Political News

జ‌గ‌న్ నాన్చారు.. చంద్ర‌బాబు తేల్చారు: ఉద్యోగుల‌కు పండ‌గ‌!

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. గ‌తంలో ఐదేళ్లు పాలించిన జ‌గ‌న్‌.. నానుస్తూ వ‌చ్చి.. చివ‌ర‌కు త‌న‌కు సాధ్యంకాద‌ని తేల్చేసిన ఓ కీల‌క విష‌యంపై సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుని ఉద్యోగుల‌కు పండ‌గ వాతావ‌ర‌ణం తీసుకువ‌చ్చారు. తాజాగా చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న‌ జ‌రిగిన మంత్రివ‌ర్గ స‌మావేశంలో రాష్ట్రంలోని కార్పొరేషన్లు, ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు, సొసైటీల్లో ప‌నిచేస్తున్న సుమారు 8 ల‌క్ష‌ల మందికిపైగా ఉద్యోగుల‌కు ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సును ఒకేసారి 2 ఏళ్ల‌పాటు పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఫ‌లితంగా ఆయా విభాగాల్లో ప‌నిచేస్తున్న‌వారు.. 62 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చే వ‌ర‌కు ఉద్యోగాల్లో కొన‌సాగ‌వ‌చ్చు. వారికి పూర్తిస్థాయి వేత‌నంతోపాటు ప్ర‌స్తుతం అందుతున్న అన్ని అల‌వెన్సులు, ఇత‌ర భ‌త్యాలు కూడా య‌థాత‌థంగా అందుతాయి. ఈ మేర‌కు కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది. ఇదే విష‌యంపై హామీ ఇచ్చినా..గ‌తంలో జ‌గ‌న్ దీనిని అమ‌లు చేయ‌లేక పోయారు. దీంతో ఆయా విభాగాల ఉద్యోగులు వైసీపీ ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెచ్చారు. త‌మ‌కు ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీలను నెర‌వేర్చాల‌ని డిమాండ్ చేశారు. కానీ, అప్ప‌ట్లో ప్ర‌భుత్వానికి భారం అవ‌తుంద‌ని భావించిన జ‌గ‌న్ ఈ విష‌యాన్ని ఐదేళ్లు నాన్చారు.

ఇక‌, ఇత‌ర విష‌యాల‌కు వ‌స్తే.. పెట్టుబడుల క‌ల్ప‌నకు మ‌రోసారి కేబినెట్ పెద్ద‌పీట వేసింది. 34 వేల కోట్ల రూపాయ‌ల విలువైన‌ పెట్టుబడులకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. వివిధ జిల్లాల్లో ఈ పెట్టుబ‌డులు రానున్నాయి. త‌ద్వారా 35 వేల మంది పైచిలుకు యువ తకు ఉద్యోగాలు, ఉపాధి అవ‌కాశాలు క‌ల‌గ‌నున్నాయి. అలాగే రాజ‌ధాని ప‌రిదిలోని ఉండ‌వ‌ల్లిలో యోగా కేంద్రంతోపాటు.. ఇత‌ర మౌలిక స‌దుపాయాల‌ను క‌ల్పించేందుకు కూడా మంత్రివ‌ర్గం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీనికిగాను 429 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేయ‌నున్నారు. త‌ద్వారా.. ఉండ‌వ‌ల్లిలోని అంత‌ర్గ‌త ర‌హ‌దారులు, ప్రాజెక్టులు సాకారం కానున్నాయి.

రాజ‌ధాని అమ‌రావ‌తిలో జ‌రుగుతున్న రెండు ద‌శ‌ల భూస‌మీక‌ర‌ణ‌కు సంబంధించిన ప‌నుల‌కు కూడా మంత్రి వ‌ర్గం ప‌చ్చ‌జెండా ఊపింది. అలాగే.. రైతుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు మ‌రో 95 మంది త‌హ‌సీల్దార్లు, రెవెన్యూ అధికారులను నియ‌మించ‌నున్నారు. త‌ద్వారా రైతుల ఇబ్బందుల‌ను ప‌రిష్క‌రించ‌నున్నారు. ఇక‌, రాజ‌ధానిలో నిర్మించే ఫైవ్ స్టార్ హోట‌ళ్లు, క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ల నిర్మాణాల‌కు ప్ర‌భుత్వం ఇచ్చే భూమి, విద్యుత్‌, ప‌న్నులు, నీరు.. వంటివాటి రాయితీల‌ను నిర్ధారించారు. ఆయా కంపెనీలు.. ప‌నులు చేప‌ట్టిన త‌ర్వాత‌.. వీటిని అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. క‌డ‌ప‌, అనంత‌పురంలో సౌర‌, ప‌వ‌న విద్యుత్ సంస్థ‌లకు కూడా రాయితీలు ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు.

This post was last modified on June 24, 2026 8:10 am

Share

Recent Posts

పీడకలగా మారుతున్న పార్ట్ 2 ఫలితాలు

ఒక హిట్ మూవీకి కొనసాగింపు ఉండాలనుకోవడం మంచిదే. కథ డిమాండ్ చేసినప్పుడు, దానికి అనుగుణంగా దర్శకులు తమ క్రియేటివిటీని జోడించి,…

22 minutes ago

స్థానిక ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ముచ్చెమటలు

రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో అధికార బీజేపీతో ప్రతిపక్ష కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అంటూ పోటీ పడింది. బీజేపీ కంచుకోటల్లో…

1 hour ago

కాకా ఎప్పుడు వస్తే బాగుంటుంది

2027 సంక్రాంతికి విశ్వంభర విడుదల దాదాపు ఖాయమేనని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ చిరంజీవి అంగీకారం…

1 hour ago

ఎప్పట్లాగే టీజర్ పేలింది… మరి సినిమా?

తమిళంలో రెండు దశాబ్దాల ముందే సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించిన హీరో విక్రమ్. సేతు, దిల్, ధూల్, జెమిని, పితామగన్,…

2 hours ago

నిన్న సందీప్ వంగ… నేడు శ్రీకాంత్ ఓదెల

మెగాస్టార్ చిరంజీవికి బయట జనంలోనే కాదు ఇండస్ట్రీలోనూ బోలెడు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారనేది బహిరంగ రహస్యం. అది పలు…

7 hours ago

అమితాబ్ టెక్నిక్ ఫాలో అయితే… మీ స‌తీమ‌ణి టైమ్‌కి రెడీ!

ఏదైనా పెళ్లో.. మ‌రో ఫంక్ష‌నో.. భార్యా భ‌ర్త‌లు ఇరువురు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ప్పుడు.. స‌హ‌జంగా దంప‌తుల్లో ఉత్సాహం ఉంటుంది. భ‌ర్త ముందుగానే…

13 hours ago