సహజంగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఒకరిని ఆదర్శంగా తీసుకోవాలని పెద్దగా చెప్పరు. ఆయన ఏదైనా చెప్పారంటే ఖచ్చితంగా దానిలో సబ్జెక్టు ఉంటుంది. తాజాగా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మంగళగిరి నియోజకవర్గం గురించి వివరించారు. ఈ నియోజకవర్గం ఆదర్శంగా మారిందని.. ఒక్కసారి అందరూ కుదిరినప్పుడు నియోజకవర్గంలో పర్యటించాలని కూడా సూచించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్న తీరును కూడా పరిశీలించాలన్నారు.
గత 2019 ఎన్నికల్లో నారా లోకేష్ ఇక్కడ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అయినప్పటికీ.. పట్టుదలతో ముందుకు సాగారు. నియోజవకర్గంలోని ప్రతిఇంటికీ ఆయన పరిచయమయ్యారు. యువగళం పాదయాత్రను రాష్ట్ర వ్యాప్తంగా చేయగా.. మంగళగిరి నియోజకవర్గంలో యువగళానికి ముందే పాదయాత్ర చేశారు. ప్రతి ఇంటినీ టచ్ చేశారు. తద్వారా.. పార్టీపరంగానే కాకుండా.. వ్యక్తిగతంగా కూడా ఆయన పరిచయం అయ్యారు. ఇది 2024 ఎన్నికల నాటికి కలిసివచ్చింది.
లోకేష్ అంటే.. మన నాయకుడు అనే మాట వినిపించేలా చేశారు. 2024లో కేవలం గెలుపు గుర్రం ఎక్కడమే కాకుండా.. భారీమెజారిటీని కూడా లోకేష్ దక్కించుకున్నారు. అందుకే సీఎం చంద్రబాబు మంగళగిరి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా పేర్కొన్నారు. దీనిలో చేపడుతున్న అభివృద్ధి పనులను కూడా వీక్షించాలని చెప్పారు. ప్రజలతో మమేకం అవుతున్న తీరును కూడా ఆయన నాయకులకు వివరిం చారు.
ఎందుకిలా.. ?
ప్రస్తుతం సోషల్ మీడియా దూకుడు పెరిగిన తర్వాత.. నాయకులకు-ప్రజలకు మధ్య సంబంధం కూడా పెరిగింది. మంచిని మంచిగానే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరిలో లోకేష్ గెలుపు ఖాయమని అంటున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా.. నేనున్నానంటూ లోకేష్ వస్తున్నారు. తరచుగా నియోజకవర్గంలో సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఇలానే ఇతర నియోజకవర్గాల్లో కూడా నాయకులు వ్యవహరించాలన్నది చంద్రబాబు ఆలోచన. మరి ఆదిశగా అడుగులు వేస్తారా? అనేది చూడాలి.
టాలీవుడ్ నుంచి మరో మెగా మూవీకి సంబంధించి అనౌన్స్మెంట్ వచ్చింది. కొన్నేళ్ల నుంచి చర్చల్లో ఉన్న గాడ్ ఆఫ్ వార్…
జనసేన పార్టీని పుంజుకునేలా చేయాలన్నది పార్టీ అధిపతి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆలోచన. అందుకే ఆయన తరచుగా కమిటీలు…
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…