Political News

ఢిల్లీలో జనసేన కీలక భేటీ

ఏపీలో అధికార కూటమిలో కీలక భాగస్వామి అయిన జనసేన.. దేశ రాజధాని ఢిల్లీలో రేపు ఓ కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఢిల్లీలోని అశోకా హోటల్ వేదికగా జరగనున్న ఈ సమావేశానికి ఏపీ నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళం రాష్ట్రాలకు చెందిన ఆ పార్టీ కీలక నేతలు హాజరు కానున్నారు.

దాదాపుగా 150 మంది ముఖ్య నేతలు పాలుపంచుకుంటున్న ఈ సమావేశంలో పార్టీ తరఫున వివిధ చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా హాజరు కానున్నారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా కొనసాగనున్న ఈ సమావేశంలో పార్టీ అదినేత హోదాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ప్రసంగం చేయనున్నారు.

తెలుగు నేల మీద పుట్టిన జనసేన ఆది నుంచి జాతీయ పార్టీ కిందే లెక్క. వివిధ పార్టీలు, ఆయా పార్టీల నేతలతో పాటు రాజకీయ విశ్లేషకులు జనసేనను ఓ ప్రాంతీయ పార్టీగానే పరిగణిస్తున్నా… పార్టీ వైఖరి, ఆ పార్టీ అధిష్ఠానం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు, సాగుతున్న తీరు చూస్తే మాత్రం జనసేనను ప్రాంతీయ పార్టీ వరకే పరిమితం చేయలేం.

ఎందుకంటే జాతీయ భావాల విషయంలో జనసేన ఏ ఒక్క పార్టీకి తీసిపోని రీతిలో సాగుతోంది. పార్టీ కేడర్ లోనే కాకుండా ప్రజల్లోనే జాతీయ భావనలు పెంపొందించేలా పార్టీ అధిష్ఠానం కీలక అడుగులు వేస్తున్నసంగతి తెలిసిందే.

ఇటీవలే తెలంగాణ ఆవిర్భావం రోజున హైదరాబాద్ లో జనసేన సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు పవన్ కల్యాణ్ యత్నించగా…తెలంగాణ ప్రభుత్వం ఆ సమావేశాన్ని అడ్డుకున్నసంగతి తెలిసిందే. నాడు తెలంగాణ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగిన పవన్.. తనతో పాటు జనసేన అవలంభిస్తున్న జాతీయ తత్వాన్ని బలంగా ప్రదర్శించారు.

భారత్ తన మాతృభూమి అన్న పవన్… తన మాతృభూమిలో తెలంగాణ ఓ అంతర్భాగమని, అలాంటి చోట తాను సమావేశం పెడతానంటే అనుమతి ఎందుకు ఇవ్వరని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగానే ఆయన తెలంగాణ ఎవడబ్బ సొత్తు కాదని, ఏ ఒక్కరి జాగీరు కాదని కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆ సందర్భంగా పవన్ పైనా తెలంగాణ వాదులు ఓ రేంజిలో విరుచుకుపడిన విషయమూ తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలోనే జనసేన దేశ రాజధాని డిల్లీ వేదికగా కీలక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న తీరు ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ సమావేశంలో ప్రాంతీయత, జాతీయత అన్న అంశాలపై పవన్ కీలక ప్రసంగం చేయనున్నారు. ప్రాంతీయ తత్వాన్ని కాపాడుకుంటూనే జాతీయ భావనను పెంపొందించుకునే దిశగా ఏ రీతిన ముందుకు సాగాలన్న విషయంపై పవన్ తన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. వెరసి ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Kumar

Recent Posts

వైసీపీ ఫేస్‌బుక్ బ్లాక్‌… స‌ర్కారుపై జ‌గ‌న్ ఫైర్

ఏపీ ప్ర‌తిప‌క్షం(ప్ర‌ధాన కాదు) వైసీపీ సోష‌ల్ మీడియాలో దూకుడుగా ఉంటున్న విష‌యం తెలిసిందే. యూట్యూబ్‌, ఇన్‌స్టా, వాట్సాప్‌, ఫేస్‌బుక్, ఎక్స్‌..…

1 hour ago

డ్యూడ్-2… అవసరమా?

గత ఏడాది తమిళ, తెలుగు భాషల్లో పెద్ద హిట్ అయిన సినిమాల్లో ‘డ్యూడ్’ ఒకటి. లవ్ టుడే, డ్రాగన్ చిత్రాలతో…

2 hours ago

అబ్సెషన్ మూవీకి నీలాంబరి కనెక్షన్

బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తున్న హాలీవుడ్ మూవీ అబ్సెషన్ ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. రెండు గంటల లోపే నిడివితో థ్రిల్లర్…

5 hours ago

పెద్దిలో మిస్స‌యిన లాజిక్‌కు బుచ్చిబాబు జ‌వాబు

ఈ ఏడాది టాలీవుడ్ నుంచి వ‌చ్చిన బిగ్గెస్ట్ మూవీ పెద్ది. పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున విడుద‌లైన ఈ…

6 hours ago

ఓదెల ‘మెగా’ ప్రాజెక్టు… స్ట్రాటజీ మార్చాల్సిందే

భోళా శంకర్ తర్వాత ఏడాదిన్నర గ్యాప్ ని మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ దాదాపుగా పూడ్చేసింది. అయితే ఒకప్పటిలా…

7 hours ago

బుధవారం జోడింపులు వర్కౌట్ అయ్యేనా

పెద్దిలో కొత్త సీన్లు కలుపుతారని, కొంత ఎడిటింగ్ జరుగుతుందని కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి చెక్ పడింది. ఇవాళ జరిగిన ప్రెస్…

7 hours ago