ఏపీ అధికార పార్టీ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. సంచలన ప్రకటన చేశారు. పార్టీలో యువతరాన్ని ఆకర్షించేందుకు.. వారి ఆశలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేసేందుకు.. సేనా గళం పేరుతో కొత్త విభాగాన్ని ఏర్పాటు చేస్తు న్నట్టు తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జెన్-జీ మాట వినిపిస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ యువతకు ప్రాధాన్యం పెంచనుందని చెప్పారు. ఈ సేనాగళం ద్వారా.. సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణకు పాటు పడే వారికి ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు.
సేనాగళం పేరుతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన పవన్ కల్యాణ్.. యువతకు ముఖ్యంగా 40 ఏళ్ల లోపు వారికి ఈ కమిటీలలో ప్రాధాన్యం ఇవ్వాలని సీనియర్ నాయకులకు సూచించారు. నియోజకవర్గాల వారీగా సేనాగళం కమిటీలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కమిటీకి.. కులాలు, మతాలతో పని ఉండదని.. ప్రజలకు అవసరమైన.. ప్రభుత్వం చేస్తున్న పనులను వారికి అందేలా చేయడమే.. ఈ కమిటీ లక్ష్యంగా పేర్కొన్నారు. కులాల కుమ్ములాటలకు సేనా గళం కమిటీలో ఎలాంటి ప్రాధాన్యం ఉండదని తేల్చి చెప్పారు.
బూర్జువా సంస్కృతులకు జనసేన తీవ్ర వ్యతిరేకమని పేర్కొన్న పవన్ కల్యాణ్.. పాతకాలపు విధానాలను బుట్ట దాఖలు చేస్తామన్నారు. అభ్యుదయ భావాలు.. ప్రజలకు ఏదైనా మంచి చేయాలన్న ఆలోచన ఉన్నవారికి పార్టీలోను.. ముఖ్యంగా సేనా గళం కమిటీలోనూ ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. కొందరు నాయకులు, పార్టీలు కూడా.. తాము చేస్తున్న తప్పులకు కులం కార్డు తొడుగుతున్నారని.. సున్నితమైన అంశాలకు కులాలు, మతాల ముచ్చట్లను ముడిపెడుతున్నారని వ్యాఖ్యానించారు. వ్యక్తులు చేసే తప్పులకు సమాజం బాధ్యత వహించాలా? అని ప్రశ్నించిన ఆయన.. దీనినే నేటి యువత వ్యతిరేకిస్తోందన్నారు.
సేనా గళం బాధ్యతలు ఇవీ..
This post was last modified on June 1, 2026 1:03 am
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…
మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…
నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…