భాషతో సంబంధం లేకుండా ఇండియా వైడ్ క్రేజ్ ఉన్న ప్యాన్ ఇండియా సినిమాల్లో అల్లు అర్జున్ ‘రాకా’ టాప్ 3లో ఉంది. బడ్జెట్ ఎంతో బయటికి చెప్పడం లేదు కానీ ఆరు వందల కోట్లకు పైమాటేనని ఇన్ సైడ్ టాక్. అయితే ఇంత మొత్తం రికవరీ కావాలంటే దానికి రెట్టింపు గ్రాస్ రావాలి. ఒక్క భాగమే అయితే బ్రేక్ ఈవెన్ లో ఇబ్బందులు వస్తాయి కానీ అదే సీక్వెల్ మోడల్ లో వెళ్తే లాభాలు కళ్లజూడవచ్చు. కెజిఎఫ్, పుష్ప, బాహుబలి, కాంతార విషయంలో ఇది వసూళ్ల సాక్షిగా రుజువయ్యింది.
ఇప్పుడు రాకాని కూడా టూ పార్ట్ మోడల్ కి తేవాలని దర్శకుడు అట్లీ ఫిక్స్ అయ్యాడని యూనిట్ టాక్. ఎలాగూ లోకేష్ కనగరాజ్ సినిమా ఎంత లేదన్నా రిలీజ్ కావడానికి రెండేళ్లు పడుతుంది. ఈలోగా ఫ్యాన్స్ నిరాశ చెందకుండా రాకాని ఏడాదికో భాగం రిలీజ్ చేస్తే బాగుంటుందని, పలు చర్చల తర్వాత తీర్మానించుకున్నారని ఇన్ సైడ్ న్యూస్. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ఈ ఏడాది క్రిస్మస్ లోగా షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారట.
అసలు సమస్య వేరే ఉంది. రాకా రిలీజ్ డేట్ ఇంకా లాక్ చేయలేదు. 2027 మొదటి నాలుగు నెలలు సంక్రాంతి సినిమాలు ఆ తర్వాత వారణాసి, స్పిరిట్ ఆక్రమించుకున్నాయి. వేసవిలో డ్రాగన్ లాంటివి వస్తాయి. సో రాకాని ఎప్పుడు దింపాలనేది ఈ సమీకరణాలు అన్నీ చెక్ చేసుకుని డిసైడ్ చేసుకోవాలి. ఒకవేళ బన్నీ ఫలానా టైంలో వస్తున్నాడని తెలిస్తే ఇతర నిర్మాతలు దానికి తగ్గట్టు వేరే ఆప్షన్లు చూసుకుంటారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ కు ఎంత టైం పడుతుందనేదే పెద్ద ప్రశ్న
పర్ఫెక్షన్ కోసం పాకులాడే అట్లీ అంత ఈజీగా డేట్ డిసైడ్ చేయడం కష్టమే అనిపిస్తోంది. పైగా ప్రమోషన్లకు విడిగా సమయం కేటాయించాలి. రాకాకు ఇంటర్నేషనల్ స్టూడియోస్ పని చేయడంతో రాజమౌళి వారణాసిని మ్యాచ్ చేయడమో లేదా దాన్ని దాటే స్థాయిలో కంటెంట్ ఇవ్వడమో అట్లీ చేస్తాడని బన్నీ ఫ్యాన్స్ నమ్మకం పెట్టుకున్నారు. జక్కన్న లాగే ఇప్పటిదాకా ఫెయిల్యూర్ అన్నదే తెలియకుండా బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన అట్లీ ఇప్పుడీ రాకాతో ఇంకెంత రచ్చ చేయబోతున్నారో.
This post was last modified on July 29, 2026 2:26 pm
నాలుగు రోజులు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన చెన్నై లవ్ స్టోరీ తాలూకు కబుర్లు, ట్వీట్లే కనిపించాయి. మొదటి రోజు…
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు.. పట్టుమని ఒక్కగంట కూడా ప్రశాంతంగా జరగడం లేదు. సభ ప్రారంభం కాగానే అధికార, ప్రతిపక్ష సభ్యుల…
ఇప్పటి వరకు పుణ్యం వస్తుందని గుండు చేయించుకున్న వాళ్ళను చూసాం కానీ ఇప్పుడు పుణ్యం 15 వేల రూపాయల గిఫ్ట్…
సెల్ఫ్ గోల్స్ వేసుకోవడంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మించిన వాళ్లు లేరని…
ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర రాజధాని పై తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి శాశ్వతంగా ఉంటుందని పేర్కొన్నారు.…
ఏపీ సీఎం చంద్రబాబు అమలు చేస్తున్న రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్ట్(RTGS) రాష్ట్రంలోని అన్ని వ్యవ స్థలను పరిశీలిస్తున్న విషయం…