా ఢిల్లీలో డిసైడ్ కానుంది.
ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్ కున్న క్రేజ్ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో లేదన్న మాటే కానీ పదిహేను సంవత్సరాల క్రితం ప్రసాద్ మల్టీప్లెక్స్…
భారతదేశానికి గర్వకారణమైన ఇస్రో లో ఇప్పుడు ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు వరుసగా తమ ఉద్యోగాలకు…
క్రికెట్ ప్రపంచంలో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉండే క్రేజ్ అందరికీ తెలిసిందే. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఐసీసీ 2027…
మన దేశం నుంచి ఎంతోమంది టాలెంటెడ్ యువత సరైన రూల్స్ పాటిస్తూ చదువు, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్తున్నారు. కానీ…
తెలుగులో మరే హీరోకూ లేని విచిత్రమైన ‘అయ్యగారు’ అనే బిరుదును అఖిల్ అక్కినేని సొంతం చేసుకున్నాడంటే.. ఆంధ్ర ప్రాంతానికి చెందిన…
వచ్చే వారం జూలై 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ మీద క్రమంగా పాజిటివ్ బజ్ పెరుగుతోంది. టీమ్…