తమిళ అగ్ర కథాానాయకుల్లో ఒకరైన అజిత్ కుమార్కు నిన్న మాతృ వియోగం జరిగిన సంగతి తెలిసిందే. ఆయన తల్లి మోహిని మణి 85 ఏళ్ల వయసులో శనివారం మృతి చెందారు. అజిత్ కుటుంబంలో ఎంతో కీలకమైన వ్యక్తి మరణంతో తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఇండస్ట్రీ ప్రముఖులందరూ అజిత్ ఇంటికి వెళ్లి నివాళులు అర్పిస్తున్నారు.
దశాబ్దాలుగా అజిత్కు పోటీ హీరోగా ఉన్న విజయ్, ముఖ్యమంత్రి హోదాలో వెళ్లి మోహిని మణికి నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి అయినప్పటికీ క్యాజువల్ లుక్లోనే విజయ్.. అజిత్ ఇంటికి వెళ్లారు. ప్రోటోకాల్ ప్రకారం భద్రత సిబ్బంది సైతం ఆయన ఇంటికి వెళ్లారు. ఐతే విజయ్తో పాటుగా త్రిష కూడా అజిత్ ఇంటికి వెళ్లడం గమనార్హం.
విజయ్ తన భార్య సంగీత నుంచి కొన్నేళ్లుగా దూరంగా ఉండగా.. త్రిష అతడితో కలిసి ఉంటోంది. ఈ నేపథ్యంలో అజిత్ ఇంటికి విజయ్తో పాటుగా త్రిష వెళ్లింది. ఎన్నికలకు ముందు విజయ్ త్రిషతో కలిసి ఒక పెళ్లికి వెళ్లడం అప్పట్లో చర్చనీయాంశం అయింది. వాళ్లిద్దరూ కలిసి బహిరంగంగా కనిపించడం అదే తొలిసారి. సీఎం అయ్యాక మళ్లీ ఇప్పుడు తొలిసారిగా ఇద్దరూ కలిసి ఇలా దర్శనమిచ్చారు.
ఇంటి నుంచి బయటికి వచ్చి వీళ్లిద్దరినీ రిసీవ్ చేసుకున్నాడు అజిత్. ఈ సందర్భంగా అజిత్ను విజయ్ హత్తుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది. విజయ్, అజిత్ అభిమానులు బయట శత్రువుల్లా వ్యవహరిస్తారు కానీ.. ఈ ఇద్దరు హీరోల మధ్య మంచి స్నేహమే ఉంది. ఒకరినొకరు ఎంతో గౌరవించుకుంటారు. విజయ్ తన ప్రసంగాల్లో తరచుగా అజిత్ పేరు ప్రస్తావిస్తుంటారు కూడా.
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు.. పార్టీలో అంతర్గత…
తెలంగాణ అన్న పదం డిక్షనరీలోనే లేదని.. కొందరు ప్రాంతీయ వాదులు సృష్టించిన పదమని.. ఇటీవల తెలంగాణకు చెందిన కీలక టీడీపీ…
ప్రేమికుల నుంచి నిజ జీవిత భార్యాభర్తలుగా మారిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ప్యాన్ ఇండియా మూవీ…
కంటెంట్ ఉంటే చాలు ప్రేక్షకులు బడ్జెట్, స్టార్ క్యాస్టింగ్ పట్టించుకోరని ప్రతి భాషలో రుజువవుతూనే ఉంది. మన దగ్గర బలగం,…
సంక్రాంతి తర్వాత వెలవెలబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్లో మళ్లీ కళ తెచ్చే సినిమా అవుతుందని అందరూ ‘పెద్ది’ మీదే ఆశలు పెట్టుకున్నారు.…
మలయాళంతో పాటు తెలుగులోనూ మంచి విజయం సాధించిన మూవీ ప్రేమలు. దీంట్లో జంటగా నటించిన నస్లెన్, మమిత బైజు ఎంత…