ఏపీ సీఎం చంద్రబాబు.. గత వారం రోజులుగా మహానాడు నిర్వహణపై దృష్టి పెట్టారు. ఇదేసమయంలో పాలన పరంగా కూడా సమీక్షలు.. సమావేశాలు నిర్వహించారు. ఇక, మహానాడు విజయవంతంగా ముగిసింది. ఇప్పుడు దీనికి మించిన కార్యక్రమం చంద్రబాబు ముందు ఉంది. అదే.. రాజ్యసభ సభ్యుల ఎంపిక. మరో మూడు రోజుల్లోనే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రానుంది.
మొత్తం 10 రాష్ట్రాల్లోని 26 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. వీటిలో 4 స్థానాలకు ఏపీకి చెందినవే ఉన్నాయి. పైగా.. ఈ నాలుగుస్థానాలు కూడా.. అధికార కూటమి పార్టీలకే దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో మెజారిటీ స్థానాలు గెలుచుకున్న టీడీపీ ఈ విషయంపై తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది. అయితే.. 4 స్థానాలే ఖాళీ అవుతున్నా.. పోటీలో మాత్రం 12-15 మంది అభ్యర్థులు ఉన్నారు.
దీనికితోడు.. మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలకు కూడా సీట్లు కేటాయించాల్సిన అవసరం ఏర్పడింది. జనసేనకు ఒకటి, బీజేపీకి ఒక స్థానం ఇచ్చి.. మిగిలిన రెండు స్థానాలను టీడీపీ తీసుకుంటుందని ఒక చర్చ నడుస్తుండగా.. బీజపీకి ఈ సారి ఇవ్వబోరని కూడా అంటున్నారు. ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాల క్రమంలో చంద్రబాబు కీలక సమావేశానికి రెడీ అయ్యారు. జనసేన పార్టీ నుంచి కీలక నాయకులతోపాటు.. బీజేపీ, టీడీపీల నుంచి కూడా నాయకులను పిలిచారు.
వీరితో చర్చించి.. ఎవరెవరికి టికెట్లు ఖరారు చేస్తారన్న విషయాన్ని నిర్ణయించనున్నట్టు తెలిసింది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే జూన్ 1వ తేదీ నాటికే.. దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఎంతో మంది నాయకులు రాజ్యసభకు వెళ్లాలని భావిస్తున్నా.. ప్రస్తుత అవసరాలు.. రిజర్వేషన్లు.. సహా.. ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలో తాజా సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…
సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఓ వ్యక్తి ఆరుగురిని…
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…
విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో…