Political News

కాక్రోచ్ పార్టీపై పవన్ ఫస్ట్ రియాక్షన్

ఢిల్లీలో ‘జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం’ పేరుతో 3 రోజుల పాటు సభలను నిర్వహించాలని జనసేన నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ సభలకు తొలిరోజు హాజరైన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ సమైక్యత కోసం ఈ సభలను ఢిల్లీలో నిర్వహిస్తున్నామని పవన్ చెప్పారు. ఈ క్రమంలోనే కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)పై పవన్ విమర్శలు గుప్పించారు.

జాతీయ వాదాన్ని పక్కనపెట్టి, చిన్న చిన్న అభిప్రాయాలు, కురచ భావాలు, వ్యక్తిగత లాభాలతో వ్యవహరించే వ్యక్తుల వల్లే కాక్రోచ్ జనతా పార్టీల వంటివి పుట్టుకొస్తోన్నాయని పవన్ అన్నారు. దేశ సమగ్రతను బలి చేసేందుకు కొన్ని శక్తులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి ఆలోచన ప్రవాహంలో చిక్కుకోకూడదనే భావనను తెలియజేసేందుకే ఈ సభను ఢిల్లీలో ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు.

చిన్న చీమలు కూడా బలమైన సర్పాన్ని చంపేస్తాయన్న సుమతీ శతకం గుర్తుకు వచ్చిందని అన్నారు. చాలామంది చిన్న చిన్న శక్తులు కలిస్తే …మంచైనా, చెడైనా అది బలంగా ఉంటుందని అన్నారు. ఆ ప్రవాహంలో జనసేన చిక్కుకోకూడదనే ఈ సభ పెట్టానని చెప్పారు. విభజన వాదం బలపడకూడదు అన్న విషయం చాటిచెప్పేందుకు ఈ సభను ఢిల్లీలో నిర్వహించామని తెలిపారు. జనసేనకు జాతీయ సమగ్రత, దేశభక్తి చాలా కీలకమని పవన్ అన్నారు. విభజనవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని జనసైనికులకు పవన్ పిలుపునిచ్చారు.

This post was last modified on June 15, 2026 1:59 pm

Share

Recent Posts

నాగార్జున నమ్మకం ఎక్కడ తప్పింది

చిన్న సినిమా వెనుక అగ్ర నిర్మాతలు, హీరోలు ఉండటం వాటికి చాలా పెద్ద బలమవుతుంది. బలగంలో ఎంత గొప్ప కంటెంట్…

2 hours ago

విజయ్ స్థానాన్ని భర్తీ చేస్తాడా?

తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…

5 hours ago

విశ్వంభర వెళ్తున్న దారి సరైనదేనా

చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…

7 hours ago

యష్ మాటల్లో పరిణితి పని చేస్తుంది

ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…

8 hours ago

వైసీపీ స‌త్తాకు `బ్యాలెట్` టెస్ట్‌?

ఏపీలో వ‌చ్చే సెప్టెంబ‌రులో నిర్వ‌హించాల‌ని భావిస్తున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. దీంతో…

8 hours ago

కేటీఆర్ కార్యకర్తల రక్తాన్ని అమ్ముకున్నారు

తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…

8 hours ago