అమెరికాలో మరో విషాదకర ఘటన తెలుగు కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. తెలంగాణకు చెందిన ఓ యువ విద్యార్థి తన స్నేహితుల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో తాను ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తోంది.
నల్గొండ జిల్లాకు చెందిన అనురూప్ రెడ్డి కొడూరు (22) ఇటీవలే యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. మే 29న స్నేహితులతో కలిసి టెక్సాస్, లూసియానా సరిహద్దులోని టోలెడో బెండ్ రిజర్వాయర్ ప్రాంతానికి వెళ్లాడు.
ఈ సందర్భంగా నీటిలో ముగ్గురు స్నేహితులు ప్రమాదంలో చిక్కుకోవడంతో అనురూప్ వెంటనే వారిని రక్షించేందుకు దూకాడు. అద్భుత ధైర్యసాహసాలు చూపించి ముగ్గురినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చాడు. కానీ అదే సమయంలో నీటి అడుగున ఉన్న ఫిషింగ్ వైర్ అతని కాళ్లకు చిక్కుకుంది.
బలమైన నీటి ప్రవాహం కారణంగా బయటపడలేకపోయిన అనురూప్ నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు గంటల తరబడి గాలింపు చేపట్టి చివరకు అతని మృతదేహాన్ని సుమారు 20 అడుగుల లోతులో గుర్తించాయి.
అమెరికాలో చదువుకుంటున్న తెలుగు విద్యార్థుల మరణ వార్తలు తరచూ వినిపిస్తున్న వేళ ఈ ఘటన మరింత బాధ కలిగిస్తోంది. ముగ్గురు స్నేహితుల ప్రాణాలు కాపాడి తన ప్రాణాన్ని త్యాగం చేసిన అనురూప్ ధైర్యం ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది. అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు, యూనివర్సిటీ వర్గాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.
అక్క చెల్లెమ్మలకు.. 2 లక్షల కోట్ల సంక్షేమ పథకాలు ఇచ్చాం. జగనన్న తోడు, భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన,…
తమిళ అగ్ర కథాానాయకుల్లో ఒకరైన అజిత్ కుమార్కు నిన్న మాతృ వియోగం జరిగిన సంగతి తెలిసిందే. ఆయన తల్లి మోహిని…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు.. పార్టీలో అంతర్గత…
తెలంగాణ అన్న పదం డిక్షనరీలోనే లేదని.. కొందరు ప్రాంతీయ వాదులు సృష్టించిన పదమని.. ఇటీవల తెలంగాణకు చెందిన కీలక టీడీపీ…
ప్రేమికుల నుంచి నిజ జీవిత భార్యాభర్తలుగా మారిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ప్యాన్ ఇండియా మూవీ…
కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు బడ్జెట్, స్టార్ క్యాస్టింగ్ పట్టించుకోరని ప్రతి భాషలో రుజువవుతూనే ఉంది. మన దగ్గర బలగం,…