ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ అనౌన్స్ మెంట్ చేయబోతున్నాను అంటూ టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ చెప్పిన సంగతి తెలిసిందే. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేశ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరగుతున్న తొలి మహానాడు సందర్భంగా లోకేశ్ చేయబోతున్న ఆ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.
ఈ క్రమంలోనే తన తాత ఎన్టీఆర్, తండ్రి సీబీఎన్ బాటలోనే మహిళలకు పెద్దపీట వేసేలాగా లోకేశ్ ఆ ప్రకటన చేశారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయినా కాకపోయినా టీడీపీ మహిళలకు కనీసం 33% సీట్లు రిజర్వ్ చేయాలని తాను ప్రతిపాదిస్తున్నానని అన్నారు. మహిళలకు 33 శాతం సీట్లు టీడీపీ కేటాయించాలని ఈ సభాముఖంగా తీర్మానం చేస్తున్నానని తెలిపారు.
పార్లమెంటులో ఇటీవల మహిళల రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టారని, ఆ బిల్లులకు ఎన్డీఏ మిత్రపక్షాలలో ఒకటిగా టీడీపీ మద్దతిచ్చిందని లోకేశ్ గుర్తు చేశారు. అయితే, కాంగ్రెస్ తో పాటు మరికొన్ని పార్టీలు ఆ బిల్లులను అడ్డుకున్నాయని అన్నారు.
అందుకే, మరోసారి బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. అయితే, అక్కడ బిల్లు పాస్ అయినా కాకున్నా…ఏపీలో మాత్రం టీడీపీ మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాలని తాను ప్రతిపాదిస్తున్నానని అన్నారు.
This post was last modified on May 27, 2026 1:12 pm
నాలుగు రోజులు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన చెన్నై లవ్ స్టోరీ తాలూకు కబుర్లు, ట్వీట్లే కనిపించాయి. మొదటి రోజు…
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు.. పట్టుమని ఒక్కగంట కూడా ప్రశాంతంగా జరగడం లేదు. సభ ప్రారంభం కాగానే అధికార, ప్రతిపక్ష సభ్యుల…
ఇప్పటి వరకు పుణ్యం వస్తుందని గుండు చేయించుకున్న వాళ్ళను చూసాం కానీ ఇప్పుడు పుణ్యం 15 వేల రూపాయల గిఫ్ట్…
సెల్ఫ్ గోల్స్ వేసుకోవడంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మించిన వాళ్లు లేరని…
భాషతో సంబంధం లేకుండా ఇండియా వైడ్ క్రేజ్ ఉన్న ప్యాన్ ఇండియా సినిమాల్లో అల్లు అర్జున్ 'రాకా' టాప్ 3లో…
ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర రాజధాని పై తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి శాశ్వతంగా ఉంటుందని పేర్కొన్నారు.…