ఏపీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణంలో గురువారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ కుంభకోణంలో అదనంగా లిక్కర్ రవాణాలోనూ భారీ ఎత్తున అవినీతి జరిగిందన్న విషయం ఇటీవలే వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ లిక్కర్ ట్రాన్స్ పోర్ట్ స్కాంలో ప్రత్యక్ష పాత్ర ఉందన్న ఆరోపణలతో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కుమారుడు సునీల్ అరెస్టయ్యారు. మద్యం అక్రమ రవాణాపై కేసు నమోదు చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులే గురువారం సునీల్ ను అరెస్టు చేశారు.
ఏపీ సీఐడీ దర్యాప్తు చేస్తున్న లిక్కర్ స్కాం ఆధారంగా ఈడీ కేసు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. లిక్కర్ స్కాంలో మనీ ల్యాండరింగ్ జరిగిన నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై ఈడీ ప్రత్యేకంగా కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే మద్యం రవాణాలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని ఈడీ గుర్తించింది. ఈ కేసులో ఇదివరకే లిక్కర్ స్కాం కీలక నిందితుడు కేసిరెడ్డి రాజశేఖరరెడ్డితో పాటు బీవరేజెస్ కార్పొరేషన్ మాజీ సీఎండీ వాసుదేవరెడ్డిలను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
రాజ్ కేసిరెడ్డి, వాసుదేవరెడ్డిలను అరెస్టు చేసిన రోజున కారుమూరి ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో భాగంగా మద్యం అక్రమ రవాణాలో కారుమూరి తండ్రీకొడుకుల పాత్ర ఉందన్న ఆధారాలు ఈడీ అదికారులకు లభించినట్లుగా వార్తలు వినిపించాయి. నాడు దొరికిన ఆధారాలను మరింత లోతుగా పరిశీలించిన ఈడీ అదికారులు… మద్యం అక్రమ రవాణాలో సునీల్ కు ప్రత్యక్ష పాత్ర ఉందని నిర్ధారించారు. ఈ నేపథ్యంలోనే గురువారం సునీల్ ను ఈడీ అరెస్టు చేసింది. హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న సునీల్ ను ఈడీ అదికారులు గురువారమే నాంపల్లిలోని ఈడీ కోర్టులో హాజరు పరచనున్నారు.
This post was last modified on June 18, 2026 4:36 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…