పోక్సో కేసులో బండి భగీరథ్ మే నెల 16వ తేదీన అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. చర్లపల్లి జైల్లో భగీరథ్ జ్యుడీషియల్ రిమాండ్ పై ఉన్నారు ఈ నేపథ్యంలోనే అతడిని పోలీసులు కస్టడీకి కోరకపోవడంపై ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు పోలీసులు భగీరథ్ ను కస్టడీకి కోరారు.
ఈ క్రమంలోనే భగీరథ్ ను మూడు రోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ మల్కాజ్ గిరి కోర్టు అనుమతించింది. అతడిని పేట్ బషీరాబాద్ పోలీసులు విచారణ జరుపనున్నారు.
వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. కానీ, కోర్టు మూడు రోజులకే అనుమతించింది. పోలీసుల విచారణలో ఏ విషయాలు వెల్లడి కాబోతున్నాయి అన్న అంశంపై సర్వత్ర ఉత్కంఠ ఏర్పడింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates