తమిళ అగ్ర కథాానాయకుల్లో ఒకరైన అజిత్ కుమార్కు నిన్న మాతృ వియోగం జరిగిన సంగతి తెలిసిందే. ఆయన తల్లి మోహిని మణి 85 ఏళ్ల వయసులో శనివారం మృతి చెందారు. అజిత్ కుటుంబంలో ఎంతో కీలకమైన వ్యక్తి మరణంతో తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఇండస్ట్రీ ప్రముఖులందరూ అజిత్ ఇంటికి వెళ్లి నివాళులు అర్పిస్తున్నారు.
దశాబ్దాలుగా అజిత్కు పోటీ హీరోగా ఉన్న విజయ్, ముఖ్యమంత్రి హోదాలో వెళ్లి మోహిని మణికి నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి అయినప్పటికీ క్యాజువల్ లుక్లోనే విజయ్.. అజిత్ ఇంటికి వెళ్లారు. ప్రోటోకాల్ ప్రకారం భద్రత సిబ్బంది సైతం ఆయన ఇంటికి వెళ్లారు. ఐతే విజయ్తో పాటుగా త్రిష కూడా అజిత్ ఇంటికి వెళ్లడం గమనార్హం.
విజయ్ తన భార్య సంగీత నుంచి కొన్నేళ్లుగా దూరంగా ఉండగా.. త్రిష అతడితో కలిసి ఉంటోంది. ఈ నేపథ్యంలో అజిత్ ఇంటికి విజయ్తో పాటుగా త్రిష వెళ్లింది. ఎన్నికలకు ముందు విజయ్ త్రిషతో కలిసి ఒక పెళ్లికి వెళ్లడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. వాళ్లిద్దరూ కలిసి బహిరంగంగా కనిపించడం అదే తొలిసారి. సీఎం అయ్యాక మళ్లీ ఇప్పుడు తొలిసారిగా ఇద్దరూ కలిసి ఇలా దర్శనమిచ్చారు.
ఇంటి నుంచి బయటికి వచ్చి వీళ్లిద్దరినీ రిసీవ్ చేసుకున్నాడు అజిత్. ఈ సందర్భంగా అజిత్ను విజయ్ హత్తుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది. విజయ్, అజిత్ అభిమానులు బయట శత్రువుల్లా వ్యవహరిస్తారు కానీ.. ఈ ఇద్దరు హీరోల మధ్య మంచి స్నేహమే ఉంది. ఒకరినొకరు ఎంతో గౌరవించుకుంటారు. విజయ్ తన ప్రసంగాల్లో తరచుగా అజిత్ పేరు ప్రస్తావిస్తుంటారు కూడా.
This post was last modified on May 31, 2026 11:40 am
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ తాతా మధు వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపిన…
వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు…అంటే రోగి ప్రాణాలు కాపాడే వైద్యుడు దేవుడితో సమానం అన్న నానుడిని ఇప్పటికీ చాలామంది…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ మీద యూత్ వర్గాల్లో మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇవాళ…
తెలంగాణ శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం…
ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మనం ఫాలో కాని అకౌంట్ల నుంచి కూడా వరుసగా రీల్స్ వచ్చేస్తుంటాయి. ఒక వీడియో కాస్త…
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో వున్న కూటమి పార్టీల్లో కొన్ని రోజులుగా క్షేత్రస్థాయి కార్యకర్తలు, నాయకుల మధ్య సోషల్ వార్ జరుగుతుంది.…