జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ రాజకీయాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే హైదరాబాద్ లో జనసేన కార్యాలయాన్ని ప్రారంభించారు పవన్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆల్రెడీ తెలంగాణ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు, జనసేన కార్యాలయం ప్రారంభోత్సవం తర్వాత కూడా మరోసారి పవన్ పై వారు తమ వ్యాఖ్యలకు పదునుపెట్టారు. ఈ నేపథ్యంలోనే పవన్ పై టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
వాళ్లు సినిమా యాక్టర్ల ముసుగులో వస్తారని, ఆ తర్వాత రాష్ట్రాన్ని కబ్జా చేస్తారని ఆంధ్రా నటులను, పరోక్షంగా పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి కవిత షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటి పవన్ అభిమానులు అప్పటికి పుట్టలేదని చెప్పారు. నటుల ముసుగులో వచ్చి తెలంగాణ భాష, యాస బాగోలేదని కించపరుస్తారని, నా పేరు యాదగిరి, ఊరు భువనగిరి, చేసేది దాదాగిరి… అంటూ తెలంగాణ ప్రాంతాలు, ప్రజలను అవమానించేలా డైలాగులు రాసేవారని గుర్తు చేశారు.
ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాతే తెలంగాణ భాషను హీరోలు మాట్లాడడం మొదలుబెట్టారని అన్నారు. అయితే, పవన్ సినిమాలకు వెళ్లి ఆయన నటన, డ్యాన్సులు ఎంజాయ్ చేయొచ్చని అన్నారు. తెలంగాణకు పవన్ రావచ్చని, పోవచ్చని, సినిమాలు తీసుకోవచ్చని, రిలీజ్ చేసుకోవచ్చని కవిత అన్నారు. ఆ సినిమాలు తాము చూసి పవన్ వేసే స్టెప్పులకు తాము కూడా చప్పట్లు కొడతామని చెప్పారు. నైజాంలో సినిమాలకు మిగతా ప్రాంతాల కన్నా ఎక్కువ కలెక్షన్లు వస్తాయని, బేసికల్లీ సినిమా ఇండస్ట్రీ బ్రతికేదే తెలంగాణ ప్రజలతో అని కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దక్షిణాది గానకోకిలగా కోట్లాది మంది అభిమానుల ప్రేమను సొంతం చేసుకున్న ప్రముఖ గాయని ఎస్. జానకి (88) కన్నుమూశారు. ఆమె…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఓ వ్యక్తి ఆరుగురిని…
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…
విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు శనివారం శస్త్ర చికిత్స జరిగింది. ముంబైలో జరిగిన ఈ శస్త్ర…