Political News

సాయికృష్ణది లాకప్ డెత్… తేల్చిన సిట్

విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజుపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే ఈ రోజు సిట్ అధికారులు సమర్పించిన రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సాయికృష్ణ లాకప్ డెత్ వాస్తవమేనని సిట్ అధికారులు ప్రాథమికంగా ధృవీకరించి కోర్టుకు నివేదిక సమర్పించడం సంచలనం రేపుతోంది. సాయికృష్ణ మృతదేహాన్ని సీఐ నాగరాజు మాయం చేశారని తమ నివేదికలో సిట్ అధఇకారులు వెల్లడించారు.

కస్టడీలో తగిలిన గాయాల వల్లే సాయికృష్ణ మృతిచెందాడని, సీసీటీవీ ఫుటేజీని ఉద్దేశ్యపూర్వకంగానే డిలీట్ చేశారని అధికారులు తేల్చారు. మే 6వ తేదీన సాయికృష్ణను మార్కాపురం నుంచి కృష్ణలంకకు తెచ్చారని, అయితే, కస్టడీకి అప్పగించిన తర్వాత అతడి ఆచూకీ దొరకలేదని తెలిపారు. చట్టవిరుద్ధంగా అతడిని కస్టడీలో ఉంచారని చెప్పారు. సాయికృష్ణను మే 6-8 తేదీల్లో స్టేషన్ లో చూశానని ఎస్ ఐ చెప్పారని తెలిపారు. అంతేకాదు, స్టేషన్లో సాయికృష్ణను అపస్మారక స్థితిలో అతడి తల్లి చూశారని వెల్లడించారు.

సాయికృష్ణ మృతదేహాన్ని పూడ్చేందుకు లేదా తగులబెట్టేందుకు సీఐ నాగరాజు విశ్వప్రయత్నాలు చేశారని అధికారులు తమ నివేదికలో వెల్లడించారు. అయితే, సాయికృష్ణ మృతదేహం ఇంకా లభించలేదని తమ నివేదికలో పేర్కొన్నారు. డెడ్ బాడీని ఏం చేశారు అనే విషయంపై లోతైన దర్యాప్తు చేయాల్సి ఉందన్నారను. దర్యాప్తునకు నాగరాజు సహకరించడం లేదని, తప్పుడు సమాచారంతో కేసును పక్కదోవ పట్టించేందుకు చూస్తున్నారని తెలిపారు.

This post was last modified on June 24, 2026 2:45 pm

Share

Recent Posts

గప్‌చుప్ ఉంటే ఎలా నాయుడు గారూ

ఎల్లుండి విడుదల కాబోతున్న చిత్రాల్లో అందరి దృష్టి కొరియన్ కనకరాజు మీదే ఉంది. కొద్దో గొప్పో తమిళ దర్శకుడు లోకేష్…

2 hours ago

రామాయణ 2 కోసం చాలా దాచి పెట్టారు

దీపావళికి విడుదల కాబోతున్న రామాయణ మీద ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంది. టీజర్ కన్నా బాగుందనే కామెంట్స్ ట్రైలర్ మీద…

3 hours ago

కొత్త జంట‌కు తాళి బొట్లు… ఫ‌స్ట్ బ‌డ్జెట్‌లోనే `విజ‌య్` ముద్ర‌!

త‌మిళ‌నాడులో కొత్త‌గా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే అధినేత‌, న‌టుడు విజ‌య్.. నేతృత్వంలోని స‌ర్కారు.. తొలి బ‌డ్జెట్‌ను(2026-27)ను బుధ‌వారం అసెంబ్లీలో…

3 hours ago

300 కోట్లు దాటినా ఆనందం లేదు

అదేదో సామెత చెప్పినట్టు జన నాయగన్ బాక్సాఫీస్ గ్రాస్ 300 కోట్లు దాటినా కూడా నిర్మాత, బయ్యర్లు పెద్దగా సంతోష…

3 hours ago

కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో విజయసాయి రెడ్డి?

రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి…

4 hours ago

బండి పదవికి గండి పడనుందా

కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సన్ స్ట్రోక్ తప్పేలా లేదు. బండిని మంత్రి పదవి నుంచి తొలగించడం ఖాయమని…

6 hours ago