Political News

రాజధాని అంటే… ఆ 29 గ్రామాలే కాదు: చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు రాష్ట్ర రాజధాని పై తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌ధాని అమ‌రావ‌తి శాశ్వ‌తంగా ఉంటుంద‌ని పేర్కొన్నారు. అయితే.. రాజ‌ధాని అంటే.. కేవ‌లం 29 గ్రామాలు మాత్ర‌మే కాద‌ని ఆయ‌న పేర్కొన్నారు. విజ‌య‌వాడ‌, గుంటూరు కూడా దీనిలో భాగ‌మేన‌ని తెలిపారు. అదేస‌మయంలో మచిలీప‌ట్నం కూడా దీనిలో భాగంగా ఉంటుంద‌ని పేర్కొన్నారు. కేవ‌లం 29 గ్రామాల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యేలా రాజ‌ధానిని నిర్మించ‌డం లేద‌ని తెలిపారు. తొలుత అలా అనుకున్నా.. దానిని మార్పు చేశామ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

రాజ‌ధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ(సీఆర్ డీఏ)పై మంగ‌ళ‌వారం సాయంత్రం ఆయ‌న స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా రాజ‌ధాని వ్య‌వ‌హారంపై వైసీపీ నేత‌లు చేస్తున్న ప్ర‌చారాన్ని నాయ‌కులు, ప్ర‌భుత్వంలో భాగంగా ఉన్న ఉన్న‌తాధికారులు కూడా ఖండించా ల‌ని ఆయ‌న సూచించారు. ప్ర‌భుత్వం అంటే.. అధికారులు కూడా ఉంటార‌ని.. విధాన‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు, విమ‌ర్శ‌లు వ‌చ్చిన ప్పుడు.. ఉన్న‌తాధికారులు కూడా మీడియా ముందుకు రావాల‌ని చంద్ర‌బాబు సూచించారు. అన్నీ మంత్రులు, ఎమ్మెల్యేలే చూడాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

ఈ సంద‌ర్భంగా గ‌తంలో ఉన్న‌తాధికారులు మీడియా ముందుకు వ‌చ్చేవారని.. విధాన ప‌ర‌మైన విష‌యాల‌పై వారు వివ‌ర‌ణ కూడా ఇచ్చేవార‌ని చంద్ర‌బాబు తెలిపారు. కానీ, ప్ర‌స్తుతం ఐఏఎస్‌లు.. కేవ‌లం కార్యాల‌యాల‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతున్నార‌ని.. ఇది స‌రైన విధానం కాద‌న్నారు.. రాజ‌ధాని వంటి కీల‌క అంశాలు తెర‌మీదికి వచ్చిన‌ప్పుడు ఆధారాలు, వాస్త‌వాల‌తో అధికారులు మీడియాకు వివ‌రిస్తే.. ప్ర‌జ‌ల‌కు ఏం జ‌రుగుతోందో తెలుస్తుంద‌ని తెలిపారు. రాజ‌కీయంగా మీరు ఏమీ మాట్లాడాల్సి న అవ‌స‌రం లేద‌న్నారు. అది తాము చూసుకుంటామ‌న్నారు. ఇక‌, నుంచి సీఆర్ డీఏలో అధికార ప్ర‌తినిధుల‌ను ఏర్పాటు చేసి మీడియా ముందుకు రావాల‌ని ఆయ‌న సూచించారు.

నేను సైతం..

రాజ‌ధాని ప్రాంతంలో జ‌రుగుతున్న ప‌నుల‌ను తానే స్వ‌యంగాప‌రిశీలిస్తాన‌ని చంద్ర‌బాబు చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు మంత్రి నారాయ‌ణ మాత్ర‌మే నిత్యం రాజ‌ధానిలో ప‌ర్య‌టిస్తున్నార‌ని.. ఇక నుంచి తాను కూడా వారానికి మూడు రోజులు అమ‌రావ‌తిలో ప‌ర్య‌టించి ప‌నుల‌ను ప‌రిశీలిస్తాన‌న్నారు. త‌ద్వారా త్వ‌రిత గ‌తిన ప‌నులు పూర్త‌వుతాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. అధికారులు కూడా సాయంత్రం, ఉద‌యం వేళ‌ల్లో ప‌నులు జ‌రుగుతున్న ప్రాంతాల‌కు వెళ్లాల‌న్నారు. దీంతో కాంట్రాక్టు సంస్థ‌లు మ‌రింత బాధ్య‌త‌తో ప‌నిచేస్తాయ‌న్నారు. రాజ‌ధాని విష‌యంపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తిప్పికొట్టే బాధ్య‌త‌ను ఉన్న‌తాధికారులు కూడా తీసుకోవాల‌న్నారు. 

This post was last modified on July 29, 2026 2:23 pm

Share

Recent Posts

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

22 minutes ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

1 hour ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

8 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

9 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

10 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

11 hours ago