తమిళ అగ్ర కథాానాయకుల్లో ఒకరైన అజిత్ కుమార్కు నిన్న మాతృ వియోగం జరిగిన సంగతి తెలిసిందే. ఆయన తల్లి మోహిని మణి 85 ఏళ్ల వయసులో శనివారం మృతి చెందారు. అజిత్ కుటుంబంలో ఎంతో కీలకమైన వ్యక్తి మరణంతో తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఇండస్ట్రీ ప్రముఖులందరూ అజిత్ ఇంటికి వెళ్లి నివాళులు అర్పిస్తున్నారు.
దశాబ్దాలుగా అజిత్కు పోటీ హీరోగా ఉన్న విజయ్, ముఖ్యమంత్రి హోదాలో వెళ్లి మోహిని మణికి నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి అయినప్పటికీ క్యాజువల్ లుక్లోనే విజయ్.. అజిత్ ఇంటికి వెళ్లారు. ప్రోటోకాల్ ప్రకారం భద్రత సిబ్బంది సైతం ఆయన ఇంటికి వెళ్లారు. ఐతే విజయ్తో పాటుగా త్రిష కూడా అజిత్ ఇంటికి వెళ్లడం గమనార్హం.
విజయ్ తన భార్య సంగీత నుంచి కొన్నేళ్లుగా దూరంగా ఉండగా.. త్రిష అతడితో కలిసి ఉంటోంది. ఈ నేపథ్యంలో అజిత్ ఇంటికి విజయ్తో పాటుగా త్రిష వెళ్లింది. ఎన్నికలకు ముందు విజయ్ త్రిషతో కలిసి ఒక పెళ్లికి వెళ్లడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. వాళ్లిద్దరూ కలిసి బహిరంగంగా కనిపించడం అదే తొలిసారి. సీఎం అయ్యాక మళ్లీ ఇప్పుడు తొలిసారిగా ఇద్దరూ కలిసి ఇలా దర్శనమిచ్చారు.
ఇంటి నుంచి బయటికి వచ్చి వీళ్లిద్దరినీ రిసీవ్ చేసుకున్నాడు అజిత్. ఈ సందర్భంగా అజిత్ను విజయ్ హత్తుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది. విజయ్, అజిత్ అభిమానులు బయట శత్రువుల్లా వ్యవహరిస్తారు కానీ.. ఈ ఇద్దరు హీరోల మధ్య మంచి స్నేహమే ఉంది. ఒకరినొకరు ఎంతో గౌరవించుకుంటారు. విజయ్ తన ప్రసంగాల్లో తరచుగా అజిత్ పేరు ప్రస్తావిస్తుంటారు కూడా.
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…
సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…