తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి రెండు వారాల కిందటే ముఖ్యమంత్రి పదవి చేపట్టారు సినీ స్టార్ విజయ్. అప్పట్నుంచి తనదైన నిర్ణయాలతో జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే స్కూళ్లు, ప్రార్థన మందిరాలకు దగ్గర్లో ఉన్న మద్యం దుకాణాలను రద్దు చేయడంతో ఆయనపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి.
తర్వాత కూడా మరి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నారు విజయ్. ఇప్పుడు ఒకే రోజు రెండు కీలక నిర్ణయాలతో వ్యవసాయ, సినీ రంగాల మీద ఆధారపడ్డ వారిని సంతోషంలో ముంచెత్తారు విజయ్.
తమిళనాడు రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులకు గొప్ప ఊరటనిస్తూ పాక్షిక రుణ మాఫీ ని ప్రకటించారు విజయ్. తమిళనాడులోని సహకార బ్యాంకుల ద్వారా రూ.50 వేలు అంతకంటే తక్కువ మొత్తం రుణాలు పొందిన వాళ్లంతా లోన్ కట్టాల్సిన అవసరం లేదని విజయ్ స్పష్టం చేశారు. దీని ప్రకారం తమళనాట 14.22 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.50 వేలు అంతకంటే తక్కువ రుణాలన్నీ మాఫీ కానున్నాయి.
విజయ్ సీఎం అయ్యాక తీసుకున్న అతి పెద్ద నిర్ణయం ఇది. దీని వల్ల రాష్ట్ర ఖజానాపై వేల కోట్ల భారం పడనున్నప్పటికీ విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు తమిళనాట ఇటు ఇండస్ట్రీ జనాలు.. అటు సినీ ప్రేమికులు కోరుకుంటున్న ఐదు షోల వరాన్ని విజయ్ అందించారు. డీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉండగా.. కొత్త సినిమాలకు అదనపు షోలు వేసుకోవడం పెద్ద సమస్యగా మారింది. అందుకోసం దరఖాస్తు చేసుకోవడం, పైరవీలు చేయడం, ప్రభుత్వం సెలక్టివ్గా అనుమతులు ఇవ్వడం.. ఇలా ఉండేది పరిస్థితి.
ఐతే విజయ్ ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేకంగా అనుమతులు పొందాల్సిన అవసరం లేకుండా, అన్ని కొత్త సినిమాలకు వారం పాటు ఐదు షోలు ప్రదర్శించుకునేలా జీవో ఇచ్చింది. దీంతో తమిళనాట ప్రతి పెద్ద సినిమాకూ అర్లీ మార్నింగ్ షోలు పడబోతున్నాయి ఇకనుంచి. పర్మిషన్ తీసుకోవడం ద్వారా బెనిఫిట్ షోలు వేసుకునే సౌలభ్యం కూడా వస్తుందని భావిస్తున్నారు. విజయ్ ప్రభుత్వం తీసుకున్న ఈ రెండు పెద్ద నిర్ణయాల పటల్ ఆయా వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
This post was last modified on May 26, 2026 6:30 am
ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…