Political News

రూ.25 లక్షల పరిహారం… ఓ శాశ్వత ఉద్యోగం

విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరి పరిస్తితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్లాంట్ లో ద్రవ ఉక్కును తరలిస్తున్న సమయంంలో దానిని తీసుకెళుతున్న బకెట్ లకు రంద్రం పడి ద్రవ ఉక్కు కిందిపడిపోయి ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ప్లాంట్ ఉధ్యోగులు, కార్మకులపై ఆ ద్రవ ఉక్కు పడగా… వారంతా అక్కడికక్కడే చనిపోయారు. అక్కడికి సమీపంలో ఉన్నవారు గాయపడ్డారు. మరి చనిపోయిన వారికి పరిహారం, వారి కుటుంబాలకు భరోసా ఏమిటన్నది ఇప్పటికే తేలిపోయింది.

ప్రమాదం గురించిన సమాచారం అందిన వెంటనే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి రాత్రికి రాత్రే విశాఖ చేరుకున్నారు. ప్రమాదాన్ని పరిశీలించిన ఆయన మృతుల కుటుంబాలను పమార్శించారు. క్షతగాత్రుల పరిస్థితిపైనా ఆయన ఆరా తీశారు. ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు పరిహారం మాట ఏమిటన్న దానిపై ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దీనిపైనా ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చేసిన కుమారస్వామి.. పరిహారం, ఇతరత్రా కార్యక్రమాలను సోమవారం రాత్రే ప్రకటించారు.

తాజాగా మంగళవారం ఉదయం విశాఖ వచ్చిన జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… బాదితులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన పరిహారం, బాధిత కుటుంబాలకు ఏమేం చేయనున్నాయన్న విషయాన్ని కూడా పవన్ విస్పష్టంగా ప్రకటించారు. కుమారస్వామి ప్రకటించిన వాటికి అదనంగా ఏమేం ఇవ్వనున్నామన్న విషయాన్ని పవన్ చెప్పారు. అటు మంత్రి, ఇటు పవన్ చెప్పిన దాని ప్రకారం బాధితులకు ఏమేం అందనున్నాయన్న దానిపై స్పష్టత వచ్చిందని చెప్పాలి.

ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల పరిహారం అందనుంది. అంతేకాకుండా చనిపోయిన వారి పిల్లలకు ఉచిత విద్య అందనుంది. ఆ పిల్లలు ఎంతవరకు చదివితే.. అంతమేర ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుందనుంది. ఇక ఆయా కుటుంబాలకు శాశ్వత ప్రాతిపాదికన ఉద్యోగాలు అందనున్నాయి.

ఇక క్షతగాత్రులకు వారు పూర్తిగా కోలుకునేదాకా ఉచిత వైద్యాన్ని అందనుంది, చికిత్స ఖర్చులు కాకుండా ఒక్కో క్షతగాత్రుడికి రూ.10 లక్షల మేర సాయం అందనుంది. ఇక మృతులకు ఇన్సూరెన్స్ సొమ్ము అందనుంది. ప్రభుత్వం ప్రకటించిన సాయం ఇన్సూరెస్స్ సొమ్ముకు అదనమని పవన్ విస్పష్టంగా ప్రకటించారు.

విశాఖలోనే వైసీపీ హయాంలో ఎల్జీ పాలిమర్స్ నుంచి విషవాయువులు వెలువడిన సమయంలో పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఆ సమయంలో ఎల్జీ పాలిమర్స్ నుంచి ఒక్కో మృతుడికి రూ.1 కోటి పరిహారాన్ని అందేలా చేశారు. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్న చాలా మంది మృతుల కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ డిమాండ్ వినిపించకముందే అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిహారం ప్రకటించడం గమనార్హం. అంతేకాకుండా ప్రభుత్వం తన బాధ్యతను అందరికంటే ముందు స్పందించి బాధితులకు అండగా నిలిచిందన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

Kumar

Recent Posts

2026 అర్ధసంవత్సరం… సరిపోని ఉత్సాహం

2026 సంవత్సరంలో ఆరు నెలలు గడిచిపోయాయి. ఏదో నిన్నా మొన్నా కొత్త సంవత్సరం జరుపుకున్నట్టు ఉంది కానీ కాలం కర్పూరంలా…

15 minutes ago

ఇంకొంచెం ఆగాలంటున్న రణబాలి ?

విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్…

21 minutes ago

ప్రేక్షకులకు నచ్చని కాక్ టైల్ రుచి

షాహిద్ కపూర్,కృతి సనన్, రష్మిక మందన్న కలయికలో రూపొందిన కాక్ టైల్ 2 వసూళ్లు బాగా పడిపోవడం నిర్మాతలను ఆందోళనకు…

31 minutes ago

సాహో హీరోయిన్ ‘ఈథ’కు టైటిల్ వివాదం

ఒకవేళ సాహో పెద్ద హిట్టయ్యింటే హీరోయిన్ శ్రద్ధ కపూర్ తెలుగులో వరసగా కనిపించేదేమో కానీ అనుకున్న ఫలితం అందుకోకపోవడంతో పూర్తిగా…

1 hour ago

పవన్ అంటే అంత పగ ఎందుకు కవిత గారు?

అదేంటో గానీ… విషయం ఏదైనా జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేరు తీయాల్సిందే. ఆయనపై విమర్శలు…

1 hour ago

ఘట్టమనేని వారసుడి వెనుకడుగు ఎందుకంటే

ఘట్టమనేని మూడో తరం వారసుడు జయకృష్ణ డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురం జూలై 9 విడుదలని మొన్నటి దాకా టీమ్…

3 hours ago