Political News

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి పాఠ‌శాల విద్యాశాఖ ఉత్త‌ర్వులు కూడా జారీ చేసింది. 1వ త‌ర‌గ‌తి నుంచి 5వ త‌ర‌గ‌తి వ‌ర‌కు స‌ర‌ళ‌మైన భాష‌లో చాగంటి ప్ర‌వ‌చనాల‌ను పుస్త‌కాలుగా అందించ‌నున్న‌ట్టు పేర్కొంది. వీటిని పాఠ్యాంశాలుగానే చూడాల‌ని తెలిపింది. 6వ త‌ర‌గ‌తి నుంచి 10వ త‌ర‌గ‌తి వ‌ర‌కు కూడా చాగంటి ప్ర‌వ‌చ‌నాల పుస్త‌కాల‌ను ఇస్తున్న‌ట్టు తెలిపింది. అయితే.. ఆయా అంశాల్లో తేడా ఉంటుంద‌ని.. 1 నుంచి 5వ‌ త‌ర‌గ‌తి వ‌ర‌కు స‌ర‌ళ‌మైన అంశాలు.. 6-10వ త‌ర‌గ‌తి వ‌ర‌కు విలువ‌ల‌తో కూడిన విద్యపై పాఠ్యాంశాలు ఉంటాయ‌ని తెలిపింది.

మార్కులు కూడా..

ఈ పాఠ్యాంశాల‌కు మార్కులు కూడా కేటాయించ‌నున్న‌ట్టు పాఠశాల విద్యాశాఖ స్ప‌ష్టం చేసింది. మొత్తం 8 నుంచి 10 మార్కుల‌కు సంబంధించి చాగంటి పుస్త‌కాల నుంచి ప్ర‌శ్న‌లు వ‌స్తాయ‌ని.. విద్యార్థులు సులువుగా అర్ధం చేసుకుని వాటికి స‌మాధానాలు రాయొచ్చ‌ని పేర్కొంది. ఒక్కొక్క పుస్త‌కం 40-50 పేజీల‌తో ఉంటుంద‌ని.. వీటిని ప్ర‌భుత్వ‌మే ఉచితంగా అన్ని పాఠ‌శాల‌ల‌కు పంపిణీ చేయ‌నుంద‌ని వివ‌రించింది. మంత్రి నారా లోకేష్ ఆశ‌యాలు, ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా ఈ పాఠ్యాంశాల‌ను ప్ర‌వేశ పెడుతున్నామ‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన‌డం గ‌మ‌నార్హం. కాగా.. విలువ‌ల విద్య అంశానికి సంబంధించి చాగంటిని ప్ర‌భుత్వం స‌ల‌హాదారుగా నియ‌మించుకున్న విష‌యం తెలిసిందే.

ఆయ‌న రాష్ట్ర వ్యాప్తంగా పాఠ‌శాల‌లు, విద్యాల‌యాల్లో ప‌ర్య‌టించి.. విద్యార్థుల‌కు అవ‌స‌ర‌మైన విలువ‌ల‌ను బోధిస్తారు. త‌న ప్ర‌వచనాల ద్వారా వారిలో మార్పు తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌భుత్వ అధికారిక కార్య‌క్ర‌మంగా నిర్వ‌హించాల‌ని ఉత్త‌ర్వుల్లో మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. చాగంటి ప‌ర్య‌ట‌న‌ల్లో ఎమ్మెల్యేలు, క‌లెక్ట‌ర్‌, పోలీసులు కూడా రావాల‌ని పేర్కొన్నారు. శాంతి భ‌ద్ర‌త‌ల‌కు ఎలాంటి విఘాతం క‌ల‌గ‌కుండా భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని సూచించారు. కాగా.. చాగంటి ప్ర‌వ‌చనాల‌ను పాఠ్యాంశాలుగా ముఖ్యంగా మార్కుల‌తో అనుసంధానం చేయ‌డం ఇదే తొలిసారి. మ‌రి దీనిపై విమ‌ర్శ‌లు వ‌స్తాయో ప్ర‌శంస‌లు వ‌స్తాయో చూడాలి.

ఇవీ పాఠ్యాంశాలు..

1-5 వ త‌ర‌గ‌తి వ‌ర‌కు: అమ్మానాన్న‌ల విలువ‌, వారి ప్రేమ‌. కుటుంబ విలువ‌లు. స్నేహితులు, మ‌నో నిబ్బరం, ఓర్పు క్ర‌మ శిక్ష‌ణ‌. మంచి అల‌వాట్లు వంటి వాటిని పాఠ్యాంశాలుగా చేర్చారు.

6-10వ త‌ర‌గ‌తి వ‌ర‌కు..: ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌, మొక్క‌ల పెంప‌కం, చెట్ల విలువ‌, వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు.. జ‌ల విలువ‌, నీటి సంర‌క్ష‌ణ విధానాల‌ను పాఠ్యాంశాలుగా పేర్కొన్నారు. వీటికి 8 – 10 ప్ర‌శ్న‌లు ఉంటాయ‌ని ఉత్త‌ర్వుల్లో తెలిపారు.

This post was last modified on June 10, 2026 10:26 pm

Share

Recent Posts

రాష్ట్రానికి గొడ్డ‌లి పార్టీ గ్ర‌హణం వీడింది

రాష్ట్రానికి గొడ్డ‌లి పార్టీ గ్ర‌హ‌ణం వీడింద‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. 2019లో రాష్ట్రానికి గొడ్డ‌లి పార్టీ గ్ర‌హ‌ణం ప‌ట్టుకుంద‌ని.. అయితే,…

26 minutes ago

బాలయ్య నాగ్ తలపడితే ఎవరికి రిస్కు

డిసెంబర్ 24  పోటీ రసవత్తరంగా మారుతోంది. కింగ్ 100 ఆల్రెడీ ఆ డేట్ ని తీసుకోగా తాజాగా బాలయ్య 111…

1 hour ago

అనవసరమైన డైవర్షన్లతో ‘టాక్సిక్’ రచ్చ

దశాబ్దాల చరిత్ర కలిగిన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఎన్నో బ్లాక్ బస్టర్లు, ఎన్నో డిజాస్టర్లు చూసింది. అన్ని భాషలకు ఇది…

1 hour ago

దుల్కర్ సల్మాన్ నమ్మకం గట్టిదే

తెలుగులో దుల్కర్ సల్మాన్ కు మార్కెట్, ఇమేజ్ రెండూ ఉన్నాయి. మహానటి, సీతారామం బ్లాక్ బస్టర్స్ తన రేంజ్ ని…

2 hours ago

పుట్టిల్లు గెంటేస్తే అత్తారిల్లు కడుపులో పెట్టుకుంది: కవిత

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత  మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను పుట్టింటి నుంచి బ‌ల‌వం తంగా…

2 hours ago

ఫ్లోరైడ్ నుంచి ప్రాజెక్టు వ‌ర‌కు… వెలిగొండ ప్ర‌స్థానం ఇదీ!

కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా పూర్తి చేసి.. తాజాగా ప్రారంభించిన వెలిగొండ ప్రాజెక్టుకు సుమారు 50 సంవ‌త్స‌రాలకు పైగానే చ‌రిత్ర ఉంద‌ని…

2 hours ago