తమిళ అగ్ర కథాానాయకుల్లో ఒకరైన అజిత్ కుమార్కు నిన్న మాతృ వియోగం జరిగిన సంగతి తెలిసిందే. ఆయన తల్లి మోహిని మణి 85 ఏళ్ల వయసులో శనివారం మృతి చెందారు. అజిత్ కుటుంబంలో ఎంతో కీలకమైన వ్యక్తి మరణంతో తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఇండస్ట్రీ ప్రముఖులందరూ అజిత్ ఇంటికి వెళ్లి నివాళులు అర్పిస్తున్నారు.
దశాబ్దాలుగా అజిత్కు పోటీ హీరోగా ఉన్న విజయ్, ముఖ్యమంత్రి హోదాలో వెళ్లి మోహిని మణికి నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి అయినప్పటికీ క్యాజువల్ లుక్లోనే విజయ్.. అజిత్ ఇంటికి వెళ్లారు. ప్రోటోకాల్ ప్రకారం భద్రత సిబ్బంది సైతం ఆయన ఇంటికి వెళ్లారు. ఐతే విజయ్తో పాటుగా త్రిష కూడా అజిత్ ఇంటికి వెళ్లడం గమనార్హం.
విజయ్ తన భార్య సంగీత నుంచి కొన్నేళ్లుగా దూరంగా ఉండగా.. త్రిష అతడితో కలిసి ఉంటోంది. ఈ నేపథ్యంలో అజిత్ ఇంటికి విజయ్తో పాటుగా త్రిష వెళ్లింది. ఎన్నికలకు ముందు విజయ్ త్రిషతో కలిసి ఒక పెళ్లికి వెళ్లడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. వాళ్లిద్దరూ కలిసి బహిరంగంగా కనిపించడం అదే తొలిసారి. సీఎం అయ్యాక మళ్లీ ఇప్పుడు తొలిసారిగా ఇద్దరూ కలిసి ఇలా దర్శనమిచ్చారు.
ఇంటి నుంచి బయటికి వచ్చి వీళ్లిద్దరినీ రిసీవ్ చేసుకున్నాడు అజిత్. ఈ సందర్భంగా అజిత్ను విజయ్ హత్తుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది. విజయ్, అజిత్ అభిమానులు బయట శత్రువుల్లా వ్యవహరిస్తారు కానీ.. ఈ ఇద్దరు హీరోల మధ్య మంచి స్నేహమే ఉంది. ఒకరినొకరు ఎంతో గౌరవించుకుంటారు. విజయ్ తన ప్రసంగాల్లో తరచుగా అజిత్ పేరు ప్రస్తావిస్తుంటారు కూడా.
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…