అక్క చెల్లెమ్మలకు.. 2 లక్షల కోట్ల సంక్షేమ పథకాలు ఇచ్చాం. జగనన్న తోడు, భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి.. ఇన్ని ఇచ్చాం.. ఇవన్నీ ఎటు పోయాయో!. ఏం జరిగిందో! 2024 మేలో వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్లు ఇవి. దీనికి కారణం.. ఆనాటి ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయి 151 స్థానాల నుంచి 11కు పడిపోయింది.
మేం ఓడిపోలేదు. ఇది ఎన్నికల సంఘంతో జరిగిన పోరు. నేను నా పదవికి రాజీనామా కూడా చేయను. ఇక్కడ జరిగింది బీజేపీతో యుద్ధం కాదు. ఎన్నికల సంఘంతో యుద్ధం. మా ఓట్లు తొలగించి.. మాపైనే ఎన్నికల సంఘం దబాయించింది. – ఇది.. ఈ నెల మొదట్లో వచ్చిన ఎన్నికల ఫలితాల్లో పశ్చిమ బెంగాల్లో అధికారం కోల్పోయిన నాటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు. మొత్తంగా తమ ఓటమిని అంగీకరించలేదు.
అయితే.. ప్రజలు పిచ్చోళ్లు కాదు. ఎవరిని ఎందుకు ఓడించారన్న దానికి స్పష్టమైన రుజువులు కనిపిస్తాయి. ప్రజల చిత్తంలో అనేక రీజన్లు కూడా ఉంటాయి. తాజాగా.. అదే మమతా బెనర్జీ మేనల్లుడు.. ఎంపీ అభిషేక్ బచ్చన్ను ప్రజలు పరుగులు పెట్టించి మరీ కొట్టారు. రాళ్లు, కోడిగుడ్లు, చెప్పులు, ఇలా.. చేతికి ఏది అందితే దాంతో కొట్టారు. పోనీ.. ఇదేమన్నా బీజేపీ ఇలాకానా? దాడి చేసిన వారు బీజేపీ మనుషులా? అంటే సమాధానం కాదనే వినిపిస్తుంది.
తృణమూల్ కాంగ్రెస్కు ముఖ్యంగా మమతకు గట్టి పట్టున్న నియోజకవర్గం సోనాపూర్లోనే ప్రజల నుంచి పెద్ద ఎత్తున తిరుగుబాటు కనిపించింది. అంతేకాడు.. దొంగ-దొంగ.. అంటూ మహిళలే అభిషేక్ను వెంబడించారు. అసలు ఏం జరిగిందటే.. ఇటీవల ఎన్నికల అనంతరం.. రాష్ట్రంలో బీజేపీకి-తృణమూల్ వర్గానికి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోనాపూర్లో దెబ్బలు తగిలి.. ఆసుపత్రి పాలైన కేడర్ను పరామర్శించేందుకు అభిషేక్ వెళ్లారు.
కానీ, ప్రజలే స్వచ్ఛంంగా బయటకు వచ్చి అభిషేక్పై విమర్శల వర్షం కురిపించారు. చెప్పులు, రాళ్లు విసిరారు. ఇంకా కసి తీరని ప్రజలు.. బూతుల వర్షం కురిపించారు. దొంగ వచ్చాడు.. అంటూ మహిళలు తగులుకున్నారు. సో.. ఇదీ.. మమతా బెనర్జీ ఎందుకు ఓడిపోయారో చెప్పడానికి నిదర్శనం. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతనుఅంచనా వేసి ఉంటే.. వ్యవస్థలను.. తన వారినీ సరిదిద్దుకునే వారు. తద్వారా.. మరోసారి అధికారం చేపట్టేవారు. కానీ.. అంతా బాగుందని జగన్ మాదిరిగా అనుకున్న నేపథ్యమే ప్రజలకు దూరం చేసింది.
తమిళ అగ్ర కథాానాయకుల్లో ఒకరైన అజిత్ కుమార్కు నిన్న మాతృ వియోగం జరిగిన సంగతి తెలిసిందే. ఆయన తల్లి మోహిని…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు.. పార్టీలో అంతర్గత…
తెలంగాణ అన్న పదం డిక్షనరీలోనే లేదని.. కొందరు ప్రాంతీయ వాదులు సృష్టించిన పదమని.. ఇటీవల తెలంగాణకు చెందిన కీలక టీడీపీ…
ప్రేమికుల నుంచి నిజ జీవిత భార్యాభర్తలుగా మారిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ప్యాన్ ఇండియా మూవీ…
కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు బడ్జెట్, స్టార్ క్యాస్టింగ్ పట్టించుకోరని ప్రతి భాషలో రుజువవుతూనే ఉంది. మన దగ్గర బలగం,…
సంక్రాంతి తర్వాత వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్లో మళ్లీ కళ తెచ్చే సినిమా అవుతుందని అందరూ ‘పెద్ది’ మీదే ఆశలు పెట్టుకున్నారు.…