ఈ రోజు జనసేన తలపెట్టిన ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం’ సభకు తెలంగాణ పోలీసులు, హైకోర్టు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన అధినేత , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్, తెలంగాణలోకి తనను అడుగు పెట్టనివ్వబోమని అంటున్నారని, తెలంగాణ మీ అయ్య జాగీరా? అంటూ పవన్ నిప్పులు చెరిగారు.
తాను తెలంగాణ నలు మూలలా తిరిగానని, తెలంగాణ బాగుండాలని అనుకునే వాడినని పవన్ అన్నారు. 2007లోనే తనను ఈ రోజు విమర్శిస్తున్న గొంతులు లేవని అన్నారు. ఆదిలాబాద్ లాంటి నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో తిరిగానని చెప్పారు. తెలంగాణపై ఈ రోజు కొత్తగా ప్రేమ రాలేదని స్పష్టం చేశారు. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని, విభజన జరిగిన తీరుకు వ్యతిరేకం అని పవన్ చెప్పారు. పార్లమెంట్ తలుపులు మూసి ఉమ్మడి ఏపీని విభజించిన తీరుకు జనసేన వ్యతిరేకం అని, ఈ విషయంపై తెలంగాణ ప్రజలకు మరోసారి స్పష్టతనిస్తున్నానని పవన్ అన్నారు.
సామాజిక తెలంగాణ నినాదంతో అన్ని కులాలు బాగుండాలి అన్నదే జనసేన విధానం అని అన్నారు. తెలంగాణ సంస్కతిపై, తెలంగాణపై తనకు ఎంత ప్రేమ ఉందో తనను విమర్శించే నాయకులకు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు. కష్టంలో ఉన్నప్పుడు తన వెంట ఉన్నది తెలంగాణ ప్రజలని, వారాహికి అనుమతినిచ్చింది తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు.
దర్శకుడు గుణశేఖర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడేదో ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒక్కడు, చూడాలని ఉంది, రామాయణం, సొగసు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో నిర్వహించతలపెట్టిన నవ నిర్మాణ…
సీనియర్ దర్శకుడు గుణశేఖర్ది ఎప్పుడూ సాహసోపేత ప్రయాణమే. కెరీర్ ఆరంభంలోనే ‘బాల రామాయణం’తో పెద్ద రిస్క్ చేశారాయన. దర్శకుడిగా తన…
బాలీవుడ్ హీరోయిన్లు పెద్ద పెద్ద బిజినెస్మ్యాన్లను పెళ్లాడి వ్యక్తిగత జీవితంలో స్థిరపడడం మామూలే. కొందరేమో కొన్నేళ్లు రిలేషన్షిప్లు ఉండి ఆర్థిక…
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…